ఇక.. ఏడాది పొడవునా మామిడి
ఏడాది పొడవునా మామిడి కాయలు కాసే కొత్త రకాన్ని రాజస్థాన్లోని కోటాకు చెందిన శ్రీకిషన్ సుమన్ అనే రైతు కనిపెట్టినట్లు కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ
కొత్తరకాన్ని కనిపెట్టిన రాజస్థాన్ రైతు
దిల్లీ: ఏడాది పొడవునా మామిడి కాయలు కాసే కొత్త రకాన్ని రాజస్థాన్లోని కోటాకు చెందిన శ్రీకిషన్ సుమన్ అనే రైతు కనిపెట్టినట్లు కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. సదాబహార్ (సతతహరితం) పేరుతో రూపొందించిన ఈ పొట్టి రకం మామిడి సాధారణ తెగుళ్లు అన్నింటినీ తట్టుకుని ఏడాది పొడవునా కాపు ఇస్తుందని తెలిపింది. ‘‘ఉత్తర భారత్లో ఎక్కువగా లభించే లంగడా రకంతో పోలిస్తే ఈ పండు చాలా పొట్టిగా ఉంటుంది. పెరటి తోటల్లో, కుండీల్లో పెంచుకోవచ్చు. ముదురు కమలాపండు రంగులో కనిపించే దీని కండ భాగం చాలా తియ్యగా ఉంటుంది. పుష్కలమైన పోషకాలతో నిండిన ఈ మామిడి ఆరోగ్యానికి చాలా మంచిది.
ఈ సరికొత్త మామిడిని కనుగొనడం వెనక పేదరికంలో పుట్టిపెరిగిన శ్రీకిషన్ మేధోసంపత్తి ఉంది. రెండో తరగతితో చదువు ఆపేసిన ఆయన 2000 సంవత్సరంలో తన తోటలోని ఓ మామిడి మొక్క మిగతా వాటికంటే భిన్నంగా ఏడాది పొడవునా కాయలు కాయడాన్ని గమనించారు. దానికి అయిదు అంట్లు కట్టి కొత్త రకాలు అభివృద్ధి చేయడంపై దృష్టిసారించారు. అలా కట్టిన అంట్లను భద్రపరుస్తూ కొత్త రకం తయారుచేయడానికి ఆయనకు 15 ఏళ్లు పట్టింది. ఇలా అంటుకట్టిన మొక్క రెండో యేట నుంచే పండ్లు కాయడాన్ని గమనించారు. సదాబహార్పై నమ్మకం కుదరడంతో ఆ మొక్కను రాష్ట్రపతి భవన్లోని మొగల్ గార్డెన్లో నాటడానికి నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ (ఎన్ఐఎఫ్) చొరవ తీసుకుంది. శ్రీకిషన్ సుమన్కు 9వ నేషనల్ గ్రాస్రూట్ ఇన్నోవేషన్, ట్రెడిషనల్ నాలెడ్జ్ అవార్డు ఇచ్చింది. ఈ కొత్త రకం మామిడి కోసం 2017-20 మధ్యకాలంలో 8వేల ఆర్డర్లు వచ్చాయి. 2018-20 మధ్యకాలంలో శ్రీకిషన్ దేశంలోని వివిధ రాష్ట్రాల రైతులకు 6వేల మొక్కలు సరఫరా చేశారు. కృషి విజ్ఞాన కేంద్రాలకు 500 మొక్కలు ఇచ్చారు. అలాగే 400 అంటు మొక్కలను వివిధ రాష్ట్రాల్లోని వ్యవసాయ పరిశోధన కేంద్రాలకు సరఫరా చేశారు’’ అని కేంద్ర శాస్త్రసాంకేతిక శాఖ వివరించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.