Kerala : సామాజిక సేవ కోసం గడ్డం పెంచుతున్నారు..!
గడ్డం కొంచెం పెరిగితేనే చిరాకుగా ఉంటుంది. పైగా అలా ఉంటే.. ఇతరుల నుంచి ఎన్నో ప్రశ్నలు ఎదురవుతుంటాయి. మరి అలాంటిది ఏళ్ల తరబడి గడ్డాలను పెంచాలంటే మాత్రం కాస్త ఇబ్బందే. కానీ, మాకు మాత్రం అస్సలు ఇబ్బందే లేదంటున్నారు కొందరు కేరళ యువకులు. ఓ సత్సంకల్పం కోసం తమ గడ్డాలను పొడవుగా పెంచుతున్నారు....
తిరువనంతపురం : గడ్డం కొంచెం పెరిగితేనే చిరాకుగా ఉంటుంది. పైగా అలా ఉంటే.. ఇతరుల నుంచి ఎన్నో ప్రశ్నలు ఎదురవుతుంటాయి. మరి అలాంటిది ఏళ్ల తరబడి గడ్డాలను పెంచాలంటే మాత్రం కాస్త ఇబ్బందే. కానీ, మాకు మాత్రం అస్సలు ఇబ్బందే లేదంటున్నారు కొందరు కేరళ యువకులు. ఓ సత్సంకల్పం కోసం తమ గడ్డాలను పొడవుగా పెంచుతున్నారు.
పొడవాటి గడ్డమున్న వ్యక్తిని చూస్తే చాలా మందికి సానుభూతి.. మరి కొందరికి వ్యతిరేక అభిప్రాయం ఉంటుంది. చక్కగా ట్రిమ్ చేసి పెంచితే సరేసరి, లేదంటే పొడవాటి గడ్డాలను చూస్తే ఏదో కష్టాల్లో ఉన్నాడని అనుకుంటారు. అయితే ఇలాంటి అభిప్రాయాలు ఎన్ని వినిపించినా.. ఈ కేరళ యువకులు మాత్రం ఓ మంచి ఉద్దేశంతో గడ్డాలను పొడవుగా పెంచుతున్నారు. వీరంతా కేరళ బియర్డ్ సొసైటీ సభ్యులు. వీరి గడ్డాల వెనుక సామాజిక సేవాదృక్పథం దాగి ఉంది. షేవింగ్ చేయించుకోవాలంటే డబ్బులు ఖర్చు చేయాలి. ఇంట్లో చేసుకున్నా ఎంతొకొంత ఖర్చు తప్పదు. దానికయ్యే ఖర్చులను దాచి పెట్టి, ఆ డబ్బులను సామాజిక సేవ కోసం వినియోగిస్తున్నారు. మలప్పురానికి చెందిన అనాజ్ అబ్దుల్లా 2017లో తన మిత్రులతో కలిసి ఈ సొసైటీని ప్రారంభించారు. ఇందులో కేరళలోని వివిధ ప్రాంతాలకు చెందిన అనేక మంది సభ్యులుగా ఉన్నారు. గడ్డాన్ని ఎక్కువగా పెంచడం వల్ల కుటుంబ సభ్యుల నుంచే కాదు.. బయట నుంచి కూడా అప్పుడప్పుడూ వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. అయితే.. సమస్యలు ఎన్ని వచ్చినా.. సామాజిక సేవకోసం గడ్డాన్ని పెంచాలన్న తమ సంకల్పాన్ని మాత్రం తాము వీడబోమని చెబుతున్నారు. వారి మంచి ఉద్దేశాన్ని తెలుసుకున్న కొందరు ప్రోత్సహిస్తున్నారని వివరించారు.
► Read latest National - International News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
వేసవి రద్దీని తీర్చేందుకు రైల్వేశాఖ సిద్ధమైంది. ఈ సీజన్లో దేశవ్యాప్తంగా 9,111 అదనపు ట్రిప్పులు నడపనున్నట్లు ప్రకటించింది. -
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా? UPSC పరీక్షల మార్కుల షీట్లు విడుదల
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో తొలి 10 మంది టాపర్లు సాధించిన మార్కులు ఇవే..
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం