
ముంబయిని కేంద్రపాలిత ప్రాంతం చేయండి
ఠాక్రే వ్యాఖ్యలకు కర్ణాటక ఉపముఖ్యమంత్రి కౌంటర్
బెంగళూరు: కర్ణాటక, మహారాష్ట్రల మధ్య సరిహద్దు వివాదం మళ్లీ ముదురుతోంది. కర్ణాటక సరిహద్దుల్లో మరాఠీ మాట్లాడే ప్రాంతాలను కేంద్ర పాలిత ప్రాంతం(యూటీ)గా ప్రకటించాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే బుధవారం డిమాండ్ చేశారు. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన కర్ణాటక ఉపముఖ్యమంత్రి లక్ష్మణ్ సవాడి.. ముంబయిని కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని కేంద్రాన్ని అభ్యర్థించారు. అసలేం జరిగిందంటే..
కర్ణాటకలో మరాఠీ మాట్లాడే ప్రాంతాలను తమ రాష్ట్రంలో విలీనం చేసేందుకు కట్టుబడి ఉన్నామని, దీనిపై న్యాయపోరాటం చేస్తామని ఇటీవల ఠాక్రే సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం రెండు రాష్ట్రాల సరిహద్దు వివాదాలపై రూపొందించిన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఠాక్రే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సుప్రీంకోర్టులో కేసు విచారణ జరుగుతున్న సమయంలో కర్ణాటక ప్రభుత్వం కోర్టు ధిక్కారానికి పాల్పడి బెళగావి పేరు మార్చిందని ఆరోపించారు. సరిహద్దులో ఉన్న ప్రాంతాలను యూటీలుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
ఠాక్రే వ్యాఖ్యలను కర్ణాటక ప్రభుత్వం తప్పుబట్టింది. ‘‘మహారాష్ట్ర ముఖ్యమంత్రి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. సరిహద్దు వివాదంపై సుప్రీంకోర్టులో తమకు అనుకూలంగా తీర్పు వస్తుందని విశ్వాసంగా ఉన్నాం. మా రాష్ట్రంలోని కొంతమంది ప్రజలు ముంబయి-కర్ణాటక ప్రాంతానికి చెందినవారే. అందువల్ల ముంబయిపై మాకూ హక్కు ఉంది. ఆ ప్రాంతాన్ని కర్ణాటకలో కలపాలి. అప్పటి వరకు ముంబయిని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని కేంద్రాన్ని కోరుతున్నా’’ అని లక్ష్మణ్ సవాడీ చెప్పుకొచ్చారు.
వివాదం ఇదీ..
ఒకప్పుడు బాంబే ప్రెసిడెన్సీలో భాగంగా ఉన్న బెళగావి తదితర ప్రాంతాలు ఆ తర్వాత మైసూరు రాష్ట్రంలో కలిశాయి. అక్కడ ఎక్కువ మంది ప్రజలు మరాఠీనే మాట్లాడతారు. కాబట్టి వాటిని తమ రాష్ట్రంలో కలపాలంటూ మహారాష్ట్ర డిమాండ్ చేస్తోంది. దీనిపై బెళగావి కేంద్రంగా 1948లో ఏర్పడిన మహారాష్ట్ర ఏకీకరణ సమితి పోరాటం కొనసాగిస్తోంది. 1956లో భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడినప్పుడు జనవరి 17న ఆ ప్రాంతాలను కర్ణాటకలో కలిపారు. దీనికి వ్యతిరేకంగా మహారాష్ట్ర ఏకీకరణ సమితి ఆందోళన చేపట్టింది. ఈ ఆందోళనల్లో 10 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఆ తర్వాత బెళగావి తదితర ప్రాంతాలు కర్ణాటకలోనే ఉండాలంటూ మహజన్ కమిషన్ 1967లో నివేదిక ఇచ్చింది. ఈ నివేదికను వ్యతిరేకిస్తోన్న మహరాష్ట్ర.. సరిహద్దు ప్రాంతాలను తమ రాష్ట్రంలో విలీనం చేయాలంటూ డిమాండ్ చేస్తోంది. ఆ మధ్య ఈ వివాదం కాస్త సద్దుమణిగినట్లే కన్పించినా.. ఇటీవల ఠాక్రే వ్యాఖ్యలతో మళ్లీ రాజుకుంది.
ఇదీ చదవండి..
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Rishabh pant : విమర్శలకు బెదరని నయా ‘వీరు’డు.. రిషభ్ పంత్
-
Related-stories News
Ayodhya Ram Mandir: రామమందిర నిర్మాణానికి రూ.3,400 కోట్ల విరాళాలు..
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Ts-top-news News
TS TET: టెట్ పేపర్-2లో ఉత్తీర్ణత డబుల్
-
Related-stories News
Child Marriages: వచ్చే పదేళ్లలో కోటి మందికి బాల్యవివాహాలు
-
Viral-videos News
Viral video: వారెవ్వా.. ఏం టాలెంట్.. మహిళకు నెటిజన్ల ప్రశంసలు!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Vishal: కుప్పంలో చంద్రబాబుపై పోటీ .. నటుడు విశాల్ క్లారిటీ!
- Rishabh Pant : అతనే.. ఆపద్బాంధవుడు
- చిన్న బడ్జెట్.. సొంత గూడు
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (02-07-2022)
- IND vs ENG : పంత్ ఒక్కడు ఒకవైపు..
- తెదేపాలో చేరితే రూ.30 కోట్లు ఇస్తామన్నారు
- Russia: ముప్పేట దాడులు తాళలేకే?.. స్నేక్ ఐలాండ్ను విడిచిన రష్యా
- Udaipur murder: దర్జీ హత్యకేసులో మరో సంచలన కోణం.. బైక్ నంబర్ ప్లేట్ ఆధారంగా దర్యాప్తు!
- Naresh: ఆమె నా జీవితాన్ని నాశనం చేసింది: నరేశ్.. ఒక్క రూపాయీ తీసుకోలేదన్న రమ్య
- Andhra News: నా చొక్కా, ప్యాంట్ తీసేయించి మోకాళ్లపై కూర్చోమన్నారు.. సాంబశివరావు ఆవేదన