మధ్యప్రదేశ్ అత్యాచార ఘటన.. నిందితుడి ఇంటిపైకి బుల్డోజర్..!
Madhya Pradesh Rape Horror: మధ్యప్రదేశ్ అత్యాచార ఘటనలో ప్రధాన నిందితుడి ఇంటిని కూల్చివేసేందుకు అధికారులు నిర్ణయించారు. అది అక్రమ కట్టడమని తేల్చినట్లు తెలిపారు.
భోపాల్: సభ్యసమాజం తలదించుకునే రీతిలో మధ్యప్రదేశ్ (Madhya Pradesh)లోని ఉజ్జయిని (Ujjain)లో ఓ బాలికపై జరిగిన ఘోర అత్యాచార ఘటన (Rape Horror)లో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన భరత్ సోని ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. అయితే, ఉజ్జయినిలోని అతడి ఇంటిని అధికారులు కూల్చివేసేందుకు (Demolition) సిద్ధమయ్యారు. అది అక్రమ కట్టడమని అధికారులు చెబుతున్నారు.
నిందితుడు భరత్ సోని కుటుంబం కొన్నేళ్లుగా ప్రభుత్వ భూమిలో నివాసముంటున్నట్లు గుర్తించామని ఉజ్జయిని మున్సిపల్ కమిషనర్ రోషన్ సింగ్ వెల్లడించారు. అందుకే, కూల్చివేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ‘‘వారు ఉంటున్న భూమి ప్రభుత్వానికి చెందినది. అందువల్ల కూల్చివేత కోసం ఎలాంటి నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదు. రాష్ట్ర పోలీసులతో కలిసి బుధవారం ఆ అక్రమ కట్టడాన్ని కూల్చివేయనున్నాం’’ అని మున్సిపల్ కమిషనర్ తెలిపారు.
ఆగని మృత్యుఘోష.. నాందేడ్ ఆసుపత్రిలో మరో ఏడుగురు రోగుల మృతి
అత్యాచారానికి గురైన ఆ బాలిక రక్తమోడుతూ, అర్ధనగ్నంగా వీధుల్లో తిరుగుతూ సాయం కోసం ప్రాధేయపడిన దృశ్యాలు సెప్టెంబరు 26 వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. చిన్నారి దీన స్థితిని పట్టించుకోకుండా స్థానికులు ఛీత్కరించుకోవడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. దాదాపు రెండు గంటలపాటు ఆమె వందల ఇళ్లు, దాబాలు, టోల్ బూత్ల మీదుగా వెళ్లినా ఎవరూ సాయం చేయలేదు. చివరికి ఓ ఆలయ పూజారి ముందుకొచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చాడు.
ఈ ఘటన వెలుగులోకి రాగానే.. దర్యాప్తు చేపట్టిన పోలీసులు వందల మందిని విచారించారు. దాదాపు 700 కెమెరాల్లో నిక్షిప్తమైన దృశ్యాలను విశ్లేషించారు. అనంతరం ఆటో డ్రైవర్గా పనిచేస్తున్న భరత్ సోనిని ప్రధాన నిందితుడిగా గుర్తించి అరెస్టు చేశారు. అతడిని విచారిస్తూ ఆధారాల సేకరణ కోసం ఘటనాస్థలికి తీసుకువెళ్లగా తప్పించుకునే ప్రయత్నం చేశాడు. పోలీసులు వెంటనే స్పందించి నిర్బంధించారు. అతడికి మరణ శిక్ష విధించాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు మధ్యప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ.. ఈ ఘటన రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
JEE Main 2024: జేఈఈ మెయిన్కు దరఖాస్తు చేసేవారికి బిగ్ అప్డేట్
జేఈఈ మెయిన్ దరఖాస్తుల గడువును ఎన్టీఏ పొడిగించింది. ఈ కింద ఇచ్చిన లింక్పై క్లిక్ చేయడం ద్వారా దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. -
Indian Navy: భారత నౌకాదళం చేతికి మూడు అత్యాధునిక నౌకలు..!
