8ఏళ్లు.. 14 ఓడలు.. సూయిజ్ కాలువలోనే
అంతర్జాతీయ వాణిజ్యానికి జీవనాడి లాంటిదైన సూయిజ్ కాలువలో ఇప్పుడు రాకపోకలు నిలిచిపోయాయి. ఐదు రోజుల కిందట కాలువలో అడ్డం తిరిగిన ఓ భారీ కంటైనర్ నౌక..
ఈజిప్టు-ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో సుదీర్ఘంగా కాలువ మూసివేత
అంతర్జాతీయ వాణిజ్యానికి జీవనాడి లాంటిదైన సూయిజ్ కాలువలో ఇప్పుడు రాకపోకలు నిలిచిపోయాయి. ఐదు రోజుల కిందట కాలువలో అడ్డం తిరిగిన ఓ భారీ కంటైనర్ నౌక.. కోట్లాది డాలర్ల వాణిజ్యాన్ని ముంచేస్తోంది. అయితే ప్రపంచంలోనే అత్యంత కీలక షిప్పింగ్ మార్గమైన సూయిజ్లో ఇలా రవాణా బంద్ అవడం ఇదే తొలిసారి కాదు. దాదాపు ఐదు దశాబ్దాల కిందట ఈ కెనాల్ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘంగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఫలితంగా 14 నౌకలు 8ఏళ్ల పాటు సూయిజ్ జలాల్లో నిలిచిపోవాల్సి వచ్చింది.
ఎర్ర సముద్రం మీదుగా మధ్యధరా సముద్రం, హిందూ మహాసముద్రాలను కలిపే మానవనిర్మితమైన సన్నని కాలువే సూయిజ్. ఆసియా, ఆఫ్రికాల మధ్య ఉన్న ఈ కాలువ పొడవు 193 కిలోమీటర్లు. ఈజిప్టులో ఉండే ఈ కీలక జల మార్గాన్ని 1869లో ప్రారంభించారు. 1967లో ఈజిప్టు -ఇజ్రాయెల్ల మధ్య పరిస్థితులు ఉద్రిక్తంగా మారి యుద్ధానికి దారితీశాయి. 1967 జూన్ 5న ఇరు దేశాల మధ్య యుద్ధం మొదలైంది. సరిగ్గా అదే సమయంలో 14 కార్గో ఓడలు సూయిజ్ జలాల్లోకి ప్రవేశించాయి. అయితే ఈ కాలువను యుద్ధ జోన్గా ప్రకటించిన ఈజిప్టు.. నౌకలను గ్రేట్ బిట్టర్ సరస్సు వద్ద నిలిచిపోవాలని ఆదేశించింది. దీంతో నౌకలు అక్కడే ఆగిపోయాయి.
ఆరు రోజుల యుద్ధం తర్వాత సూయిజ్ కాలువ తూర్పు తీరాన్ని ఇజ్రాయెల్ స్వాధీనం చేసుకుంది. పశ్చిమప్రాంతం మాత్రం ఈజిప్టు ఆధీనంలో ఉంది. అయితే ఇజ్రాయెల్ ఈ కెనాల్ను ఉపయోగించుకోకూడదనే ఉద్దేశంతో ఈజిప్టు దీన్ని పూర్తిగా మూసేసింది. నౌకల రాకపోకలు జరగకుండా కాలువ చివర్లలో పెద్ద పెద్ద లాండ్మైన్లు, పాత ఓడలను నిలిపింది. దీంతో ఆ 14 నౌకలు సూయిజ్ నుంచి బయటకు రాలేకపోయాయి.
8ఏళ్లు జలాల్లోనే..
అలా రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచినా సూయిజ్ను తిరిగి ప్రారంభించకపోవడంతో నౌకలు కాలువను దాటలేకపోయాయి. 1973లో ఈజిప్టు, ఇజ్రాయెల్ మధ్య రెండోసారి యుద్ధం జరిగింది. ఈసారి రెండువైపులా భారీ ఆస్తి, ప్రాణనష్టం సంభవించింది. దీంతో రెండు దేశాలు ఒప్పందానికి వచ్చాయి. కెనాల్కు ఇరువైపులా బలగాల ఉపసంహరణ మొదలైంది. అయితే కాలువను మూసివేసేందుకు ఉపయోగించిన శిథిలాలు, పాత ఓడలను తొలగించేందుకు దాదాపు రెండేళ్లు పట్టింది. అలా 1975 జూన్ 5న.. అంటే సరిగ్గా కెనాల్ను మూసేసిన 8ఏళ్ల తర్వాత తిరిగి సూయిజ్ను తెరిచారు. దీంతో మళ్లీ రాకపోకలు మొదలయ్యాయి.
ఓడల కోసం సిబ్బందిని మారుస్తూ..
కాలువలో మూడు నెలలు ఉన్న తర్వాత నౌక సిబ్బంది ఇంటికి వెళ్లేందుకు ఈజిప్టు ప్రభుత్వం అనుమతి కల్పించింది. అయితే ఓడలను మాత్రం అక్కడే ఉంచాలని ఆదేశించింది. కానీ నౌక యజమానులు మాత్రం అందుకు సుముఖత చూపించలేదు. ఓడల రక్షణ కోసం సిబ్బందిని రొటేషన్ పద్ధతిలో పంపించాయి. ఆ సమయంలో ఈ నౌకల్లో ఉన్న సిబ్బంది గ్రేట్ బిట్టర్ లేక్ అసోసియేషన్ పేరుతో ఓ సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఒక నౌకను థియేటర్, ఒక నౌకలో చర్చి, ఒక నౌకను హాస్పిటల్గా మార్చుకున్నారు.
ఆటపాటలతో సేదతీరి..
సూయిజ్ కాలువలో ఉన్న సమయంలో నౌకా సిబ్బంది ఆటపాటలతో సేద తీరేవారు. 1968లో సొంతంగా ఒలింపిక్స్ పేరుతో ఆటలపోటీలు పెట్టుకున్నారు. రికార్డుల ప్రకారం.. దాదాపు 3వేల మంది సిబ్బంది ఈ నౌకల్లో దశలవారీగా విధులు నిర్వహించినట్లు తెలుస్తోంది.
ఎల్లో ఫ్లీట్..
సూయిజ్లో చిక్కుకుపోయిన నౌకలు బల్గేరియా, చెకొస్లోవేకియా, ఫ్రాన్స్, పోలాండ్, స్వీడన్, పశ్చిమ జర్మనీ, యూకే, అమెరికా దేశాలకు చెందినవి. తదనంతరకాలంలో వీటిని ఎల్లో ఫ్లీట్గా పిలిచారు. ఏళ్ల తరబడి సూయిజ్ కెనాల్లో ఉండిపోవడంతో ఎడారి ఇసుక నౌకలను పూర్తిగా కప్పేసింది. చూడటానికి పసుపురంగులో ఉండటంతో వీటిని ఆ పేరుతో పిలిచారు.
ఎనిమిదేళ్ల తర్వాత వీటిల్లో చాలా నౌకలు స్వయంగా కాలువను దాటలేకపోయాయి. ఒక్క జర్మనీకి చెందిన రెండు ఓడలను సిబ్బంది నడుపుతూ బయటకు రాగా.. మిగతా వాటిని ఇతర నౌకల సాయంతో లాక్కుని రావాల్సి వచ్చింది.
