ఒక్క రాష్ట్రంలోనే 58% యాక్టివ్ కేసులు!
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకీ పెరుగుతోంది. మహారాష్ట్రలోనే గత కొన్ని రోజులుగా 15వేలకు పైగా కొత్త కేసుల రావడంతో భారత్లో కేసుల గ్రాఫ్ మళ్లీ........
ఇంటర్నెట్ డెస్క్: మహారాష్ట్రలోనే గత కొన్ని రోజులుగా 15వేలకు పైగా కొత్త కేసుల రావడంతో భారత్లో కేసుల గ్రాఫ్ మళ్లీ పెరుగుతోంది. నిన్న ఒక్కరోజే మహారాష్ట్రలో 16,620 కొత్త కేసులు రాగా.. తాజాగా 15వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవ్వడం అక్కడ వైరస్ ఉద్ధృతికి అద్దంపడుతోంది. మరోవైపు, దేశ వ్యాప్తంగా 77%కి పైగా యాక్టివ్ కేసులు కేవలం మూడు రాష్ట్రాల్లో ఉండగా.. వాటిలో 58.15% ఒక్క మహారాష్ట్రలోనే నమోదు కావడం గమనార్హం. ఇకపోతే కేరళలో 13.58%, పంజాబ్ 5.27%, కర్ణాటక 3.82%, తమిళనాడు 2.22% చొప్పున యాక్టివ్ కేసులు ఉండగా.. దేశంలో మిగతా రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలన్నీ కలిపితే 16.93% యాక్టివ్ కేసులు ఉన్నాయి.
యాక్టివ్ కేసుల్లో టాప్ 15 జిల్లాలివే..
మహారాష్ట్ర, కేరళ, పంజాబ్ రాష్ట్రాల్లో కరోనా యాక్టివ్ కేసులు ఉన్న టాప్ 15 జిల్లాలను కేంద్రం ప్రకటించింది. మహారాష్ట్రలో పుణె, నాగ్పూర్, ముంబయి, ఠానే, నాసిక్; కేరళలో ఎర్నాకుళం, పతనంమిట్ట, కన్నూర్, త్రిశ్శూర్, కోజికోడ్; పంజాబ్లో జలంధర్, ఎస్ఏఎస్ నగర్, ఎస్బీఎస్ నగర్, పటియాల, హోషియార్పూర్లలో యాక్టివ్ కేసులు అధికంగా ఉన్నాయి. మరోవైపు, ఎనిమిది రాష్ట్రాల్లోనే కొత్త కేసులు పెరుగుదల నమోదవుతోందని కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. మహారాష్ట్ర, తమిళనాడు, పంజాబ్, మధ్యప్రదేశ్, దిల్లీ, గుజరాత్, కర్ణాటక, హరియాణాలలో కొత్త కేసులు పెరుగుతుండగా.. గత నెల రోజులుగా కేరళలో తగ్గుదల నమోదవుతోందని పేర్కొన్నారు.
ఎల్లుండి సీఎంలతో మోదీ సమీక్ష!
దేశంలో కొత్తగా కరోనా కేసులు నమోదవుతున్న రాష్ట్రాల సీఎంలతో ప్రధాని నరేంద్ర మోదీ సమీక్ష నిర్వహించనున్నారు. బుధవారం మధ్యాహ్నం 12.30గంటలకు ఆయన పలు రాష్ట్రాల సీఎంలతో దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహిస్తారని సమాచారం.
మహారాష్ట్ర తాజా బులెటిన్..
మహారాష్ట్రలో గడిచిన 24గంటల్లో 15,051 కొత్త కేసులు, 48 మరణాలు నమోదు కాగా.. 10671 మంది డిశ్చార్జి అయ్యారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 23,29,464కి చేరింది. వీరిలో 21,44,743 మంది కోలుకోగా.. 52,909 మంది మృతిచెందారు. ప్రస్తుతం 1,30,547 క్రియాశీల కేసులు ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గోరఖ్పుర్ భాజపా అభ్యర్థి రవికిషన్ నా తండ్రే
ప్రముఖ నటుడు, ఉత్తర్ప్రదేశ్లోని గోరఖ్పుర్ లోక్సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి రవికిషన్ శుక్లా తన తండ్రి అంటూ తాజాగా జూనియర్ నటి షినోవా సోనీ బొంబాయి హైకోర్టును ఆశ్రయించారు. -
ఈ రాముడి చిత్రపటం.. ఓ భద్రతా పరికరం!