శత్రు జలాంతర్గములను ఎదుర్కొనేందుకు భారత్ నౌకాదళానికి అదనపు శక్తి లభించింది. మూడు సరికొత్త యుద్ధ నౌకలు నేడు నౌకాదళానికి అందుబాటులోకి వచ్చాయి. -
కేజ్రీవాల్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) నియామకం విషయంలో కేంద్రంతో నెలకొన్న వివాదంలో దిల్లీలోని కేజ్రీవాల్ సర్కారుకు ఎదురుదెబ్బ తగిలింది. -
విమానంలో భార్యాభర్తల గొడవ.. దారి మళ్లించి దిల్లీలో దించివేత
బ్యాంకాక్కు బయలుదేరిన మ్యూనిక్ - బ్యాంకాక్ ‘లుఫ్తాన్సా’ విమానాన్ని బుధవారం దారి మళ్లించి దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దింపారు. -
విధానసౌధ వాకిట గజరాజులు
చారిత్రక బెంగళూరు విధానసౌధ ఆవరణలో అసలైన ఏనుగులను తలపించేలా గజరాజుల బొమ్మలు ఏర్పాటు చేశారు. -
గవర్నర్ ఏడీసీగా తొలిసారిగా మహిళ
దేశంలో గవర్నర్ ఏడీసీ (ఎయిడ్ ది క్యాంప్)గా తొలిసారి ఓ మహిళ నియమితులయ్యారు. ఇండియన్ ఎయిర్ఫోర్స్ 2015 బ్యాచ్కు చెందిన స్క్వాడ్రన్ లీడర్ మనీషా పాఢిని తన ఏడీసీగా నియమిస్తూ మిజోరం గవర్నర్ కంభంపాటి హరిబాబు బుధవారం ఉత్తర్వులిచ్చారు. -
భారత్కు తిరిగొచ్చిన అంజూ
ఫేస్బుక్లో పరిచయమైన యువకుడి కోసం పాకిస్థాన్కు వెళ్లి.. అక్కడే రెండోపెళ్లి చేసుకున్న మధ్యప్రదేశ్లోని గ్వాలియర్కు చెందిన వివాహిత అంజూ (34) తిరిగి భారత్కు వచ్చింది. -
81.35 కోట్ల మందికి అయిదేళ్లపాటు ఉచితంగా ఆహార ధాన్యాలు
వ్యవసాయానికి మహిళా సంఘాల ద్వారా డ్రోన్ల సాయం.. ప్రధాన మంత్రి జన్జాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ ద్వారా గిరిజనుల అభివృద్ధి.. 81.35 కోట్ల మందికి ఐదేళ్లపాటు ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ.. వంటి కీలక నిర్ణయాలకు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. -
భారత్లో అసాధారణ వాతావరణం
భారత్లో ఈ ఏడాది మొదటి తొమ్మిది నెలల్లో సుమారు ప్రతిరోజు అసాధారణ వాతావరణ పరిణామాలు చోటుచేసుకున్నాయని బుధవారం తాజా అధ్యయనం ఒకటి పేర్కొంది. -
2026 ఆగస్టు నాటికి తొలి బుల్లెట్ రైలు
అహ్మదాబాద్ - ముంబయి మార్గంలో అందుబాటులోకి రానున్న బుల్లెట్ రైలు ప్రాజెక్టులో కొంతభాగం 2026 ఆగస్టు నాటికి సిద్ధం కానుందని రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. -
మేం దిల్లీ వీడుతాం!