ఇంటర్నెట్డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘పన్ను ఉగ్రవాదాన్ని ఆపండి’.. రూ.1823 కోట్ల నోటీసులపై కాంగ్రెస్ మండిపాటు
ఆదాయ పన్ను విభాగం నుంచి నోటీసు రావడంపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. లోక్సభ ఎన్నికలకు ముందు తమను ఆర్థికంగా కుంగదీసేందుకు భాజపా పన్ను ఉగ్రవాదానికి పాల్పడుతోందని ఆరోపించింది. -
కేజ్రీవాల్ కోసం మెసేజ్లు పంపండి.. వాట్సప్ నంబరు షేర్ చేసిన సతీమణి
Sunita Kejriwal: ఈడీ కస్టడీలో ఉన్న దిల్లీ సీఎం కేజ్రీవాల్కు మద్దతుగా ఆయన సతీమణి సునీత వాట్సప్ ప్రచారాన్ని ప్రారంభించారు. -
కేజ్రీవాల్ ఫోన్లోని ఎన్నికల వ్యూహాల కోసం.. ఈడీ ప్రయత్నాలు: ఆతిశీ
Arvind Kejriwal: కస్టడీలో ఉన్న దిల్లీ సీఎం కేజ్రీవాల్ ఫోన్ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ వ్యూహాలను తెలుసుకునేందుకు ఈడీ ప్రయత్నిస్తోందని ఆప్ మంత్రి ఆతిశీ ఆరోపించారు. -
ఉత్తర్ప్రదేశ్లో హైఅలర్ట్.. గ్యాంగ్స్టర్ ముఖ్తార్ మృతిపై కుటుంబం అనుమానాలు!
Mukhtar Ansari: గ్యాంగ్స్టర్, రాజకీయ నాయకుడు ముఖ్తార్ అన్సారీ మృతితో యూపీలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. మరోవైపు కుటుంబ సభ్యులు మాత్రం ఆయన గుండెపోటుతో మరణించలేదని ఆరోపిస్తున్నారు. -
కాంగ్రెస్కు మళ్లీ షాక్.. రూ.1800 కోట్ల పన్ను నోటీసులు
Congress: కాంగ్రెస్కు ఆదాయపు పన్ను విభాగం రూ.1800 కోట్లకు నోటీసులిచ్చింది. ఈ వ్యవహారంపై పార్టీ వేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టేసిన మరుసటి రోజే ఈ పరిణామం చోటుచేసుకుంది. -
ప్రధాని మోదీ, బిల్గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
Modi-Bill Gates: ప్రధాని మోదీతో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్గేట్స్ ‘చాయ్ పే చర్చ’లో పాల్గొన్నారు. డిజిటల్ విప్లవం, ఆరోగ్యం, విద్య తదితర అంశాలపై ఇరువురు చర్చించారు. -
‘అగ్నివీర్’లో మార్పులకు సిద్ధం: రాజ్నాథ్
ప్రస్తుతం అమలవుతున్న అగ్నివీర్/అగ్నిపథ్ నియామక పథకంలో అవసరమైతే మార్పులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. -
టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం చేసిన ఎంపీ కన్నుమూత
ఎన్నికల ముంగిట తమిళనాడులో విషాదం చోటుచేసుకుంది. టికెట్ దక్కలేదనే మనస్తాపంతో ఈ నెల 24న ఆత్మహత్యాయత్నం చేసిన ఈరోడ్ ఎంపీ, ఎండీఎంకే సీనియర్ నేత ఎ.గణేశమూర్తి(77) కోయంబత్తూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం చనిపోయారు. -
తేజస్ ఎంకే1ఏ తొలి విహారం విజయవంతం
తేజస్ ఎంకే1ఏ శ్రేణిలో రూపొందిన యుద్ధ విమానం ఎల్ఏ-5003 తన తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) ఈ యుద్ధ విమానాన్ని రూపొందించింది. -
ఐరాస సెక్రటరీ జనరల్ ప్రత్యేక ప్రతినిధిగా కమల్ కిశోర్
జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్డీఎంఏ) ఉన్నతాధికారి కమల్ కిశోర్ (55).. ఐక్యరాజ్యసమితి(ఐరాస) సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ప్రత్యేక ప్రతినిధిగా నియమితులయ్యారు. -
గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో ఆస్పత్రిలో మృతి
ఉత్తర్ప్రదేశ్ జైలులో శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్స్టర్, రాజకీయవేత్త ముఖ్తార్ అన్సారీ (63) గురువారం గుండెపోటుతో మృతిచెందినట్లు బాందాలోని రాణీ దుర్గావతి వైద్య కళాశాల ప్రిన్సిపల్ సునీల్ కౌశల్ ప్రకటించారు. -
‘కాలివేళ్లతో’ విధిరాత లిఖించుకున్న అపరబ్రహ్మ
సంకల్పబలం ఉంటే లక్ష్య సాధనకు ఏ వైకల్యమూ అడ్డుకాదని నిరూపిస్తున్నారు ఉత్తరాఖండ్కు చెందిన 58 ఏళ్ల దేవ్కీనందన్ శర్మ. -
ఎలాంటి తప్పూ జరగలేదు
నేషనల్ ఏవియేషన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఏసీఐఎల్) విమానాల లీజు అంశంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని సీబీఐ పేర్కొంది. -
ఈస్టర్ రోజున పనిదినం.. వెనక్కు తగ్గిన మణిపుర్ ప్రభుత్వం
ఈస్టర్ రోజును పనిదినంగా ప్రకటిస్తూ మణిపుర్ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను గురువారం వెనక్కు తీసుకుంది. -
కేజ్రీవాల్ పాస్వర్డులు చెప్పలేదు
మద్యం విధానానికి సంబంధించిన కేసులో అరెస్టయిన దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ 4 డిజిటల్ పరికరాల పాస్వర్డులను చెప్పలేదని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తెలిపింది. -
మరోసారి తండ్రైన పంజాబ్ సీఎం మాన్
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్(50) మరోసారి తండ్రయ్యారు. ఆయన సతీమణి గుర్ప్రీత్ కౌర్ గురువారం పండంటి పాపకు జన్మనిచ్చారు. -
మేం జోక్యం చేసుకోలేం
మద్యం విధానానికి సంబంధించిన కేసులో అరెస్టయిన ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ను సీఎం పదవి నుంచి తప్పించాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) దిల్లీ హైకోర్టు గురువారం కొట్టివేసింది. -
ఐరాస శాంతి పరిరక్షకుల నేరాలపై డేటాబేస్ ప్రారంభించిన భారత్
ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షకులపై నమోదైన నేరాల నిక్షిప్తానికి, సదరు నిందితుల విచారణలో పురోగతిని పర్యవేక్షించడానికి భారతదేశం కొత్త డేటాబేస్ను రూపొందించిందని ఐరాస భారత ప్రతినిధి రుచిరా కాంబోజ్ గురువారం తెలిపారు. -
నెట్ మార్కుల ఆధారంగా పీహెచ్డీ ప్రవేశాలు: యూజీసీ
వచ్చే విద్యా సంవత్సరం నుంచీ జాతీయ అర్హత పరీక్ష (ఎన్ఈటీ) మార్కుల ఆధారంగా పీహెచ్డీ ప్రవేశాలు కల్పించనున్నట్లు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) తెలిపింది. -
అండర్ గ్రాడ్యుయేట్ ప్రవేశాలకు కామన్ కౌన్సెలింగుకు యోచన!
మెడికల్, ఇంజినీరింగ్ కోర్సుల తరహాలో సీయూఈటీ (కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్) మార్కుల ఆధారంగా అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల ప్రవేశాలకు కామన్ కౌన్సెలింగు నిర్వహించాలని యూజీసీ యోచిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. -
గురుద్వారా కర్ సేవా చీఫ్పై కాల్పులు
ఉత్తరాఖండ్లోని ఉధాంసింగ్ నగర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. నానక్మత్తా సాహిబ్ గురుద్వారాకు చెందిన డేరా కర్ సేవా చీఫ్ బాబా తర్సేమ్ సింగ్ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు.
తాజా వార్తలు (Latest News)
-
కోహ్లీ అటువైపు చూస్తే ఏమవుతుందో..: బెంగళూరు మాజీ క్రికెటర్
-
రివ్యూ: టిల్లు స్క్వేర్.. సిద్ధు, అనుపమ జోడీ మేజిక్ చేసిందా?
-
షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి ఐపీఓ.. రూ.7,000 కోట్ల సమీకరణ!
-
‘పన్ను ఉగ్రవాదాన్ని ఆపండి’.. రూ.1823 కోట్ల నోటీసులపై కాంగ్రెస్ మండిపాటు
-
9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు తెదేపా అభ్యర్థులు వీళ్లే..
-
జగన్ పని దొంగ.. దోపిడీదారుడు: చంద్రబాబు