Pune: పీఎంఓ అధికారినంటూ కోతలు.. నకిలీ ఐఏఎస్ అరెస్టు!
రహస్య ఆపరేషన్ (Secret operation) కోసం పీఎంవో (PMO) నుంచి వచ్చానని చెప్పుకొంటున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఇతర నేరాలతో అతడికి ఏమైనా సంబంధాలు ఉన్నాయా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
పుణె: ప్రధానమంత్రి కార్యాలయంలో (PMO) అధికారినని చెప్పుకొంటున్న ఓ వ్యక్తిని అరెస్టు చేసినట్లు పుణె క్రైం బ్రాంచ్ పోలీసులు (Crime Branch Police) వెల్లడించారు. నిందితుడిని మహారాష్ట్రలోని (Maharashtra) జల్గావ్కు చెందిన 54 ఏళ్ల వాసుదేవ్ నివృత్తిగా గుర్తించారు. తాను ఓ ఐఏఎస్ అధికారినని, రహస్య మిషన్ చేపట్టేందుకు ప్రధాని కార్యాలయం నుంచి వచ్చానంటూ అతడు చెప్పుకొనేవాడు. ఈ క్రమంలో మే 29న ఓ ఎన్జీవో సంస్థ నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన వాసుదేవ్.. తాను ఓ ఐఏఎస్ అధికారినంటూ పరిచయం చేసుకున్నాడు. పీఎంఓ ఆదేశాల మేరకు ఓ సీక్రెట్ మిషన్ కోసం ఇక్కడికి వచ్చినట్లు చెప్పాడు. అసలు పేరు చెప్పకుండా.. తన పేరు డా.విన్య్ దేవ్గా పేర్కొన్నాడు.
తనతోపాటు పని చేస్తున్న ఇతర సీనియర్ అధికారుల గురించి ఎన్జీవో నిర్వాహకులు ఆరా తీయగా.. నీళ్లు నమిలాడు. అక్కడి నుంచి మెల్లగా జారుకున్నాడు. అనుమానం వచ్చిన ఎన్జీవో సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులకు అతడు నకిలీ ఐఏఎస్ అని అనుమానం వచ్చింది. దీంతో అతడి మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా పట్టుకునేందుకు ప్రయత్నించారు. అయితే, ఎప్పటికప్పుడు లోకేషన్ మారిపోతుండటంతో కొంచెం ఆటంకాలు ఎదురయ్యాయి. ఎట్టకేలకు మే 30న మహారాష్ట్రలోని తలెగాన్ దబాడేలో ఉన్నట్లు గుర్తించి అతడిని అదుపులోకి తీసుకొని విచారించగా నకిలీ అధికారి అని తేలింది. సీక్రెట్ మిషన్ కోసం పని చేస్తున్నట్లు అబద్ధాలు చెప్పాడని పోలీసులు నిర్థారించుకున్నారు. ఐపీసీ సెక్షన్ 170, 419 ప్రకారం కేసులు నమోదు చేశారు. ఇతర నేరాలతో ఇతడికి సంబంధాలేమైనా ఉన్నాయా? అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. ఇదే తరహా నేరారోపణలపై ధూలే పోలీస్స్టేషన్ పరిధిలో 2000 సంవత్సరంలోనూ వాసుదేవ్పై కేసు నమోదైంది. అతడు బీకాంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి, ఎంఏ చదివినట్లు తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.