Train Derailed: పట్టాలు తప్పిన ఎల్‌టీటీ-జయనగర్‌ రైలు

ముంబయిలోని లోకమాన్య తిలక్‌ టెర్మినల్‌(ఎల్టీటీ) నుంచి జయనగర్‌కు బయల్దేరిన పవన్‌ ఎక్స్‌ప్రెస్‌లో పది రైలు పెట్టెలు మహారాష్ట్రలోని నాసిక్‌ సమీపంలో పట్టాలు తప్పాయి.

Published : 03 Apr 2022 23:32 IST

నాసిక్‌: ముంబయిలోని లోకమాన్య తిలక్‌ టెర్మినల్‌(ఎల్టీటీ) నుంచి జయనగర్‌కు బయల్దేరిన పవన్‌ ఎక్స్‌ప్రెస్‌లో పది రైలు పెట్టెలు మహారాష్ట్రలోని నాసిక్‌ సమీపంలో పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో ఎవరూ చనిపోలేదని, ప్రయాణికులకు పెద్దగా గాయాలు కాలేదని రైల్వే అధికారి ఒకరు తెలిపారు. ప్రమాదస్థలిలో సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ఈ మార్గంలో ప్రయాణించే కొన్ని రైళ్లను అధికారులు మళ్లించారు. మరికొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని