మహారాష్ట్రలో కరోనా మృత్యుఘోష!

మహారాష్ట్రలో కరోనా విలయం కొనసాగుతోంది. కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నా వైరస్‌ వ్యాప్తి ఆగడంలేదు. తాజాగా కొత్త కేసులు స్వల్పంగా తగ్గినప్పటికీ.. మరణాలు

Published : 05 May 2021 02:18 IST

కొత్తగా 891మరణాలు నమోదు 

ముంబయి: మహారాష్ట్రలో కరోనా విలయం కొనసాగుతోంది. కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నా వైరస్‌ వ్యాప్తి ఆగడంలేదు. తాజాగా కొత్త కేసులు స్వల్పంగా తగ్గినప్పటికీ.. మరణాలు మాత్రం భారీగానే నమోదయ్యాయి. గడిచిన 24గంటల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా 51,880 కొత్త కేసులు నమోదు కాగా.. 891 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 65,934మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం మహారాష్ట్రలో ఇప్పటివరకు 2.81 కోట్లకు పైగా శాంపిల్స్‌ను పరీక్షించగా.. 48,22,902 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వీరిలో 41,07,092మంది కోలుకోగా.. 71,742మంది మృత్యు వాతపడ్డారు. ప్రస్తుతం 6,41,910 క్రియాశీల కేసులు ఉన్నాయి. పుణెలో అత్యధికంగా 1,09,531 క్రియాశీల కేసులు ఉండగా.. నాగ్‌పూర్‌లో 64,554, ముంబయిలో 56,465, ఠానేలో 45516 చొప్పున ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని