Anand Mahindra: వామ్మో ఈ రోడ్డులోనా.. నేనస్సలు వెళ్లను: మహీంద్రా

వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా చేసే పోస్టులు వర్తమాన అంశాలను వెల్లడిస్తాయి. మన మనసులో ఆలోచనను రేకెత్తిస్తాయి. తాజాగా అలాంటి ఒక చిత్రాన్ని ఆయన నెటిజన్లతో పంచుకున్నారు.

Updated : 12 Nov 2022 18:36 IST

ముంబయి: ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్రా చేసే పోస్టులు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటాయి. సందేశాన్ని ఇస్తాయి. అందుకే ట్విటర్‌లో ఆయన ఫాలోయింగ్ 10 మిలియన్లకు పెరిగిపోయింది. తాజాగా ఆయన చేసిన పోస్టు కూడా వావ్‌ అనిపిస్తూనే.. ఉలిక్కిపడేలా చేస్తోంది. 

ట్రావెలింగ్ భరత్ అనే నెటిజన్ షేర్ చేసిన చిత్రాన్ని మహీంద్రా రీషేర్ చేశారు. అందులో కనిపిస్తోన్న రోడ్డు అత్యంత ప్రమాదకరంగా, ప్రకృతిలో మరో కోణాన్ని చూపుతోంది. దానిని చూస్తుంటే ఒళ్లు జలదరిస్తోంది. ఇంక దానిమీద ప్రయాణమంటే గుండె ఆగిపోతుందేమో అనేలా ఉంది. అలాగే భారత్‌ రోడ్లలోని వైవిధ్యాన్ని చూపుతోంది.  ఆ దృశ్యం లద్దాఖ్‌లోని జోజిలా పాస్‌కు చెందినది. దీనిపై మహీంద్రా స్పందిస్తూ.. ‘ఈ అద్భుతమైన చిత్రాన్ని షేర్ చేసినందుకు కృతజ్ఞతలు.  కానీ నేను ఈ రోడ్డు వద్దకు వెళ్లే అవకాశమే లేదు. నాకు అంత ధైర్యం లేదని అంగీకరిస్తున్నా..!’ అని ట్వీట్ చేశారు. దీనిపై నెటిజన్లు కామెంట్లు పెట్టారు. కొంతమంది తాము ఈ రోడ్డులో ప్రయాణించామని చెప్పగా.. మరికొందరు వామ్మో..ఇది ప్రమాదకరమే..! అని ట్వీట్లు చేశారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని