Vande Mataram: ఫోన్లో ‘హలో’కి బదులు.. ‘వందేమాతరం’ అనండి!
ప్రజల్లో జాతీయతా భావాన్ని పెంపొందించేలా మహారాష్ట్ర ప్రభుత్వం వినూత్న క్యాంపెయిన్కు శ్రీకారం చుట్టింది. ఫోన్కాల్స్ వచ్చినప్పుడు అవతలి వ్యక్తిని పలకరించడానికి ప్రతిఒక్కరూ వాడే ‘హలో’కి బదులుగా ‘వందేమాతరం’ అనాలని అక్కడి ప్రజలకు విజ్ఞప్తి చేసింది....
ముంబయి: ప్రజల్లో జాతీయతా భావాన్ని పెంపొందించేలా మహారాష్ట్ర ప్రభుత్వం వినూత్న క్యాంపెయిన్కు శ్రీకారం చుట్టింది. ఫోన్కాల్స్ వచ్చినప్పుడు అవతలి వ్యక్తిని పలకరించడానికి ప్రతిఒక్కరూ వాడే ‘హలో’కి బదులుగా ‘వందేమాతరం’ అనాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు నిన్న ప్రభుత్వ అధికారులకు రిజల్యూషన్ జారీ చేసిన శిందే సర్కార్.. దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఆదివారం ఓ క్యాంపెయిన్నే మొదలుపెట్టింది. ఈ క్యాంపెయిన్ను వార్ధాలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్ ప్రారంభించారు. వందేమాతరం అంటే తల్లి ముందు వినమ్రంగా నిలబడి నమస్కరించడం అని అర్థమని.. అందుకే ‘హలో’కి బదులుగా ‘వందేమాతరం’ అని ప్రతిఒక్కరూ అనాలి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నట్టు మహారాష్ట్ర సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి సుధీర్ ముంగంటివార్ అన్నారు. ఆదివారం వార్ధా జిల్లాలో మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి ముంగంటివార్ మాట్లాడుతూ.. ప్రజలు ఫోన్కాల్స్ స్వీకరించేటప్పుడు అవతలి వ్యక్తితో ‘జైభీమ్, జైశ్రీరామ్’ వంటి పదాలనే కాకుండా కావాలనుకొంటే తమ తల్లిదండ్రుల పేర్లను చెప్పినా మంచిదేనన్నారు. కాకపోతే ‘హలో’ అని చెప్పకుండా ఉండాలనేదే తమ విజ్ఞప్తి అన్నారు. స్వాతంత్య్ర పోరాట సమయంలో ‘ఇంక్విలాబ్ జిందాబాద్’ వంటి నినాదాలను బ్రిటిష్ పాలకులు నిషేధం విధించారన్నారు. కానీ ఈ పదం స్వాతంత్య్రోద్యమంలో చేరేలా ఎంతోమందిని ప్రేరేపించడం ద్వారా చివరకు మనకు స్వాతంత్య్రం సిద్ధించిందన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ కూడా వందేమాతరం నినాదానికి మద్దతు పలికారని.. ఆ సమయంలో ఆయన రాసిన కాలమ్లో అలా పేర్కొన్నారన్నారు. మహారాష్ట్ర ఏర్పాటులో కీలక భూమిక పోషించిన 850 మంది ముఖ్య వ్యక్తులపై రాష్ట్ర ప్రభుత్వం ఆడియోబుక్ని రూపొందించనుందని వెల్లడించారు. మహారాష్ట్రటెల్తో కలిసి ఆడియోబుక్ను తీసుకొస్తామని.. ఇక్కడి ప్రముఖులు, వారి సహకారం గురించి కథనాలు, సమాచారం ఆడియో ఫార్మాట్లో అందుబాటులో ఉంచడం ద్వారా ప్రజలు వాటిని ప్రయాణాల్లోనూ వినే సౌలభ్యం ఉంటుందని మంత్రి తెలిపారు.
