Mann Ki baat: విక్టరీ పంచ్తో ఒలింపిక్స్లో విజయాన్ని కాంక్షిద్దాం!
ఒలింపిక్స్లో పాల్గొంటున్న భారత బృందానికి శుభాకాంక్షలు తెలుపుతూ ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల మన్ కీ బాత్ని ఆరంభించారు. త్రివర్ణ పతాకాన్ని చేతబూని ప్రారంభోత్సవాల్లో భారత్ బృందం చేసిన మార్చింగ్ యావత్తు దేశాన్ని పులకరింపజేసిందన్నారు.....
ఒలింపిక్స్.. అమృత్ మహోత్సవ్.. మన్ కీ బాత్ ముఖ్యాంశాలు
దిల్లీ: ఒలింపిక్స్లో పాల్గొంటున్న భారత బృందానికి శుభాకాంక్షలు తెలుపుతూ ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల మన్ కీ బాత్ని ఆరంభించారు. త్రివర్ణ పతాకాన్ని చేతబూని ప్రారంభోత్సవాల్లో భారత్ బృందం చేసిన మార్చింగ్ యావత్తు దేశాన్ని పులకరింపజేసిందన్నారు. ఒలింపిక్స్లో ఆడుతున్న ప్రతిఒక్కరూ విజయంతో తిరిగి రావాలని ఆకాంక్షించారు. క్రీడాకారులకు మద్దతుగా సామాజిక మాధ్యమాల్లో ప్రారంభమైన ‘హమారా విక్టరీ పంచ్’ ద్వారా ప్రతిఒక్కరూ ఆటగాళ్లకు అండగా నిలవాలని కోరారు.
మన్ కీ బాత్లోని మరిన్ని ముఖ్యాంశాలు..
★ జులై 26 కార్గిల్ విజయ్ దివస్ను పురస్కరించుకొని.. నాటి సైనికధీరుల త్యాగాలను మోదీ గుర్తుచేశారు. భారత సైనిక దళాల ధీరత్వాన్ని, సంయమనాన్ని యావత్ ప్రపంచం కార్గిల్ యుద్ధం సమయంలో వీక్షించిందన్నారు.
★ భారత్కు స్వాతంత్ర్యం సిద్ధించి వచ్చే ఆగస్టు 15 నాటికి 74 సంవత్సరాలు నిండి 75వ వసంతం రాబోతోంది. ఈ సందర్భంగా మార్చి 12న గాంధీ సబర్మతీ ఆశ్రమం నుంచి ‘అమృత్ మహోత్సవ్’ ప్రారంభించిన విషయాన్ని మోదీ గుర్తుచేశారు. గాంధీజీ దండియాత్రను పునరుద్ధరించిన రోజు కూడా అదే అని తెలిపారు. నాటి నుంచి దేశవ్యాప్తంగా అమృత్ మహోత్సవ్ జరుగుతోందన్నారు.
★ అమృత్ మహోత్సవ్లో భాగంగా అనేక మంది సాతంత్ర్య సమరయోధుల గురించి చర్చించుకుంటున్నామన్నారు. మణిపూర్లోని మోయిరంగ్ అనే చిన్న పట్టణం సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఇండియన్ నేషనల్ ఆర్మీ(ఐఎన్ఏ)కి ప్రధాన స్థావరంగా ఉండేదని తెలిపారు. అక్కడ ఐఎన్ఏకు చెందిన కర్నల్ షౌకత్ మాలిక్ స్వాతంత్ర్యానికి పూర్వం 14 ఏప్రిల్ 1944న తొలిసారి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారని చెప్పారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 14ని మోయిరంగ్ డేని జరుపుకొంటున్నామని వెల్లడించారు. అమృత్ మహోత్సవ్లో భాగంగా గత ఏప్రిల్ 14న కూడా మువ్వన్నెల పతాకాన్ని ఎగురవేశామని పేర్కొన్నారు.
★ ఆగస్టు 15న జాతీయ గీతాన్ని ఆలపించి రికార్డు చేయాలని దాన్ని రాష్ట్రగాన్.ఇన్కు అప్లోడ్ చేయాలని ప్రధాని కోరారు. అమృత్ మహోత్సవ్లో భాగంగా కేంద్ర సాంస్కృతిక శాఖ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందన్నారు. వీలైనంత ఎక్కువ మంది ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
★ ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని.. చేనేత కార్మికుల కృషిని ప్రధాని ప్రశంసించారు. చేనేత వస్త్రాలు కొని ప్రతిఒక్కరూ వారికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు.
★ వైవిధ్యమైన సంస్కృతిగల భారత్లో ప్రతిఒక్కరూ కలిసి ఐకమత్యంగా ఉండాలని ప్రధాని కోరారు. ఈ మేరకు అమృత్ మహోత్సవ్ సందర్భంగా ‘నేషన్ ఫస్ట్.. ఆల్వేస్ ఫస్ట్’ అనే ప్రతిజ్ఞ తీసుకోవాలని పిలుపునిచ్చారు.
మన్ కీ బాత్లో భాగంగా వివిధ రంగాల్లో పలువురు చేస్తున్న విశిష్ట సేవలను ప్రధాని ప్రశంసించారు. వెదర్మ్యాన్గా పేరొందిన సాయిప్రణీత్ను ఈ సందర్భంగా మోదీ ప్రత్యేకంగా అభినందించారు. తిరుపతికి చెందిన ఈయన బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పని చేస్తున్నారు. ఏడేళ్లుగా వాతావరణ అంశాలను విశ్లేషిస్తూ ఐఎండీ, ఐరాస ప్రశంసలు అందుకున్నారు.
★ వానలు విస్తారంగా కురుస్తున్న నేపథ్యంలో వర్షపు నీటిని ఒడిసిపట్టాలని ప్రధాని పిలుపునిచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు
-
నడుం నొప్పి, కుంగుబాటు, తలనొప్పి.. అనారోగ్యానికి ప్రధాన కారణాలివే
-
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్తో పాటు 9 మంది అధికారులు మృతి
-
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు