
Mamata Vs Pegasus: రూ.25కోట్లకు పెగాసస్ సాఫ్ట్వేర్ ఆఫర్ : మమతా
తిరస్కరించామన్న పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి
దిల్లీ: ప్రముఖుల ఫోన్లు హ్యాకింగ్కు గురయ్యాయంటూ వెలుగు చూసిన పెగాసస్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ సాఫ్ట్వేర్ విక్రయంపై తమకు కొన్నేళ్ల క్రితమే ఆఫర్ వచ్చిందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వెల్లడించారు. అయినా రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకునే ఇటువంటి సాఫ్ట్వేర్ కొనుగోలును తమ ప్రభుత్వం వ్యతిరేకించిందన్నారు. తన ఫోన్ ట్యాపింగ్ గురవుతున్న విషయానికి సంబంధించి పశ్చిమబెంగాల్ అసెంబ్లీలో బుధవారం మాట్లాడిన మమతా, పెగాసస్ విక్రయం ఆఫర్పై తాజాగా మరింత సమాచారాన్ని వెల్లడించారు.
‘పెగాసస్కు హ్యాకింగ్కు సంబంధించిన పరికరాల విక్రయం కోసం నాలుగైదేళ్ల క్రితం ఆ సంస్థ ప్రతినిధులు మా పోలీస్ డిపార్టుమెంటును సంప్రదించారు. అందుకు రూ.25కోట్లను డిమాండ్ చేశారు. ఆ విషయం నా దగ్గరకు వచ్చింది. అలాంటి మెషీన్లు మనకు అవసరం లేదని తిరస్కరించాను. సంఘ విద్రోహ చర్యలు, భద్రత కోసమైతే వేరే విషయం. కానీ, రాజకీయ కారణాల కోసం వినియోగించారు. అధికారులు, న్యాయమూర్తులపైనా ఉపయోగించడం ఆమోదించదగిన విషయం కాదు’ అని మమతా బెనర్జీ వెల్లడించారు.
ఇదిలాఉంటే, ఇజ్రాయెల్కు చెందిన ఎన్ఎస్వో గ్రూప్ నుంచి కొనుగోలు చేసిన పెగాసస్ సాఫ్ట్వేర్ ద్వారా కేంద్ర ప్రభుత్వం చట్టవిరుద్ధంగా దేశంలోని రాజకీయ నాయకులు, పాత్రికేయులు, సామాజిక కార్యకర్తల ఫోన్లపై నిఘా ఉంచిందనే ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా రాహుల్ గాంధీ, ప్రశాంత్ కిశోర్, కొందరు కేంద్ర మంత్రులు, మాజీ న్యాయమూర్తులతో పాటు జర్నలిస్టుల ఫోన్లు లక్ష్యంగా చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో ఈ వ్యవహారంపై దర్యాప్తు జరిపించాలని కోరుతూ న్యాయవాది ఎం.ఎల్.శర్మ, ప్రముఖ పాత్రికేయులు ఎన్.రామ్ తదితరులు దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీం కోర్టు విచారణ జరుపుతోంది. ఇందులో భాగంగా వ్యక్తుల గోప్యత హక్కు ఉల్లంఘన జరిగిందా లేదా అనే విషయాన్ని తేల్చేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించిన విషయం తెలిసిందే.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (26-06-2022)
-
World News
Padma Bridge: బంగ్లాదేశ్లోనే పొడవైన వంతెన ప్రారంభం.. విశేషాలివే!
-
India News
Amit Shah: శివుడిలా మోదీ విషాన్ని దిగమింగుకున్నారు.. 19ఏళ్లు వేదన అనుభవించారు..!
-
Sports News
IND vs IRL: పసికూనతో పోటీ.. టీమ్ఇండియా ఫేవరెటే అయినా..!
-
Movies News
Cinema news: హతవిధీ.. ‘బాలీవుడ్’కి ఏమైంది... ‘బారాణా’ సినిమాలు..‘చారాణా’ కలెక్షన్లు!
-
General News
Flipkart MoU: సెర్ప్తో ఫ్లిప్కార్ట్ ఒప్పందం.. మంత్రి ఎర్రబెల్లి సమక్షంలో సంతకాలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Weekly Horoscope : రాశిఫలం ( జూన్ 26 - జులై 02 )
- Actor Sai kiran: మోసం చేశారంటూ పోలీస్స్టేషన్లో సినీ నటుడు సాయికిరణ్ ఫిర్యాదు
- మా ఆయన కోసం సల్మాన్ఖాన్ని వదులుకున్నా!
- New Labour codes: వారానికి 4 రోజులే పని.. తగ్గనున్న చేతికొచ్చే వేతనం.. జులై 1 నుంచి కొత్త రూల్స్..!
- AP Liquor: మద్యంలో విషం
- Lifestyle: అందమైన భార్య పక్కన ఉన్నా స్పందన లేదా?
- కలకలం రేపిన ఐఏఎస్ కుమారుడి మృతి.. అధికారులే హత్య చేశారన్న కుటుంబీకులు!
- Teesta Setalvad: ప్రముఖ సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్ అరెస్టు
- Amaravathi: రాజధాని భూముల అమ్మకం
- Yuvraj Singh - RaviShastri: ఆరోజు యువరాజ్ ఐదో సిక్సర్ కొట్టగానే..: రవిశాస్త్రి