
తాజా చట్టాలతో రైతులకు మరిన్ని అవకాశాలు
మన్ కీ బాత్లో ప్రధాని మోదీ
దిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలు రైతుల కష్టాల్ని దూరం చేసి వారికి కొత్త అవకాశాలు, హక్కుల్ని కల్పిస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. సుదీర్ఘ చర్చ తర్వాతే పార్లమెంటులో వాటికి చట్టబద్ధత లభించిందని తెలిపారు. అతి తక్కువ సమయంలో రైతులు వీటి ఫలాల్ని అందుకుంటున్నారన్నారు. రైతులు నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీలో భారీ ఎత్తున ఆందోళన కొనసాగిస్తుండగా ప్రధాని ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. కొత్త చట్టాల ప్రకారం.. పంట కొనుగోలు పూర్తయిన మూడు రోజుల్లో రైతుల ఖాతాల్లో సొమ్ము జమ కావాలని ప్రధాని గుర్తుచేశారు. లేనిపక్షంలో అన్నదాతలకు ఫిర్యాదు చేసే హక్కు ఉంటుందని తెలిపారు. రైతుల ఫిర్యాదులను జిల్లా సబ్ డివిజినల్ మెజిస్ట్రేట్ నెలలోపు పరిష్కరించాల్సి ఉంటుందన్నారు. జితేంద్ర సింగ్ అనే రైతు ఇటీవల ఫిర్యాదు చేయగా.. నెల లోపే ఆయన సమస్యను పరిష్కరించారని ప్రధాని తెలిపారు. ప్రతి నెలా చివరి ఆదివారం ప్రసారమయ్యే మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా నేడు ప్రధాని తన అభిప్రాయాలను పంచుకున్నారు.
ఈ సందర్భంగా మోదీ పలువురు రైతుల చేస్తున్న వినూత్న కృషిని ప్రశంసించారు. ‘‘మహమ్మద్ అస్లాం అనే రైతు.. తన చుట్టూ ఉండే రైతులతో ఓ వాట్సాప్ గ్రూప్ సృష్టించారు. ఆ ప్రాంతంలోని వివిధ రైతు బజార్లలో పంట ఉత్పత్తుల ధరలు వంటి సమాచారాన్ని వారితో పంచుకుంటారు. ఆయన సొంతంగా కూడా రైతుల పంటల్ని కొనుగోలు చేస్తారు. రైతులు తమ ఉత్పత్తుల్ని ఎక్కడ విక్రయించాలో నిర్ణయించుకునేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతోంది’’ అని ప్రధాని తెలిపారు.
మన సంపద మనకు చేరుతోంది..
భారత్ నుంచి విదేశాలకు అక్రమంగా తరలివెళ్లిన అనేక పురాతన విగ్రహాలు, వస్తువులు తీసుకురావడంలో గత కొన్నేళ్లుగా ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఫలించాయని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఈ క్రమంలో త్వరలో కెనడా నుంచి 100 ఏళ్ల నాటి అన్నపూర్ణాదేవీ విగ్రహం తిరిగి రానుందని వెల్లడించారు. దాదాపు 1913వ సంవత్సరంలో ఈ విగ్రహాన్ని కొంత మంది దుండగులు దొంగిలించి విదేశాల్లో అమ్మేశారని తెలిపారు. కెనడా ప్రభుత్వంతో మాట్లాడి భారత్కు వచ్చేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఈ సందర్భంగా కెనడా ప్రభుత్వానికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
వారసత్వ సంపద కాపాడడంలో సాంకేతికత..
దేశవ్యాప్తంగా ఉన్న ప్రదర్శనశాలలు, గ్రంథాలయాలు పూర్తిగా డిజిటలీకరణ దిశగా సాగుతున్నాయని ప్రధాని తెలిపారు. ఈ క్రమంలో దిల్లీలోని నేషనల్ మ్యూజియం కొన్ని ప్రతిష్ఠాత్మక చర్యలు చేపట్టిందని తెలిపారు. త్వరలో 10 వర్చువల్ గ్యాలరీలు ప్రారంభించే దిశగా సాగుతోందన్నారు. ప్రపంచ వారసత్వ వారోత్సవాల వంటి ప్రత్యేక రోజులు మన దేశ సంస్కృతిని, వారసత్వ సంపదను అర్థం చేసుకునేందుకు ఎంతో దోహదం చేస్తాయని తెలిపారు. కరోనా సమయంలోనూ ప్రజలు వినూత్న పద్ధతిలో వారోత్సవాలు జరుపుకొన్నారని గుర్తుచేశారు. మన పూర్వీకుల సంపదను కాపాడడంలో సాంకేతికత ఎంతో ఉపయోగపడుతుందన్నారు. త్వరలో అజంతా గుహలను కూడా డిజిటలైజ్ చేస్తున్నట్లు సమాచారం అందిందన్నారు. ఇలాంటి కార్యక్రమాల వల్ల భావితరాలకు మన దేశ ఘనమైన వారసత్వ సంపద అందుతుందన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (03-07-2022)
-
India News
Chemist killing: నుపుర్ శర్మ వివాదంలో మరో హత్య ..! దర్యాప్తు ఎన్ఐఏ చేతికి..
-
India News
IRCTC: కప్ టీ ₹70.. రైల్వే ప్రయాణికుడి షాక్.. ట్వీట్ వైరల్!
-
Politics News
Pawan Kalyan: కుల, మతాల ప్రస్తావన లేని రాజకీయాలు రావాలి: పవన్
-
General News
Diabetes food chart: ఇవి తినండి...షుగర్ తగ్గించుకోండి
-
Movies News
Samantha: విజయ్ దేవరకొండ రూల్స్ బ్రేక్ చేయగలడు: సమంత
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Weekly Horoscope : రాశిఫలం ( జులై 03 - 09 )
- RaviShastri: బుమ్రా బ్యాటింగ్కు రవిశాస్త్రి ఫిదా.. బీసీసీఐ ప్రత్యేక వీడియో..!
- IND vs ENG: ముగిసిన రెండో రోజు ఆట.. టీమ్ఇండియాదే పైచేయి
- Diabetes food chart: ఇవి తినండి...షుగర్ తగ్గించుకోండి
- Vikram: విక్రమ్ న్యూ ఏజ్ కల్ట్ క్లాసిక్.. అందుకు నా అర్హత సరిపోదు: మహేశ్బాబు
- ఇటు బుమ్రా.. అటువరుణుడు
- IND vs ENG: యువరాజ్ సింగ్ను గుర్తుచేసిన బుమ్రా
- Samantha: విజయ్ దేవరకొండ రూల్స్ బ్రేక్ చేయగలడు: సమంత
- social look: లవ్లో పడిన రష్మి.. జిమ్లో పడిన విద్యురామన్.. ‘శ్రద్ధ’గా చీరకడితే..
- Chemist killing: నుపుర్ శర్మ వివాదంలో మరో హత్య ..! దర్యాప్తు ఎన్ఐఏ చేతికి..