UNLOCK: ఊపిరి పీల్చుకుంటున్న రాష్ట్రాలు!
దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ ధాటికి రాష్ట్రాలన్నీ వణికిపోయాయి. ఈ ప్రభావంతో ఏప్రిల్ నుంచి చాలా రాష్ట్రాలు కర్ఫ్యూ, లాక్డౌన్ ఆంక్షల్లోకి వెళ్లిపోయాయి.
పలు రాష్ట్రాల్లో మొదలైన కార్యకలాపాలు
దిల్లీ: దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ ధాటికి రాష్ట్రాలన్నీ వణికిపోయాయి. ఈ ప్రభావంతో ఏప్రిల్ నుంచి చాలా రాష్ట్రాలు కర్ఫ్యూ, లాక్డౌన్ ఆంక్షల్లోకి వెళ్లిపోయాయి. తాజాగా దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య రెండు నెలల అనంతరం కనిష్ఠంగా నమోదయ్యింది. దీంతోపాటు పలు రాష్ట్రాల్లో వైరస్ నియంత్రణలోకి రావడంతో ఆంక్షలను సడలిస్తున్నట్లు ఆయా రాష్ట్రాలు ప్రకటించాయి. ఇందులో భాగంగా దిల్లీ, తమిళనాడు, ఉత్తర్ప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర రాష్ట్రాలు ఆంక్షలను సడలించడంతో దుకాణాలు, కార్యాలయాలు తెరచుకున్నాయి.
దేశ రాజధానిలో ట్రాఫిక్ జామ్..
కరోనా ఉద్ధృతి తగ్గిన నేపథ్యంలో దేశ రాజధాని దిల్లీలో నేటినుంచి ఆంక్షల సడలింపునిచ్చారు. దీంతో షాపింగ్ మాల్స్, మార్కెట్లు తెరచుకున్నాయి. ప్రైవేటు కార్యాలయాలు కూడా 50శాతం సామర్థ్యంతో నిర్వహించుకునేందుకు ప్రభుత్వం వీలు కల్పించింది. దీంతో ప్రజలు తమ వాహనాలతో బయటకు రావడంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దుకాణాలకు మాత్రం ఉదయం పది నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు తెరచుకునేందుకు అనుమతి ఇచ్చారు. ఇక మూడు వారాలు పూర్తి స్తంభించిపోయిన మెట్రో రైలు సేవలు నేటి నుంచి అందుబాటులోకి వచ్చాయి.
మహారాష్ట్రలో ఐదు స్థాయిల్లో..
కరోనా ధాటికి వణికిపోయిన మహారాష్ట్రలో చాలా ప్రాంతాల్లో కరోనా తగ్గుముఖం పట్టింది. దీంతో వైరస్ తీవ్రతను బట్టి రాష్ట్రంలో జిల్లాలను ఐదు విభాగాలుగా వర్గీకరించిన అధికారులు, ఆంక్షలను సడలిస్తున్నారు. దీంతో ముంబయిలో రెస్టారెంట్లు, దుకాణాలు తెరచుకున్నాయి. అన్లాక్ వ్యూహంలో భాగంగా మెట్రో నగరాలను లెవల్-3లో ఉంచినందున థియేటర్లు, మల్టీప్లెక్సులపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఆర్టీసీ బస్సులు కూడా పూర్తి స్థాయిలో సేవలు అందిస్తున్నాయి.
ఉత్తర్ప్రదేశ్ కంటైన్మెంట్ జోన్లు మినహా..
