Vaccine విధానంలో కోర్టు జోక్యం తగదు
అఫిడవిట్ దాఖలు చేసిన కేంద్రం
దిల్లీ: కరోనా వ్యాక్సిన్ ధరలు, టీకాల కొరతపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ.. కొవిడ్ వ్యాక్సినేషన్ విధానాన్ని కేంద్రం సమర్థించింది. ప్రస్తుత మహమ్మారి సంక్షోభం వేళ ప్రజాప్రయోజనాల దృష్ట్యా నిపుణులు, శాస్త్రీయ సలహాలతో టీకా విధానాన్ని రూపొందించామని తెలిపింది. ప్రజాప్రయోజనాల నిర్ణయాల్లో న్యాయవ్యవస్థ జోక్యం తగదని పేర్కొంది. ఈ మేరకు సుప్రీంకోర్టులో 218 పేజీల అఫిడవిట్ను దాఖలు చేసింది.
దేశంలో కరోనా పరిస్థితులు, కొవిడ్ నిర్వహణ, వ్యాక్సినేషన్ తదితర అంశాలపై సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. దీనిపై న్యాయస్థానం నేడు విచారణ జరపనుంది. ఈ నేపథ్యంలో కోర్టు నోటీసులపై ఆదివారం అర్ధరాత్రి కేంద్రం ఈ అఫిడవిట్ దాఖలు చేసింది. టీకా విధానంతో పాటు కొవిడ్ నిర్వహణను కేంద్రం ఇందులో వివరించింది. ‘‘కొవిడ్ మహమ్మారి పరిస్థితుల్లో దేశం అవలంబిస్తున్న విధానాలు, వ్యూహాలు పూర్తిగా వైద్య నిపుణులు, శాస్త్రీయ సలహాలతో చేపడుతున్నవే. వీటిలో న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోవడం తగదు. అలా చేస్తే మునుపెన్నడూ చూడని అనాలోచిత పరిణామాలను చూడాల్సి వస్తుంది’’ అని కేంద్రం అఫిడవిట్లో పేర్కొంది.
దేశంలో టీకా ధరలు సహేతుకమే గాక, దేశమంతటా ధరలు ఏకరీతిన ఉన్నాయని తెలిపింది. పోటీతత్వ మార్కెట్ ఏర్పాటు.. ప్రయివేటు వ్యాక్సిన్ తయారీదారులకు ప్రోత్సాహక డిమాండ్ను సృష్టించే పద్ధతిలో భాగంగానే టీకా ధరల్లోనే వ్యత్యాసాలు ఉన్నట్లు కేంద్రం పేర్కొంది. దీని ద్వారా ఉత్పత్తి పెరగడంతో పాటు విదేశీ టీకా తయారీదారులు కూడా దేశంలోకి వచ్చేందుకు ఆసక్తి చూపుతారని అభిప్రాయపడింది. తద్వారా వ్యాక్సిన్ల లభ్యతను పెంచొచ్చని తెలిపింది. అయితే ధరలు ఎలా ఉన్నప్పటికీ దేశవ్యాప్తంగా అందరికీ ఉచిత టీకా అందుతోందని కేంద్రం వివరించింది. 18-45 మధ్య వయస్కులకు అనేక రాష్ట్రాలు ఉచిత టీకాలు ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించింది.
ఈ సందర్భంగా కొవిడ్ నిర్వహణ గురించి కూడా కేంద్రం వివరించింది. కరోనా బాధితులు దేశంలో ఎక్కడైనా చికిత్స తీసుకునే వెసులుబాటును కల్పిస్తూ జాతీయ విధానంలో మార్పులు చేసినట్లు తెలిపింది. కొవిడ్ కేంద్రాలు, పడకలు, సిబ్బందిని పెంచామని, వైద్య విద్యార్థులను కూడా కొవిడ్ సేవల్లో భాగస్వాములను చేసినట్లు పేర్కొంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
TEAM INDIA: భారత జట్టుకు అలాంటి ఆటగాళ్లే కావాలి: మాజీ క్రికెటర్
-
General News
Telangana News: మళ్లీ విధుల్లోకి ఉపాధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్లు.. మంత్రి ఎర్రబెల్లి ఆదేశాలు
-
Politics News
Payyavula Keshav: చంద్రబాబు దిల్లీ వెళితే తాడేపల్లి ప్యాలెస్లో ప్రకంపనలు: పయ్యావుల
-
Politics News
Bandi Sanjay: తెరాస ప్రభుత్వం బీసీలను అణచివేస్తోంది: బండి సంజయ్
-
General News
Andhra News: రైతుకు దొరికిన వజ్రం.. ఎంతకు అమ్మాడో తెలుసా?
-
Politics News
RJD: అవును మోదీజీ.. మీరు చెప్పింది నిజమే..ఇప్పుడదే చేశాం..!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- T20 Matches: టీ20ల్లోకి ఎందుకు తీసుకోవడం లేదో నాకైతే తెలియదు!
- Maharashtra: రెండు నెలలు కాలే.. అప్పుడే లుకలుకలా..?
- Naga Chaitanya: అది నా పెళ్లి తేదీ.. దయచేసి ఎవరూ ఫాలో కాకండి: నాగచైతన్య
- Raghurama: వాళ్లిద్దరూ ఇష్టపడితే మనకేం ఇబ్బంది?: రఘురామ
- Spy Ship: వద్దంటున్నా.. శ్రీలంక వైపు వస్తున్న చైనా నిఘా నౌక
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (10/08/2022)
- Rudi Koertzen : రోడ్డు ప్రమాదంలో దిగ్గజ అంపైర్ మృతి.. స్పందించిన సెహ్వాగ్
- Chile sinkhole: స్టాట్యూ ఆఫ్ యూనిటీ మునిగేంతగా.. విస్తరిస్తోన్న చిలీ సింక్ హోల్..!
- Kolkata: బికినీ ధరించిన ప్రొఫెసర్.. రూ.99కోట్లు కట్టాలంటూ యూనివర్సిటీ ఆదేశం!
- Social Look: నయన్-విఘ్నేశ్ వెడ్డింగ్ ప్రోమో.. అనుపమ విజయవాడ ప్రయాణం..