Viral Video: కుమారుడితో ఆడుకుంటూ.. అలల్లో కొట్టుకుపోయిన తండ్రి

ఒడిశాలోని పూరీలో విషాదం చోటు చేసుకుంది. కుమారుడితో కలిసి సముద్ర తీరంలో సరదాగా గడుపుతుండగా.. అలల తాకిడికి తండ్రి కొట్టుకుపోయాడు.

Published : 18 Apr 2022 02:03 IST

పూరీ: ఒడిశాలోని పూరీ తీరంలో విషాదం చోటు చేసుకుంది. కుమారుడితో కలిసి సముద్ర తీరంలో సరదాగా గడుపుతుండగా.. అలల తాకిడికి తండ్రి కొట్టుకుపోయాడు. బాలాసోర్‌కు చెందిన బన్సీధర్ బెహర.. తన కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రకు పూరీకి వచ్చారు. కుమారుడితో కలిసి సముద్ర తీరానికి వచ్చిన బన్సీధర్.. అలల తాకిడికి గల్లంతయ్యారు. ఈ ఘటనలో మొత్తం ముగ్గురు గల్లంతుకాగా.. ఇద్దరిని లైఫ్ గార్డులు రక్షించారు. ఘటనకు సంబంధించిన దృశ్యాలను బీచ్ ఒడ్డున ఉన్న అతడి బంధువు వీడియో తీశారు. ప్రస్తుతం ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని