china: తరిమిన మలేషియా.. తుడిచేసుకొన్న చైనా..!
దక్షిణ చైనా సముద్రంలో చైనా అరాచకాలు మలేషియా దాకా వ్యాపించాయి. ఇప్పటి వరకు ఫిలిప్పీన్స్
రంగంలోకి దిగిన ఫైటర్ జెట్లు
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
దక్షిణ చైనా సముద్రంలో చైనా అరాచకాలు మలేషియా దాకా వ్యాపించాయి. ఇప్పటి వరకు ఫిలిప్పీన్స్, ఇండోనేషియా వంటి ప్రాంతాలకే పరిమితమైంది. చైనా యుద్ధవిమానాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండటంతో మలేషియా కూడా ఫైటర్ జట్ విమానాలను రంగంలోకి దింపి వాటిని తరమాల్సి వచ్చింది. ఈ ఘటనతో ఒక్కసారి దక్షిణ చైనా సముద్రంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తన భూభాగానికి సుదూరంగా ఉన్న మలేషియా వద్ద సముద్ర జలాలు కూడా తనవే అని చైనా ప్రకటించుకోవడం వివాదానికి మూలకారణం అయ్యింది.
ఏమి జరిగింది..
మలేషియాలోని సార్వాక్ ప్రాంతంలో సముద్ర జలాలపై సోమవారం 16 చైనా యుద్ధవిమానాలు ప్రయాణించాయి. ఈ యుద్ధవిమానాలు వ్యూహాత్మక ఫార్మేషన్లో ప్రయాణించడం మలేషియాను మరింత కలవరపర్చింది. సార్వాక్కు 110 కిలోమీటర్ల దూరం (60నాటికల్మైళ్లు)లో 27,000 అడుగుల ఎత్తున ప్రయాణించాయి. బోర్నియో ద్వీపం నుంచి మలేషియా అధికారులు ఈ విమానాలతో కమ్యూనికేషన్లోకి వచ్చి తిరిగి వెళ్లిపోవాలని హెచ్చరించారు. అయినా పట్టించుకోకపోవడంతో మలేషియా వాయుసేనకు చెందిన యుద్ధవిమానాలు లబౌన్ ఎయిర్బేస్ నుంచి గాల్లోకి ఎగిరాయి. మధ్యాహ్నం 1.33 సమయంలో వాటిని వెనక్కి వెళ్లిపొమ్మని సంకేతాలు పంపాయి. ఆ వచ్చిన విమానాల్లో ఇల్యూషన్ ii-76, షియాన్ వై20 రవాణా విమానాలు ఉన్నాయి. ఈ అంశాన్ని మలేషియా ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది.
చైనా దౌత్యవేత్తకు సమన్లు..
ఈ ఘటనను మలేషియా సార్వభౌమాధికారానికి బెదిరింపులుగా అభివర్ణించింది. దీనికి సంబంధించి వివరణ ఇవ్వాలని ఆ దేశంలోని చైనా రాయబారికి సమన్లు జారీ చేసింది. ‘‘ఏ దేశంతో అయినా మేము స్నేహపూర్వకంగా ఉన్నామంటే దానర్థం మా దేశ సార్వభౌమాధికారాన్ని వదులుకుంటామని కాదు’’ అని మలేషియా వ్యాఖ్యానించింది.
దీనిపై కౌలాలంపూర్లోని చైనా రాయబార కార్యాలయం ఒక ప్రకటన జారీ చేసింది. అది చైనా వాయుసేన సాధనలో భాగంగా జరిగిందని పేర్కొంది. తాము అంతర్జాతీయ చట్టాలకు కట్టుబడే గగనతలంలో ప్రయాణించామని.. ఏదేశ ప్రాదేశిక గగనతలంలోకి చొరబడలేదని సమర్థించుకొంది. ఆ ప్రాంతంలో శాంతిని నెలకొల్పడానికి మలేషియాలో స్నేహపూర్వక సంబంధాలు నెరపడానికి కట్టుబడి ఉన్నామని పేర్కొంది. గతేడాది కూడా చైనాకు చెందిన ఒక సర్వే నౌక మలేషియా జలాల్లో తిష్టవేసుకొంది. ఆ వివాదం చల్లారడానికి దాదాపు నెలరోజులు పట్టింది.
ఇటీవలే ఫిలిప్పీన్స్తో వివాదం..