ముంబయి, దిల్లీ నగర వాసులను వాయు కాలుష్యం బెంబేలెత్తిస్తోంది. దీని బారి నుంచి తప్పించుకోవడానికి ఇతర ప్రాంతాలకు వెళ్లే యోచన కూడా చేస్తున్నారు. -
సంక్షిప్త వార్తలు
హిమాలయ ప్రాంత పర్యావరణ వ్యవస్థ సున్నితత్వం, సంక్లిష్టతలను సిల్క్యారా సొరంగ ప్రమాద ఘటన మన కళ్లకు కట్టింది. ఇక్కడి ప్రాజెక్టుల మదింపు ప్రక్రియ వైఫల్యం కూడా వెలుగులోకి వచ్చింది. -
సొరంగం నుంచి కుమారుడు బయటకు రావడానికి కొన్ని గంటల ముందే తండ్రి మరణం
సిల్క్యారా సొరంగంలో చిక్కుకున్న తన కుమారుడి కోసం 16 రోజులు ఊపిరి బిగపట్టి ఎదురుచూసిన ఓ తండ్రి.. చివరకు తన బిడ్డ బయటకు రావడానికి కొన్ని గంటల ముందు కన్నుమూసిన హృదయ విదారక ఘటన ఇది. -
చైనాలో శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల కలకలం.. భారత్లో 6 రాష్ట్రాలు అప్రమత్తం
చైనాలో గత కొంతకాలంగా చిన్నారుల్లో వ్యాపిస్తున్న శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల్లు ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురిచేస్తున్నాయి. -
గురుపత్వంత్ హత్యకు కుట్రపై దర్యాప్తునకు కమిటీ
సిక్స్ ఫర్ జస్టిస్’ నాయకుడు గురుపత్వంత్ సింగ్ పన్నును అమెరికా భూభాగంపై హతమార్చేందుకు కుట్ర పన్నారన్న ఆరోపణలపై విచారణకు ఓ ఉన్నతస్థాయి కమిటీని భారత్ ఏర్పాటు చేసింది. -
దిల్లీ విమానం ఆరున్నర గంటల ఆలస్యం
దిల్లీ విమాన సర్వీస్ ఆరున్నర గంటలు ఆలస్యంగా వెళ్లిన సంఘటన శంషాబాద్ విమానాశ్రయంలో బుధవారం చోటు చేసుకుంది. -
16వ ఆర్థిక సంఘానికి శ్రీకారం
కేంద్ర ప్రభుత్వం 16వ ఆర్థిక సంఘం ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. దానికి సంబంధించిన విధి విధానాలకు ప్రధాని మోదీ అధ్యక్షతన మంగళవారం రాత్రి జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోద ముద్ర వేసింది. -
మణిపుర్లో శాంతి వీచిక
జాతుల ఘర్షణలతో అట్టుడికిన మణిపుర్లో శాంతియుత పరిస్థితులకు కీలక ముందడుగు పడింది. -
గంటన్నరలో బాలుడి ఆచూకీ కనుగొన్న పోలీసు జాగిలం లియో
ముంబయిలో అపహరణకు గురైన ఆరేళ్ల బాలుడి జాడను పోలీసు జాగిలం ‘లియో’ కేవలం గంటన్నర వ్యవధిలో గుర్తించింది. -
కౌన్బనేగా కరోడ్పతిలో రూ.కోటి గెలుచుకున్న 14 ఏళ్ల బాలుడు
బాలీవుడ్ దిగ్గజం అమితాబ్బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న గేమ్ షో ‘కౌన్ బనేగా కరోడ్పతి’ (కేబీసీ)లో 14 ఏళ్ల బాలుడు ఏకంగా రూ.కోటి గెలుచుకొని రికార్డు సృష్టించాడు. -
విద్వేష ప్రసంగాలపై చర్యలకు ప్రత్యేక పాలనా యంత్రాంగం
దేశవ్యాప్తంగా విద్వేష ప్రసంగాల కట్టడికి పాలనా యంత్రాంగాన్ని నెలకొల్పే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు సుప్రీంకోర్టు బుధవారం వెల్లడించింది.


తాజా వార్తలు (Latest News)
-
Modi: కుర్చీ పట్టుకోమ్మా..లేకపోతే ఆమె కూర్చుంటుంది..!: చమత్కరించిన మోదీ
-
JEE Main 2024: జేఈఈ మెయిన్కు దరఖాస్తు చేసేవారికి బిగ్ అప్డేట్
-
Jerusalem: జెరూసలెంలో ఉగ్రదాడి.. ముగ్గురు మృతి..!
-
holidays list: ఏపీలో వచ్చే ఏడాది 20 సాధారణ సెలవులు
-
Indian Navy: భారత నౌకాదళం చేతికి మూడు అత్యాధునిక నౌకలు..!
-
Stock market: స్వల్ప లాభాలతో ముగిసిన మార్కెట్లు