ఇంకోవైపు, ఈ అంశంపై మహారాష్ట్ర ప్రభుత్వం శనివారం తమ ఉద్యోగులకు రిజల్యూషన్ జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు తమ ఫోన్లో మాట్లాడేటప్పుడు అవతలి వ్యక్తిని పలకరించేందుకు ‘హలో’ అని కాకుండా ‘వందేమాతరం’ అని అనాలని కోరింది. అయితే, ఇది తప్పనిసరేం కాదని.. వివిధ ప్రభుత్వ శాఖల్లోని అధిపతులు తమ సిబ్బందిని ‘వందేమాతరం’ అనేలా ప్రోత్సహించాలని తీర్మానంలో పేర్కొంది. ‘‘'హలో' అనే పదం పాశ్చాత్య సంస్కృతిని ప్రతిబింబిస్తోంది.. అలాగే, ఈ పదానికి నిర్దిష్టమైన అర్థం కూడా ఏమీలేదు. ఈ పదం కేవలం ఒక విధానం మాత్రమే. ఎలాంటి భావోద్వేగాన్ని కలిగించదు. అదే, ‘వందేమాతరం’ అని అవతలి వ్యక్తిని పలకరించడం ద్వారా ఆప్యాయతా భావం పెంపొందుతుంది. అందువల్ల దాన్ని ప్రజల్లో అవగాహన కల్పించేందుకు క్యాంపెయిన్ నిర్వహించాలి’’ అని తీర్మానంలో అధికారులు పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మామిడిపండ్లను మూడుసార్లే తిన్నా
బెయిల్ కోసం ఉద్దేశపూర్వకంగా చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకుంటున్నానని ఈడీ తనపై చేసిన ఆరోపణలపై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఘాటుగా స్పందించారు. -
మూడు రోజుల్లో తేల్చాలి
ఎన్నికలు సమీపిస్తున్నాయనే ఏకైక సాకుతో సభలు, సమావేశాలు, ఓటరు చైతన్య యాత్రలు, నిరసనలు, ధర్నాలు తదితరాలపై జిల్లా, రాష్ట్ర అధికార యంత్రాంగాలు నిషేధం విధించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. -
శరద్ పవార్ వైపు దూసుకొచ్చిన మైక్రోఫోన్!
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ ఓ సభలో మాట్లాడుతుండగా ఆయన వైపు మైక్రోఫోన్ ఒకటి దూసుకురావడం చిన్నపాటి కలకలం రేపింది. -
నౌకాదళ నూతన అధిపతిగా దినేశ్కుమార్ త్రిపాఠి
నూతన నౌకాదళాధిపతిగా వైస్ అడ్మిరల్ దినేశ్ కుమార్ త్రిపాఠి నియమితులయ్యారు. ఈ నెలాఖర్లో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. -
వేదమంత్రాల సాక్షిగా శ్రీకృష్ణుడితో యువతి పెళ్లి
మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో ఓ యువతి చిన్నప్పటి నుంచి తాను ఆరాధించిన శ్రీకృష్ణుణ్ని పెళ్లి చేసుకుంది. -
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
చిన్నపిల్లలు అశ్లీల వీడియోలు చూడటం నేరం కాకపోవచ్చేమో గానీ, పిల్లలను ఉపయోగించి అశ్లీల వీడియోలు తీయడం తీవ్రమైన ఆందోళన కలిగించే విషయమేగాక నేరమని శుక్రవారం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
తిరస్కృత నామినేషన్లపై పిటిషన్ను తోసిపుచ్చిన సుప్రీం
తిరస్కృత నామినేషన్లకు పరిష్కారం నామినేషన్లు దాఖలు చేయడంలోనే ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
‘సైన్స్శక్తి’గా ఎదిగేందుకు భారత్ సిద్ధం
ప్రబల ఆర్థికశక్తిగా ఎదుగుతున్న భారత్.. శాస్త్ర, సాంకేతిక రంగంలోనూ సత్తా చాటేందుకు సిద్ధమవుతోందని ప్రముఖ సైన్స్ వారపత్రిక ‘నేచర్’ పేర్కొంది. -
వివాహేతర సంబంధం విడాకులకు మాత్రమే కారణం.. పిల్లల కస్టడీ మంజూరుకు కాదు
వివాహేతర సంబంధం కారణం చూపి విడాకులు పొందవచ్చు కానీ, పిల్లల కస్టడీని పొందలేరని బొంబాయి హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. -
అభ్యర్థుల మార్కులను వెల్లడించిన యూపీఎస్సీ
సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో అభ్యర్థులు సాధించిన మార్కుల వివరాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) శుక్రవారం విడుదల చేసింది. -
దుబాయ్ ప్రయాణాలు వాయిదా వేసుకోండి
అత్యవసరమేమీ కానట్లయితే దుబాయ్కి, ఇక్కడి నుంచి వేరే దేశాలకు వెళ్లేందుకు భారతీయులు తమ ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని యూఏఈలోని భారత దౌత్య కార్యాలయం సూచించింది. -
స్కూల్లో హెచ్ఎంకు ఫేషియల్ వీడియో తీసిన టీచరుపై దాడి
ఉత్తర్ప్రదేశ్లోని ఉన్నావ్ జిల్లా దండమౌ గ్రామ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సంగీతాసింగ్ పనివేళల్లో ఫేషియల్ చేయించుకున్నారు. -
ఆరోగ్యకర ఆయుర్దాయాన్ని పెంచేందుకు ప్రాజెక్టు
మానవుల ఆరోగ్యకర ఆయుర్దాయాన్ని పెంచేందుకు బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) ఒక ప్రాజెక్టును చేపట్టింది. -
ఓటు స్ఫూర్తిని చాటిన సైలెంట్ విలేజ్
ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేందుకు వైకల్యం అడ్డుకాదని చాటారు జమ్మూకశ్మీర్లోని ధడ్కాహి గ్రామస్తులు. డోడా జిల్లాలోని ధడ్కాహి.. ఉధమ్పుర్ లోక్సభ స్థానం పరిధిలోకి వస్తుంది. -
రోజూ 15 నిమిషాలు వైద్యుడిని సంప్రదించేందుకు అనుమతివ్వండి
తిహాడ్ జైలులో తాను ఇన్సులిన్ వినియోగించేందుకు అనుమతినిచ్చేలా జైలు అధికారులకు ఆదేశాలు ఇవ్వాలంటూ దిల్లీ కోర్టులో కేజ్రీవాల్ అభ్యర్థనను దాఖలు చేశారు. -
ఫిలిప్పీన్స్ చేతికి భారత్ బ్రహ్మోస్
బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూజ్ క్షిపణుల మొదటి బ్యాచ్ను భారత్.. శుక్రవారం ఫిలిప్పీన్స్కు అందజేసింది. -
యోగాగురు రాందేవ్ కేసుల పరిస్థితేంటి?
యోగాగురు రాందేవ్పై నమోదైన ఫిర్యాదుల పరిస్థితిని, ఎఫ్ఐఆర్ వివరాలను సమర్పించాలని బిహార్, ఛత్తీస్గఢ్ ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. -
కోల్కతా హైకోర్టులో న్యాయవాదులు గౌను ధరించాల్సిన అవసరం లేదు
రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో కోల్కతా హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. -
బాలిక 28 వారాల గర్భం తొలగింపుపై వైద్యుల సలహా కోరిన సుప్రీంకోర్టు
అత్యాచార బాధితురాలైన 14 ఏళ్ల బాలిక అభ్యర్థన మేరకు ఆమె 28 వారాల గర్భం తొలగించటానికి అనుమతించే విషయమై సర్వోన్నత న్యాయస్థానం వైద్యుల సలహా కోరింది. -
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
వేసవి రద్దీని తీర్చేందుకు రైల్వేశాఖ సిద్ధమైంది. ఈ సీజన్లో దేశవ్యాప్తంగా 9,111 అదనపు ట్రిప్పులు నడపనున్నట్లు ప్రకటించింది. -
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా? UPSC పరీక్షల మార్కుల షీట్లు విడుదల
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో తొలి 10 మంది టాపర్లు సాధించిన మార్కులు ఇవే..
తాజా వార్తలు (Latest News)
-
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
-
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
-
స్కూల్లో హెచ్ఎంకు ఫేషియల్ వీడియో తీసిన టీచరుపై దాడి
-
సైబర్ యుద్ధాలను ఎదుర్కొనేందుకు చైనా సైన్యంలో కొత్త విభాగం
-
MS Dhoni: ధోని.. ఇంకా నాటౌటే
-
వైకాపా పాలనలో చంద్రబాబుపై 22 కేసులు