ఇకపై బంగారు ఆభరణాలకు హాల్‌మార్క్‌ తప్పనిసరి

బంగారు ఆభరణాలకు హాల్‌మార్క్‌ తప్పనిసరి చేసేందుకు కేంద్రం ఇచ్చిన గడువు ముగిసింది. దీంతో ఇక పై అన్ని బంగారు ఆభరణాలు, వస్తువులకు హాల్‌మార్క్‌ తప్పనిసరి అయింది.

Published : 15 Jun 2021 21:31 IST

దిల్లీ: బంగారు ఆభరణాలకు హాల్‌మార్క్‌ తప్పనిసరి చేసేందుకు కేంద్రం ఇచ్చిన గడువు ముగిసింది. దీంతో ఇక పై అన్ని బంగారు ఆభరణాలు, వస్తువులకు హాల్‌మార్క్‌ తప్పనిసరి అయింది. బంగారు ఆభరణాల స్వచ్ఛతను ధృవీకరించేందుకు హాల్‌మార్క్‌ను వినియోగిస్తారు. గతేడాది నవంబరులో ప్రభుత్వం అన్ని బంగారు ఆభరణాలకు హాల్‌మార్కును తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మొదట ఈ ఏడాది జనవరి 15 వరకు గడువు విధించారు. తర్వాత కరోనా కారణంగా జూన్‌ 1 వరకు పొడిగించారు. అనంతరం జూన్‌ 15 చివరి తేదీగా ప్రకటించారు.

వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌ నివేదిక ప్రకారం భారత్‌లో 4లక్షల మంది బంగారు వర్తకులు ఉన్నారు. వారిలో కేవలం 35 వేల మందినే బ్యూరో ఆఫ్ ఇండియన్‌ స్టాండర్డ్స్‌ (బీఐఎస్‌) ధృవీకరించింది. బీఐఎస్‌ ఏప్రిల్‌, 2000 నుంచి హాల్‌మార్క్‌ పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. బంగారం స్వచ్ఛత, వినియోగదారుల రక్షణ, ఆభరణాల విశ్వసనీయత కోసం ఈ విధానం అందుబాటులోకి తెచ్చారు. ఇది భారత్‌ను బంగారం మార్కెట్‌కు కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు కూడా ఉపయోగపడుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని