ఆ గాయం మళ్లీ గుచ్చుతోంది.. న్యాయానికి ముగింపు ఇలానా..?
‘20 ఏళ్ల కిందట నేను అనుభవించిన నొప్పి మళ్లీ నన్ను బాధిస్తోంది’ అని బిల్కిస్ బానో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
గాంధీ నగర్: ‘20 ఏళ్ల కిందట నేను అనుభవించిన వేదన మళ్లీ నన్ను బాధిస్తోంది’ అని బిల్కిస్ బానో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. 2002 నాటి గోద్రా అనంతర అల్లర్ల సమయంలో బిల్కిస్ బానోపై అత్యాచారం సహా ఆమె కుటుంబానికి చెందిన ఏడుగురిని దారుణంగా హత్య చేసిన దోషులు జైలు నుంచి ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. దీనిపై బిల్కిస్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదాన్ని దూరం చేసి, భయం లేకుండా, ప్రశాంతతలో జీవించే హక్కును ప్రసాదించండంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆమె అభ్యర్థించారు.
‘రెండు రోజుల క్రితం ఆగస్టు 15న.. నేను విన్న వార్తతో 20 ఏళ్ల నాడు నేను అనుభవించిన బాధ నా కళ్ల ముందు కదలాడింది. నా కుటుంబాన్ని, నా జీవితాన్ని సర్వనాశనం చేసి, నా మూడేళ్ల కుమార్తెను దూరం చేసిన 11 మంది దోషులు విడులయ్యారని తెలిసి.. ఆనాడు నాకు తగిలిన గాయం మళ్లీ తిరగబెట్టింది. ప్రభుత్వ నిర్ణయంతో నా మెదడు మొద్దుబారిపోయింది. న్యాయానికి ఇలాంటి ముగింపు ఎలా ఉంటుంది? ఈ దేశంలోని అత్యున్నత న్యాయవ్యవస్థను నేను నమ్మాను. ఈ దేశ వ్యవస్థను నమ్మాను. అందుకే నేను అనుభవించిన బాధను అలవాటు చేసుకుంటూ జీవించడం ప్రారంభించాను’
‘వారి విడుదల నా ప్రశాంతతను దూరం చేసింది. న్యాయవ్యవస్థపై ఉన్న నమ్మకాన్ని వమ్ము చేసింది. ఇప్పుడు నేను అనుభవిస్తోన్న బాధ నా ఒక్కదానిదే కాదు. కోర్టుల్లో న్యాయం కోసం పోరాడుతోన్న ప్రతి మహిళది. ఇంతపెద్ద నిర్ణయం తీసుకునేముందు నా భద్రత గురించి ఒక్కరు కూడా పట్టించుకోలేదు. ఈ ప్రమాదాన్ని నా నుంచి దూరం చేయమని గుజరాత్ ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాను. భయం లేకుండా, ప్రశాంతంగా జీవించే హక్కును నాకు తిరిగి ఇవ్వండని కోరుతున్నాను. నాకు, నా కుటుంబానికి ఎలాంటి హాని లేదని దయచేసి భరోసా కల్పించండి’ అంటూ తన ఆవేదనను వెళ్లగక్కారు.
ఏంటీ కేసు నేపథ్యం..
2002లో గోద్రా రైలు దహనకాండ అనంతరం గుజరాత్లో అల్లర్లు జరిగినప్పుడు ఈ అత్యాచార ఘటన చోటుచేసుకుంది. బిల్కిస్ బానో కుటుంబానికి చెందిన ఏడుగురిని దుండగులు హత్య చేశారు. ఆ సమయంలో ఐదు నెలల గర్భిణిగా ఉన్న బానోపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసులో 11 మంది నిందితులకు సీబీఐ ప్రత్యేక కోర్టు 2008 జనవరి 21న జీవిత ఖైదు విధించింది. కాగా దోషులుగా వారు 15ఏళ్లు కారాగారంలో గడిపారు.
అనంతరం తనను విడుదల చేయాలంటూ వారిలో ఓ వ్యక్తి సుప్రీం కోర్టును ఆశ్రయించగా, అతడి విజ్ఞప్తిని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం గుజరాత్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనిపై ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కేసులో నిందితులందరికీ రెమిషన్ మంజూరు చేయాలని కమిటీ సభ్యులు సిఫార్సు చేశారు. ఈ మేరకు వారి విడుదలకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయని పేర్కొంటూ గోద్రా సబ్ జైలు నుంచి విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. దీనిపై బిల్కిస్ భర్త తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఏ విషయం ఆధారంగా ప్రభుత్వం వారిని విడుదల చేసిందో అర్థం కావడం లేదన్నారు.
ఈ విడుదలపై దేశం ఒక నిర్ణయానికి రావాలి: మహువా మొయిత్రా
సామూహిక అత్యాచార, హత్యకు పాల్పడిన దోషులను విడుదల చేయడంపై విపక్షాలు మండిపడుతున్నాయి. తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) నేత మహువా మొయిత్రా గుజరాత్ ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించారు. ‘బిల్కిస్ బానో ఒక మహిళా లేక ఒక మతవర్గానికి చెందిన వ్యక్తా అనేది ఈ దేశం నిర్ణయించుకోవడం మంచిది’ అని ఘాటుగా స్పందించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈ రాముడి చిత్రపటం.. ఓ భద్రతా పరికరం!
ఇంట్లో చోరీలను అరికట్టేందుకు గృహ భద్రత పరికరాన్ని రూపొందించారు గోరఖ్పుర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ కళాశాల విద్యార్థినులు. -
తూర్పు నుంచి దక్షిణానికి తీవ్ర వేడిగాలులు: ఐఎండీ
తూర్పు భారత రాష్ట్రాలను కుతకుతలాడిస్తున్న వేడిగాలులు దక్షిణ ప్రాంతాలకు వ్యాపించాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం వెల్లడించింది. -
రక్షణ వ్యయంలో భారత్ది నాలుగోస్థానం
ప్రపంచంలో రక్షణ వ్యయం అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. 2023లో మన దేశం ఈ రంగంపై 8,360 కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. -
తేలికపాటి తూటారక్షణ కవచం సిద్ధం
దేశంలోనే అత్యంత తేలికపాటి తూటారక్షణ కవచాన్ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) విజయవంతంగా రూపొందించింది. -
న్యాయవ్యవస్థ స్వతంత్రతకు ఎదురవుతున్న ముప్పును అడ్డుకోండి
న్యాయమూర్తులు రాజకీయాల్లో చేరేందుకు రెండేళ్లు వేచిఉండడాన్ని తప్పనిసరి చేయడం సహా చట్టంలో అనేక సవరణలు చేయాలని విజ్ఞప్తి చేస్తూ సీనియర్ న్యాయవాది ఆదీశ్ సి.అగర్వాలా మంగళవారం ప్రధాని మోదీకి లేఖ రాశారు. -
‘10 రోజుల్లో ఎంబీఏ’.. ఇలాంటి వాటితో జాగ్రత్త
ఆన్లైన్లో నకిలీ కోర్సులపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ప్రజలకు కీలక హెచ్చరిక చేసింది. -
వచ్చే ఏడాది భారత్కు ‘ఎస్-400’
రష్యా నుంచి మనదేశానికి అందాల్సిన రెండు రెజిమెంట్ల ఎస్-400 ట్రైయాంఫ్ గగనతల రక్షణ వ్యవస్థలు వచ్చే ఏడాదిలో అందే అవకాశం ఉంది. -
శుద్ధ ఇంధన రంగంలో కర్ణాటక, గుజరాత్ జోరు
శుద్ధ ఇంధనం దిశగా అడుగులు వేయడంలో కర్ణాటక, గుజరాత్ ముందంజలో ఉన్నాయని తాజా నివేదిక పేర్కొంది. -
గోరఖ్పుర్ భాజపా అభ్యర్థి రవికిషన్ నా తండ్రే
ప్రముఖ నటుడు, ఉత్తర్ప్రదేశ్లోని గోరఖ్పుర్ లోక్సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి రవికిషన్ శుక్లా తన తండ్రి అంటూ తాజాగా జూనియర్ నటి షినోవా సోనీ బొంబాయి హైకోర్టును ఆశ్రయించారు. -
ప్రజావంచనకు అవకాశం ఇవ్వొద్దు
పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల కేసు విచారణ పరిధిని సుప్రీంకోర్టు మరింత విస్తృతం చేసింది. ఇటీవల మరో కంపెనీ ఉత్పత్తి కూడా వివాదాస్పదమైన నేపథ్యంలో... త్వరగా అమ్ముడయ్యే వినియోగ వస్తు పరిశ్రమ(ఎఫ్ఎంసీజీ)ల వాణిజ్య ప్రకటనలనూ ఈ కేసు పరిధిలోకి తీసుకొచ్చింది. -
ఎట్టకేలకు కేజ్రీవాల్కు ఇన్సులిన్
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు తిహాడ్ జైలు అధికారులు ఎట్టకేలకు ఇన్సులిన్ ఇచ్చారు. కేజ్రీవాల్కు సోమవారం రాత్రి షుగర్ స్థాయిలు పెరగడం వల్ల తక్కువ మోతాదులో రెండు యూనిట్ల ఇన్సులిన్ ఇచ్చినట్లు తిహాడ్ జైలు అధికారులు మంగళవారం వెల్లడించారు. -
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విజయవంతం
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణికి సంబంధించిన ఒక నూతన వెర్షన్ను భారత్ మంగళవారం విజయవంతంగా పరీక్షించింది. -
12 ఏళ్ల లోపు పిల్లలకు తల్లిదండ్రుల దగ్గరే సీట్లు
విమానయాన సంస్థలకు పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) కీలక ఆదేశాలు జారీ చేసింది. 12 ఏళ్లలోపు పిల్లలకు వారి తల్లిదండ్రుల్లో కనీసం ఎవరో ఒకరి పక్కన సీటు కేటాయించాలని పేర్కొంది. -
మీ క్షమాపణలు.. ఆ ప్రకటనల సైజులో ఉన్నాయా?
యోగా గురు బాబా రాందేవ్, పతంజలి ఎండీ ఆచార్య బాలకృష్ణపై సుప్రీంకోర్టు ధర్మాసనం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. -
కేజ్రీవాల్, కవిత జ్యుడిషియల్ కస్టడీ మే 7 వరకు
మద్యం కేసులో మనీ లాండరింగ్కు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఈడీ అరెస్టు చేసిన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, భారాస ఎమ్మెల్సీ కవితల జ్యుడిషియల్ కస్టడీని ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 7వ తేదీ వరకు పొడిగించింది. -
ఉచిత పథకాలకు పార్టీలు స్వస్తి పలకాలి
తగిన ఆర్థిక వనరులు లేకుండా ఉచిత పథకాలను ప్రకటించే పద్ధతికి రాజకీయ పార్టీలు స్వస్తి పలకాలని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. -
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
ఇటీవల యూపీఎస్సీ పరీక్షలో విఫలమైన తన స్నేహితుడిని కలిసిన సందర్భం గురించి ఓ ఐపీఎస్ అధికారి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.