మార్చి 7వ తేదీన వివాదాస్పద జూలియన్ ఫిలిప్పే ద్వీపం వద్దకు 220కి పైగా చైనా చేపల వేట ఓడలు తరలివచ్చాయి. చైనా చేపలవేట ఓడలు చిన్నసైజు యుద్ధనౌకలను తలపిస్తుంటాయి. వీటికి చైనా కోస్టుగార్డు మద్దతు ఉంది. ఫిలిప్పీన్స్కు చెందిన ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ పరిధిలోనే ఈ ద్వీపం ఉంటుంది. అధ్యక్షుడు రోడ్రిగా డ్యుటెరెట్టి అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి చైనాతో స్నేహంగా ఉండేందుకు.. వీలైనంత ఉదాసీనంగా వ్యవహరించారు. మరోపక్క రక్షణ భాగస్వామిగా ఉన్న అమెరికాతో ఒప్పందాలను రద్దు చేసుకొనేందుకు కూడా డ్యుటెరెట్టి ఒక దశలో ప్రయత్నించారు. అయినా డ్రాగన్ మారకపోవడంతో ఫిలిప్పీన్స్ విసిగిపోయింది.
మే 3వ తేదీన ఫిలిప్పీన్స్ విదేశాంగ శాఖ మంత్రి టియోడోరో లోక్సిన్ చైనాపై ట్విటర్లో విరుచుకుపడ్డారు. రాయలేని పదాలతో బూతులు అందుకొన్నారు. ఈ ట్వీట్ల పరంపర అంతర్జాతీయంగా సంచలనం సృష్టించింది. దీనిపై చైనా స్పందిస్తూ.. కనీసం దౌత్య భాష వాడితే మేము స్పందిస్తామంటూ పేర్కొంది. అంతేకానీ ఆ నౌకలను వెనక్కి పిలవలేదు. గత వారం ఫిలిప్పీన్స్ మరోసారి దౌత్య నిరసన వ్యక్తం చేసింది. 2016లో డ్యుటెరెట్టి అధికారం చేపట్టినప్పటి నుంచి ఇది చైనాకు వ్యతిరేకంగా చేపట్టిన 84వ దౌత్య నిరసన..! చైనా ముప్పును గ్రహించిన ఫిలిప్పీన్స్ ఈ ప్రాంతంలో గస్తీని విపరీతంగా పెంచింది. మార్చి 1 నుంచి మే 25 వరకు స్పార్ట్లీ ద్వీపాల వద్దకు 53సార్లు గస్తీ దళాలను పంపింది.
సముద్రాన్నే మింగేంత దాహం..!
దక్షిణ చైనా సముద్రంలో ఫిలిప్పీన్స్, వియత్నాం, తైవాన్, బ్రునై, మలేషియా వంటి దేశాలున్నాయి. అంతర్జాతీయ సముద్ర జలాల చట్టం ప్రకారం తీరం నుంచి 12 నాటికల్ మైళ్ల వరకు మాత్రమే ఆయా దేశాల తీర ప్రాంతాల కిందకు వస్తాయి. తీరం నుంచి 200 నాటికల్ మైళ్ల దూరం వరకు ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ కిందకు వెళతాయి. అంటే సముద్రం మధ్యలో ఒక దీవి ఉంటే ఆ దీవి చుట్టూ 200 నాటికల్ మైళ్ల దూరం ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ ఆ దేశానికి దక్కుతుంది. ఈ లెక్కన చైనాకు తనది చెప్పుకొనే సముద్రంలో అతి తక్కువ భాగమే దక్కుతుంది. కానీ డ్రాగన్ దక్షిణ చైనా సముద్రాన్నే మింగేయాలనుకుంటోంది. ఇక్కడ భారీగా చమురు నిక్షేపాలు ఉన్నట్లు తేలింది. దీంతో వీటిని సొంతం చేసుకోవడం కోసం ఇక్కడి చాలా దీవులు తనవే అని చెబుతోంది. వీటిల్లో స్పార్ట్లీ దీవులు కీలకమైనవి. వీటిని దక్కించుకోవడానికి ఒక దీవిని కృత్రిమంగా తయారు చేసి అక్కడ తన యుద్ధవిమానాలను మోహరించింది. అంతేకాదు ఈ మార్గంలో ఏటా మూడు ట్రిలియన్ డాలర్ల విలువైన సరుకులను రవాణా చేస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
Arunachal Pradesh: హైవేపై కొండచరియలు విరిగిపడటంతో చైనా సరిహద్దుల్లోని ఓ జిల్లాకు మిగిలిన ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. -
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ అధికారి ఒకరు రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గహ్లోత్ (Ashok Gehlot)పై తీవ్ర ఆరోపణలు చేశారు. -
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
Tamannaah: నిబంధనలకు వ్యతిరేకంగా ఐపీఎల్ను ప్రసారం చేసిన కేసులో నటి తమన్నాకు మహారాష్ట్ర సైబర్ పోలీసులు సమన్లు జారీ చేశారు. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?