ఆయన సరైనోడే.. కానీ పార్టీ..?
కేంద్ర మంత్రి, భాజపా సీనియర్ నేత నితిన్ గడ్కరీపై మహారాష్ట్ర మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అశోక్ చవాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘నితిన్ గడ్కరీ సరైన నేత. కానీ ఆయన
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీపై మహారాష్ట్ర మంత్రి వ్యాఖ్యలు
ఔరంగాబాద్: కేంద్ర మంత్రి, భాజపా సీనియర్ నేత నితిన్ గడ్కరీపై మహారాష్ట్ర మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అశోక్ చవాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘నితిన్ గడ్కరీ సరైన నేత. కానీ ఆయన ఉన్న పార్టీయే సరైంది కాదు’’ అని అశోక్ చవాన్ అన్నారు. కేంద్ర్లంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం కొలువుదీరి ఏడేళ్లు పూర్తయిన సందర్భంగా ఆదివారం చవాన్ వర్చువల్గా నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మోదీ ప్రభుత్వంలో తాను అభిమానించే మంత్రి ఎవరైనా ఉన్నారా అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా చవాన్ ఈ వ్యాఖ్యలు చేశారు. గడ్కరీకి మహారాష్ట్ర అభివృద్ధిపై సానుకూల ధోరణి ఉందన్నారు. కానీ కేంద్రంలో పెద్దలు ఆయన అధికారాలను క్రమంగా తగ్గిస్తూ వచ్చారని పేర్కొన్నారు. కొవిడ్ కట్టడిలో మోదీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. మోదీ పాలనలో లీటరు పెట్రోలు ధర రూ.100 మించిపోయిందన్నారు. సుమారు 12.21 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయారని విమర్శించారు. సర్వాధికారాలను తమ చేతుల్లో పెట్టుకొని..
కొవిడ్ వ్యాప్తి ఉద్ధృతం కావడంతో కేంద్రం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలను నిందిస్తోందని ఆరోపించారు. భారత్ కన్నా బంగ్లాదేశ్ తలసరి ఆదాయమే ఎక్కువని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు దేశాన్ని నాశనం చేశాయని ఆరోపించారు. జీఎస్టీ పరిహారం సహా అన్ని విధాల సహాయ సహకారాల్లో మహారాష్ట్రపై కేంద్రం వివక్షపూరిత ధోరణిని ప్రదర్శిస్తోందంటూ మండిపడ్డారు. రాష్ట్రంలోని విద్య, ఉద్యోగాల్లో మరాఠా కోటాకు సంబంధించి రిజర్వేషన్ల సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో ఏకాభిప్రాయం కోసం అన్ని పార్టీల నేతలతో చర్చిస్తున్నందుకు రాజ్యసభ సభ్యుడు, భాజపా నేత శంభాజీ ఛత్రపతిని ఆయన అభినందించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.