Corona Virus: కేంద్రం ఆదేశం.. కొవిడ్ నియంత్రణ చర్యల్లో పలు రాష్ట్రాలు!
కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం దిశానిర్దేశం చేసింది. ఈ క్రమంలో పలు రాష్ట్రాలు కొవిడ్ నిబంధలను అమల్లోకి తీసుకొస్తున్నాయి.
ఇంటర్నెట్డెస్క్: చైనా (China) సహా వివిధ దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కొవిడ్ (Corona Virus)ను ఎదుర్కొనేందుకు రద్దీ ప్రదేశాల్లో ప్రజలు మాస్కులు ధరించేలా చూడాలని రాష్ట్రాలకు దిశానిర్దేశం చేసింది. ప్రికాషన్ డోసుల్ని ప్రోత్సహించడంతోపాటు, శానిటైజర్లు వాడాలని ప్రజలకు సూచించింది. కేంద్రం సూచనల నేపథ్యంలో కొన్ని రాష్ట్రాలు కొవిడ్ నియంత్రణ చర్యల్ని చేపడుతున్నాయి.
కేవలం బహిరంగ ప్రదేశాల్లో మాత్రమే కాకుండా ఇండోర్స్లోనూ మాస్కులు ధరించాలని కర్ణాటక ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఏసీ గదుల్లోనూ మాస్కును తప్పనిసరి చేసింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అంతర్జాతీయ ప్రయాణికుల్లో ర్యాండమ్గా 2 శాతం మంది నమూనాలను సేకరించి ల్యాబ్కు పంపిస్తామని ఆ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.
కొత్త వేరియంట్లపై ఆందోళన అక్కర్లేదని తెలంగాణ (Telangana) ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. కొవిడ్ వ్యాప్తిపై రాష్ట్రప్రభుత్వం అప్రమత్తంగా ఉన్నట్లు చెప్పారు. ఔషధాలు, ఆక్సిజన్, ఐసీయూ పడకలను సిద్ధంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. పాజిటివ్గా తేలిన నమూనాలను జీనోమ్ సీక్వెన్స్ కోసం గాంధీ ఆస్పత్రికి తరలించాలన్నారు.
బీఎఫ్ 7 వేరియంట్ కేసులు గతంలో నమోదయ్యాయని, అయితే ప్రస్తుతం నమోదవుతున్న కేసులకు ఆ వేరియంట్తో సంబంధం లేదని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. సేకరించిన నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ చేస్తున్నామన్నారు. ఒకవేళ పరిస్థితులు ప్రతికూలంగా మారినా భయాందోళనలకు గురికావాల్సిన పని లేదని, ఇప్పటికే దిల్లీ పరిధిలో 8 వేల పడకలను సిద్ధంగా ఉంచామని అన్నారు. మరో 36వేల పడకలను సిద్ధం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు.
కొవిడ్ కేసుల పెరుగుదలపై రాష్ట్ర ప్రభుత్వం ఓ కన్నేసి ఉంచిందని పశ్చిమ్బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. రాష్ట్రంలో పరిస్థితులను ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తున్నామన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 95శాతం వ్యాక్సినేషన్ పూర్తయినట్లు మహారాష్ట్ర (Mahashtra) ఆరోగ్యశాఖ మంత్రి తనాజీ సావంత్ వెల్లడించారు. కరోనా వ్యాప్తి కట్టడికి టెస్ట్, ట్రాక్, ట్రీట్,వ్యాక్సినేట్, ర్యాండమ్ థర్మల్ స్క్రీనింగ్ పద్దతిని అమలుచేస్తున్నట్టు చెప్పారు. కేంద్రప్రభుత్వం చెప్పిన విధంగా అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ర్యాండమ్గా 2శాతం మంది నమూనాలను సేకరించి పరీక్షలకు పంపిస్తామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.