మహమ్మారి అంతానికి మన్మోహన్ సూచనలు!
కరోనాను ఎదుర్కొనేందుకు సూచనలు చేస్తూ మాజీ ప్రధాని మన్మోహన్.. ప్రధాని నరేంద్రమోదీకి లేఖరాశారు
మోదీకి లేఖ రాసిన మాజీ ప్రధాని
దిల్లీ: కరోనా మహమ్మారిని సమర్థంగా ఎదుర్కోవడానికి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేయడమే కీలక మార్గమని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అన్నారు. ఈ మేరకు ఆయన మహమ్మారిని ఎదుర్కొనేందుకు కావాల్సిన కొన్ని సూచనలు చేస్తూ ప్రధాని మోదీకి ఆదివారం ఓ లేఖ రాశారు. కరోనా రెండో దఫా విజృంభిస్తున్న తరుణంలో ఆయన లేఖ రాయడం గమనార్హం.
వ్యాక్సిన్లు తీసుకున్నవారి సంఖ్య ముఖ్యం కాదని.. మొత్తం దేశ జనాభాలో ఎంత శాతం మందికి టీకా ఇచ్చామన్నదే అసలు విషయమని మన్మోహన్ తెలిపారు. ఆ విషయంలో భారత్ చాలా వెనుకబడి ఉందన్నారు. సరైన విధానాల రూపకల్పనతో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మరింత సమర్థంగా, వేగంగా కొనసాగించవచ్చని తెలిపారు. మహమ్మారి పారదోలడానికి ఇంకా చాలా చర్యలు తీసుకోవాల్సి ఉన్నప్పటికీ.. వ్యాక్సినేషన్ను వేగవంతం చేయడమే అత్యంత ముఖ్యమైన అంశమని పేర్కొన్నారు.
లేఖలో మన్మోహన్ ప్రస్తావించిన కీలక అంశాలు..
* వివిధ వ్యాక్సిన్ తయారీ కంపెనీలకు కరోనా టీకాల కోసం ప్రభుత్వం పెట్టిన ఆర్డర్ల వివరాలను వెల్లడించాలి. వీటిలో రానున్న ఆరు నెలల్లో అందే టీకాలు ఎన్ని?అవి ఎక్కడి నుంచి రాబోతున్నాయో తెలియజేయాలి. సరైన సమయంలో ఎక్కువ మందికి టీకా అందించాలంటే తగినన్నీ టీకా డోసులకు ముందుగానే ఆర్డర్ చేసి ఉంచాలి.
* వివిధ కంపెనీల నుంచి అందే టీకాలను రాష్ట్రాల మధ్య ఎలా పంచబోతున్నారో వివరించాలి. అత్యవసర పరిస్థితుల కోసం కేంద్రం 10 శాతం టీకాల్ని తమ వద్ద ఉంచుకోవచ్చు. మిగిలిన వాటిని రాష్ట్రాలకు ఎలా పంచబోతున్నారో తెలియజేస్తే.. రాష్ట్రాలు అందుకనుగుణంగా ప్రణాళికలు రచించుకునే అవకాశం ఉంటుంది.
* ఎవరిని ఫ్రంట్లైన్ వర్కర్లుగా గుర్తించాలనే విషయంపై రాష్ట్రాలకు కొంత వెసులుబాటు కల్పించాలి. స్థానిక పరిస్థితులను బట్టి కొన్ని రాష్ట్రాలు లాయర్లు, టీచర్లు, ట్యాక్సీ డ్రైవర్లను సహా మరికొన్ని వర్గాలకు చెందిన వారికి ఫ్రంట్లైన్ వర్కర్లుగా గుర్తించాలనుకుంటోంది. తద్వారా కొవిడ్ ముప్పు ఉన్న కొంత మందికి టీకా ముందుగానే అందే అవకాశం ఉంటుంది.
* ప్రస్తుతం ఆరోగ్య అత్యవసర పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని వ్యాక్సిన్ తయారీ కంపెనీలకు కేంద్రం ప్రభుత్వం కొన్ని ప్రోత్సాహకాలతో అండగా ఉండాలి. ఫలితంగా ఆయా కంపెనీలకు తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని విస్తరించేందుకు అవకాశం ఏర్పడుతుంది. అవసరమైతే నిధులు, రాయితీలతో అండగా నిలవాలి.
* దేశీయంగా టీకా సరఫరా కొరత ఉన్న నేపథ్యంలో.. ఐరోపా మెడికల్ ఏజెన్సీ, యూఎస్ఎఫ్డీఏ వంటి ప్రాధికార సంస్థలు ఆమోదించిన టీకాలకు ఎలాంటి షరతులు లేకుండానే భారత్కు దిగుమతి చేసుకునేందుకు అనుమతించాలి. భారత్లో ప్రయోగాలకు వీటికి తాత్కాలికంగా మినహాయింపునివ్వాలి. ఇలాంటి అత్యవసర సమయంలో ఈ ప్రతిపాదనకు నిపుణులు సైతం ఆమోదిస్తారని భావిస్తున్నాను. అయితే, ఈ విషయాలను టీకా తీసుకునే వారికి ముందుగానే తెలియజేయాలి. ప్రభుత్వం ఈ సూచనల్ని తప్పకుండా పరిగణనలోకి తీసుకుంటుందని భావిస్తున్నానంటూ మన్మోహన్ తన లేఖను ముగించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన
రక్షణ శాఖ మాజీ మంత్రి ఏకే ఆంటోనీ (AK Antony)కి కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh)కు ఓ సూచన చేశారు. -
నూతన నావికాదళాధిపతిగా వైస్ అడ్మిరల్ దినేశ్ త్రిపాఠి
Navy Chief: అడ్మిరల్ దినేశ్ కుమార్ త్రిపాఠి త్వరలో భారత నేవీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం ఆయన వైస్ చీఫ్గా వ్యవహరిస్తున్నారు. -
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
హిందూపురంలో నామినేషన్ వేసిన నందమూరి బాలకృష్ణ
-
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
-
తొలి విడత పోలింగ్.. కొన్ని రాష్ట్రాల్లో ఉద్రిక్తతలు..!
-
చంద్రబాబు తరఫున నామినేషన్ వేసిన నారా భువనేశ్వరి
-
మమ్ముట్టితో విభేదాలు.. స్పందించిన ‘ది వారియర్’ దర్శకుడు
-
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి