Long Covid: దీర్ఘకాలిక కొవిడ్ రోగులకు అగ్రరాజ్యం అండ!
దీర్ఘకాలికంగా కరోనాతో బాధపడుతున్న వారికి అగ్రరాజ్యం అమెరికా అండగా నిలుస్తోంది. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక నిర్ణయం......
వాషింగ్టన్: దీర్ఘకాలికంగా కరోనాతో బాధపడుతున్న వారికి అగ్రరాజ్యం అమెరికా అండగా నిలుస్తోంది. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. దీర్ఘకాలికంగా కరోనా లక్షణాలు కలిగి ఉన్న రోగులను ఆ దేశ వికలాంగుల చట్టం పరిధిలోకి తీసుకొస్తున్నట్టు ప్రకటించారు. అమెరికాలో వికలాంగుల చట్టం 31వ వార్షికోత్సవం సందర్భంగా ఆయన తీసుకున్న ఈ ప్రత్యేక నిర్ణయం ప్రకారం.. దేశంలో ప్రత్యేక అవసరాలు కలిగిన వారికి ఉద్యోగం, తదితర అంశాల్లో అందుతున్న అవకాశాలు, సేవలు దీర్ఘకాలిక కొవిడ్ రోగులకూ వర్తించనున్నాయని యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్, డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ కొత్త మార్గదర్శకాల్లో పేర్కొన్నాయి.
కొన్ని వారాలు లేదా నెలల తరబడి కరోనాతో బాధపడుతున్నవారిలో అలసట, గుండె దడ, ఊపిరితీసుకోవడంలో ఇబ్బంది, బ్రెయిన్ ఫాగ్ లేదా ఆలోచన, ఏకాగ్రత మందగించడం వంటి లక్షణాలు తలెత్తుతున్నాయని తెలిపాయి. దీంతో వారంతా తమ పనులు తాము చేసుకోవడం, ఇతరులతో సంభాషించడం, నడక, తినడం, నిద్రపోవడం వంటి ప్రాథమిక కార్యకలాపాలకే పరిమితమవుతున్నారని పేర్కొంది. అయితే, దీర్ఘకాలిక కొవిడ్ రోగులు ఈ చట్టం పరిధిలోకి వచ్చేందుకు దరఖాస్తు చేసుకోవాలంటే తమలో లక్షణాలు ఉన్నట్టు నిర్దారించుకోవాల్సి ఉంటుంది. ఈ చట్టం పరిధిలోకి వచ్చేందుకు అర్హత పొందినవారు ఆ దేశంలో వైకల్యంతో బాధపడుతున్న మిగతా వారిలాగే రాయితీలు పొందనున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
APSRTC: శ్రీశైలం వెళ్లే భక్తులకు ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ
-
Sports News
Asia Cup 2023: ‘వారు నరకానికి పోవాలనుకోవడం లేదు’’..: వెంకటేశ్ ప్రసాద్
-
General News
KTR: హైదరాబాద్లో డబుల్ డెక్కర్ బస్సులు.. ప్రారంభించిన మంత్రి కేటీఆర్
-
General News
Supreme Court: ఎమ్మెల్యేలకు ఎర కేసు.. అత్యవసర విచారణకు సీజేఐకి విజ్ఞప్తి
-
World News
Mumbai terror attacks: 2008 ఉగ్రదాడి గాయం గుర్తులు ఇంకా మానిపోలేదు: అమెరికా
-
Politics News
Balasaheb Thorat: మహారాష్ట్రలో కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్.. పార్టీ పదవికి థోరట్ రాజీనామా!