కరోనా వైరస్ తీవ్రత ఉద్ధతి తగ్గినందున ఉత్తర్ప్రదేశ్లో లాక్డౌన్ ఆంక్షలను సడలించారు. మొత్తం 71 జిల్లాల్లో ఆంక్షలను ఎత్తివేయగా.. వారణాసి, ముజఫర్నగర్, గౌతమ్బుద్ధ్ నగర్, ఘజియాబాద్లలో కంటైన్మెంట్ జోన్లు లేని ప్రాంతాలల్లో ఆంక్షలను తొలగించారు. ఈ నాలుగు జిల్లాల్లో కరోనా క్రియాశీల కేసుల సంఖ్య 600కు తక్కువగా ఉండడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. లఖ్నవూ, గోరఖ్పూర్, మీరట్, షహారన్పూర్లలో పూర్తి స్థాయిలో ఆంక్షలు కొనసాగుతున్నాయి. అయితే, ఈ మినహాయింపు కేవలం వారంలో ఐదు రోజులు మాత్రమే ఉంటాయని.. వారాంతంలో ఆంక్షలు కొనసాగిస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
తమిళనాడులో సాయంత్రం ఐదు వరకు..
తమిళనాడులో కరోనా తీవ్రత కాస్త తగ్గినట్లు కనిపిస్తున్నట్లున్పటికీ పలు ప్రాంతాల్లో ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. దీంతో కోయంబత్తూర్ వంటి 11 హాట్జిల్లాలు మినహా మిగిలిన ప్రాంతాల్లో సడలింపు ఇచ్చారు. ఉదయం 6 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు వివిధ కార్యకలాపాలు సాగించుకునేందుకు అనుమతి ఇచ్చారు. ఆటోల్లో ఇద్దరు, క్యాబ్లలో ముగ్గురు చొప్పున ఈ-పాస్ సహాయంతో ప్రయాణించేందుకు అధికారులు అనుమతి ఇస్తున్నారు.
లాక్డౌన్ ఆంక్షలను సడలిస్తున్నట్లు గుజరాత్ ప్రభుత్వం ప్రకటించింది. దుకాణాలను తెరచుకునేందుకు ఉదయం 9గం. నుంచి సాయంత్రం 6గంటల వరకు అనుమతి ఇచ్చింది. వైరస్ తీవ్రత కొనసాగుతున్నందున హరియాణాలో జూన్ 14వరకు లాక్డౌన్ను పొడిగించారు. అయినప్పటికీ ఆంక్షలను సడలిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఉదయం పది నుంచి రాత్రి 8వరకు షాపింగ్ మాల్స్ తెరచుకునేందుకు అనుమతి ఇచ్చారు. రెస్టారెంట్లు, బార్లు, క్లబ్లు కూడా 50శాతం సామర్థ్యంతో నిర్వహించుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సిక్కీం లోనూ జూన్ 14వరకు లాక్డౌన్ పొడిగించినప్పటికీ పలు ఆంక్షల నుంచి సడలింపునిచ్చారు. ఇక కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో వైరస్ ఉద్ధృతి కొనసాగుతున్న దృష్ట్యా ఆంక్షలను మరికొన్ని రోజుల పాటు కొనసాగించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంపద పంచుతారంటూ మోదీ ఆరోపణలు.. రాహుల్ క్లారిటీ
Rahul Gandhi: ఎన్నికల మేనిఫెస్టోలో తాము ప్రతిపాదించిన ‘సామాజిక - ఆర్థిక సర్వే’ కేవలం అన్యాయాన్ని అంచనా వేయడానికి మాత్రమేనని రాహుల్ గాంధీ అన్నారు. చర్యలు తీసుకోవడానికి కాదంటూ క్లారిటీ ఇచ్చారు. -
వారసత్వ ఆస్తుల్నీ వదలరట: పిట్రోడా వ్యాఖ్యలపై మోదీ విమర్శలు
వారసత్వ పన్ను గురించి శామ్ పిట్రోడా (Sam Pitroda) చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా ప్రధాని మోదీ (Modi) చేసిన ప్రసంగంతో కాంగ్రెస్ మరింత ఇరకాటంలో పడింది. -
అది మీ రికార్డు పోలింగ్ కంటే ఎక్కువే..: పాశ్చాత్య మీడియాకు జై శంకర్ కౌంటర్
మన దేశ ఎన్నికలపై విదేశీ మీడియా స్పందించడానికి గల కారణాన్ని కేంద్రమంత్రి జై శంకర్ (S Jaishankar) వెల్లడించారు. -
‘సంపద స్వాధీనం’పై శామ్ పిట్రోడా వ్యాఖ్యలు.. మరోసారి వివాదంలో కాంగ్రెస్
శామ్ పిట్రోడా (Sam Pitroda) తన వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీని వివాదంలోకి నెట్టారు. దాంతో ఇప్పుడు హస్తం పార్టీ వివరణ ఇచ్చుకునే పరిస్థితి ఏర్పడింది. -
సుప్రీం సీరియస్.. మరోసారి పతంజలి బహిరంగ క్షమాపణలు
Patanjali: సుప్రీంకోర్టు ఆగ్రహం నేపథ్యంలో పతంజలి సంస్థ మరోసారి వార్తాపత్రికల్లో బేషరతుగా బహిరంగ క్షమాపణలు తెలియజేసింది. నిన్నటితో పోలిస్తే మరింత పెద్ద సైజులో ఈ ప్రకటనలు ఇచ్చింది. -
గోరఖ్పుర్ భాజపా అభ్యర్థి రవికిషన్ నా తండ్రే
ప్రముఖ నటుడు, ఉత్తర్ప్రదేశ్లోని గోరఖ్పుర్ లోక్సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి రవికిషన్ శుక్లా తన తండ్రి అంటూ తాజాగా జూనియర్ నటి షినోవా సోనీ బొంబాయి హైకోర్టును ఆశ్రయించారు. -
ఈ రాముడి చిత్రపటం.. ఓ భద్రతా పరికరం!
ఇంట్లో చోరీలను అరికట్టేందుకు గృహ భద్రత పరికరాన్ని రూపొందించారు గోరఖ్పుర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ కళాశాల విద్యార్థినులు. -
తూర్పు నుంచి దక్షిణానికి తీవ్ర వేడిగాలులు: ఐఎండీ
తూర్పు భారత రాష్ట్రాలను కుతకుతలాడిస్తున్న వేడిగాలులు దక్షిణ ప్రాంతాలకు వ్యాపించాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం వెల్లడించింది. -
రక్షణ వ్యయంలో భారత్ది నాలుగోస్థానం
ప్రపంచంలో రక్షణ వ్యయం అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. 2023లో మన దేశం ఈ రంగంపై 8,360 కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. -
తేలికపాటి తూటారక్షణ కవచం సిద్ధం
దేశంలోనే అత్యంత తేలికపాటి తూటారక్షణ కవచాన్ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) విజయవంతంగా రూపొందించింది. -
న్యాయవ్యవస్థ స్వతంత్రతకు ఎదురవుతున్న ముప్పును అడ్డుకోండి
న్యాయమూర్తులు రాజకీయాల్లో చేరేందుకు రెండేళ్లు వేచిఉండడాన్ని తప్పనిసరి చేయడం సహా చట్టంలో అనేక సవరణలు చేయాలని విజ్ఞప్తి చేస్తూ సీనియర్ న్యాయవాది ఆదీశ్ సి.అగర్వాలా మంగళవారం ప్రధాని మోదీకి లేఖ రాశారు. -
‘10 రోజుల్లో ఎంబీఏ’.. ఇలాంటి వాటితో జాగ్రత్త
ఆన్లైన్లో నకిలీ కోర్సులపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ప్రజలకు కీలక హెచ్చరిక చేసింది. -
వచ్చే ఏడాది భారత్కు ‘ఎస్-400’
రష్యా నుంచి మనదేశానికి అందాల్సిన రెండు రెజిమెంట్ల ఎస్-400 ట్రైయాంఫ్ గగనతల రక్షణ వ్యవస్థలు వచ్చే ఏడాదిలో అందే అవకాశం ఉంది. -
శుద్ధ ఇంధన రంగంలో కర్ణాటక, గుజరాత్ జోరు
శుద్ధ ఇంధనం దిశగా అడుగులు వేయడంలో కర్ణాటక, గుజరాత్ ముందంజలో ఉన్నాయని తాజా నివేదిక పేర్కొంది. -
ప్రజావంచనకు అవకాశం ఇవ్వొద్దు
పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల కేసు విచారణ పరిధిని సుప్రీంకోర్టు మరింత విస్తృతం చేసింది. ఇటీవల మరో కంపెనీ ఉత్పత్తి కూడా వివాదాస్పదమైన నేపథ్యంలో... త్వరగా అమ్ముడయ్యే వినియోగ వస్తు పరిశ్రమ(ఎఫ్ఎంసీజీ)ల వాణిజ్య ప్రకటనలనూ ఈ కేసు పరిధిలోకి తీసుకొచ్చింది. -
ఎట్టకేలకు కేజ్రీవాల్కు ఇన్సులిన్
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు తిహాడ్ జైలు అధికారులు ఎట్టకేలకు ఇన్సులిన్ ఇచ్చారు. కేజ్రీవాల్కు సోమవారం రాత్రి షుగర్ స్థాయిలు పెరగడం వల్ల తక్కువ మోతాదులో రెండు యూనిట్ల ఇన్సులిన్ ఇచ్చినట్లు తిహాడ్ జైలు అధికారులు మంగళవారం వెల్లడించారు. -
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విజయవంతం
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణికి సంబంధించిన ఒక నూతన వెర్షన్ను భారత్ మంగళవారం విజయవంతంగా పరీక్షించింది. -
12 ఏళ్ల లోపు పిల్లలకు తల్లిదండ్రుల దగ్గరే సీట్లు
విమానయాన సంస్థలకు పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) కీలక ఆదేశాలు జారీ చేసింది. 12 ఏళ్లలోపు పిల్లలకు వారి తల్లిదండ్రుల్లో కనీసం ఎవరో ఒకరి పక్కన సీటు కేటాయించాలని పేర్కొంది. -
మీ క్షమాపణలు.. ఆ ప్రకటనల సైజులో ఉన్నాయా?
యోగా గురు బాబా రాందేవ్, పతంజలి ఎండీ ఆచార్య బాలకృష్ణపై సుప్రీంకోర్టు ధర్మాసనం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. -
కేజ్రీవాల్, కవిత జ్యుడిషియల్ కస్టడీ మే 7 వరకు
మద్యం కేసులో మనీ లాండరింగ్కు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఈడీ అరెస్టు చేసిన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, భారాస ఎమ్మెల్సీ కవితల జ్యుడిషియల్ కస్టడీని ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 7వ తేదీ వరకు పొడిగించింది. -
ఉచిత పథకాలకు పార్టీలు స్వస్తి పలకాలి
తగిన ఆర్థిక వనరులు లేకుండా ఉచిత పథకాలను ప్రకటించే పద్ధతికి రాజకీయ పార్టీలు స్వస్తి పలకాలని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
జగన్పై రాయిదాడి కేసు.. సతీష్ కస్టడీకి కోర్టు అనుమతి
-
హార్దిక్.. ముందు నీ ఆటపై దృష్టిపెట్టు: వీరేంద్ర సెహ్వాగ్
-
అలాంటి చిత్రాల్లో ఇదీ ఒకటి.. ఫహాద్ ఫాజిల్ ‘ఆవేశం’కు సమంత రివ్యూ
-
5,000mAh బ్యాటరీ.. 50MP కెమెరాతో నార్జో సిరీస్లో కొత్త ఫోన్లు
-
ఇప్పటికీ సరైన కూర్పు కోసం ప్రయత్నిస్తున్నాం: స్టీఫెన్ ఫ్లెమింగ్
-
‘మంజుమ్మల్ బాయ్స్’ నిర్మాతలపై చీటింగ్ కేసు