ఇంట్లో చోరీలను అరికట్టేందుకు గృహ భద్రత పరికరాన్ని రూపొందించారు గోరఖ్పుర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ కళాశాల విద్యార్థినులు. -
తూర్పు నుంచి దక్షిణానికి తీవ్ర వేడిగాలులు: ఐఎండీ
తూర్పు భారత రాష్ట్రాలను కుతకుతలాడిస్తున్న వేడిగాలులు దక్షిణ ప్రాంతాలకు వ్యాపించాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం వెల్లడించింది. -
రక్షణ వ్యయంలో భారత్ది నాలుగోస్థానం
ప్రపంచంలో రక్షణ వ్యయం అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. 2023లో మన దేశం ఈ రంగంపై 8,360 కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. -
తేలికపాటి తూటారక్షణ కవచం సిద్ధం
దేశంలోనే అత్యంత తేలికపాటి తూటారక్షణ కవచాన్ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) విజయవంతంగా రూపొందించింది. -
న్యాయవ్యవస్థ స్వతంత్రతకు ఎదురవుతున్న ముప్పును అడ్డుకోండి
న్యాయమూర్తులు రాజకీయాల్లో చేరేందుకు రెండేళ్లు వేచిఉండడాన్ని తప్పనిసరి చేయడం సహా చట్టంలో అనేక సవరణలు చేయాలని విజ్ఞప్తి చేస్తూ సీనియర్ న్యాయవాది ఆదీశ్ సి.అగర్వాలా మంగళవారం ప్రధాని మోదీకి లేఖ రాశారు. -
‘10 రోజుల్లో ఎంబీఏ’.. ఇలాంటి వాటితో జాగ్రత్త
ఆన్లైన్లో నకిలీ కోర్సులపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ప్రజలకు కీలక హెచ్చరిక చేసింది. -
వచ్చే ఏడాది భారత్కు ‘ఎస్-400’
రష్యా నుంచి మనదేశానికి అందాల్సిన రెండు రెజిమెంట్ల ఎస్-400 ట్రైయాంఫ్ గగనతల రక్షణ వ్యవస్థలు వచ్చే ఏడాదిలో అందే అవకాశం ఉంది. -
శుద్ధ ఇంధన రంగంలో కర్ణాటక, గుజరాత్ జోరు
శుద్ధ ఇంధనం దిశగా అడుగులు వేయడంలో కర్ణాటక, గుజరాత్ ముందంజలో ఉన్నాయని తాజా నివేదిక పేర్కొంది. -
ప్రజావంచనకు అవకాశం ఇవ్వొద్దు
పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల కేసు విచారణ పరిధిని సుప్రీంకోర్టు మరింత విస్తృతం చేసింది. ఇటీవల మరో కంపెనీ ఉత్పత్తి కూడా వివాదాస్పదమైన నేపథ్యంలో... త్వరగా అమ్ముడయ్యే వినియోగ వస్తు పరిశ్రమ(ఎఫ్ఎంసీజీ)ల వాణిజ్య ప్రకటనలనూ ఈ కేసు పరిధిలోకి తీసుకొచ్చింది. -
ఎట్టకేలకు కేజ్రీవాల్కు ఇన్సులిన్
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు తిహాడ్ జైలు అధికారులు ఎట్టకేలకు ఇన్సులిన్ ఇచ్చారు. కేజ్రీవాల్కు సోమవారం రాత్రి షుగర్ స్థాయిలు పెరగడం వల్ల తక్కువ మోతాదులో రెండు యూనిట్ల ఇన్సులిన్ ఇచ్చినట్లు తిహాడ్ జైలు అధికారులు మంగళవారం వెల్లడించారు. -
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విజయవంతం
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణికి సంబంధించిన ఒక నూతన వెర్షన్ను భారత్ మంగళవారం విజయవంతంగా పరీక్షించింది. -
12 ఏళ్ల లోపు పిల్లలకు తల్లిదండ్రుల దగ్గరే సీట్లు
విమానయాన సంస్థలకు పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) కీలక ఆదేశాలు జారీ చేసింది. 12 ఏళ్లలోపు పిల్లలకు వారి తల్లిదండ్రుల్లో కనీసం ఎవరో ఒకరి పక్కన సీటు కేటాయించాలని పేర్కొంది. -
మీ క్షమాపణలు.. ఆ ప్రకటనల సైజులో ఉన్నాయా?
యోగా గురు బాబా రాందేవ్, పతంజలి ఎండీ ఆచార్య బాలకృష్ణపై సుప్రీంకోర్టు ధర్మాసనం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. -
కేజ్రీవాల్, కవిత జ్యుడిషియల్ కస్టడీ మే 7 వరకు
మద్యం కేసులో మనీ లాండరింగ్కు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఈడీ అరెస్టు చేసిన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, భారాస ఎమ్మెల్సీ కవితల జ్యుడిషియల్ కస్టడీని ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 7వ తేదీ వరకు పొడిగించింది. -
ఉచిత పథకాలకు పార్టీలు స్వస్తి పలకాలి
తగిన ఆర్థిక వనరులు లేకుండా ఉచిత పథకాలను ప్రకటించే పద్ధతికి రాజకీయ పార్టీలు స్వస్తి పలకాలని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. -
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
ఇటీవల యూపీఎస్సీ పరీక్షలో విఫలమైన తన స్నేహితుడిని కలిసిన సందర్భం గురించి ఓ ఐపీఎస్ అధికారి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.