trump: ట్రంప్నకు వెన్నుపోటు పొడిచిన ఆర్మీ జనరల్..!
ఓ అమెరికా జనరల్ దేశ అధ్యక్షుడి ఆలోచనలను చైనా జనరల్కు ఫోన్ చేసి ముందే చెప్పేశారు. కొన్నాళ్లకు ఈ విషయం బయటకు వచ్చింది.. దీంతో యుద్ధాన్ని నివారించేందుకు అలా చేశానని ఇప్పుడా జనరల్
చైనా జనరల్కు ఫోన్.. మార్క్మిల్లీ నిర్వాకం
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
ఓ అమెరికా జనరల్ దేశ అధ్యక్షుడి ఆలోచనలను చైనా జనరల్కు ఫోన్ చేసి ముందే చెప్పేశారు. కొన్నాళ్లకు ఈ విషయం బయటకు వచ్చింది.. దీంతో యుద్ధాన్ని నివారించేందుకు అలా చేశానని ఇప్పుడా జనరల్ తాను చేసిన పని సమర్థించుకొంటున్నారు. అతనికి ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ అండగా నిలుస్తున్నారు. తాజాగా ఆ జనరల్ అమెరికా కాంగ్రెస్ విచారణకు హాజరుకావడంతో ఈ విషయం మరోసారి చర్చకు వచ్చింది.
ఏమి జరిగింది..?
ట్రంప్ హయాంలో అమెరికా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్గా మార్క్ మిల్లీని నియమించారు. అదే సమయంలో అమెరికాలో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉంది. ఈ విషయంలో ట్రంప్ చైనాపై తీవ్ర అసహనంతో ఉన్నారు. ఈ విషయాన్ని మార్క్ మిల్లీ గమనించారు. ఆయన చైనాపై అణు దాడి చేయవచ్చని ఊహించుకున్నారు. అక్టోబర్ 30వ తేదీన చైనా జనరల్ లీ జూఛెంగ్కు ఫోన్ చేశారు. తమ అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర ఆగ్రహంగా ఉన్నారని.. యుద్ధం ప్రారంభించమని ఆదేశాలు ఇవ్వొచ్చని వెల్లడించాడు. చైనా వెంటనే ప్రతిదాడి చేయవద్దని కోరారు. అనంతరం జనవరి 8వ తేదీన మార్క్ మిల్లీ మరోసారి చైనా జనరల్కు ఫోన్ చేశారు. ట్రంప్ పదవిని వీడే సమయంలో దాడికి ఆదేశాలు ఇవ్వొచ్చనే విషయాన్ని వెల్లడించాడు. తనకు ఆదేశాలు వస్తే ముందే వెల్లడిస్తానని చైనా జనరల్కు చెప్పారు. అంతేకాదు కీలక అమెరికా సైనిక జనరల్స్ను సమావేశపర్చి ట్రంప్ ఆదేశాలను వెంటనే అమలు చేయవద్దని సూచించారు. ఈ విషయం మొత్తం బాబ్ ఉడ్వర్డ్, రాబర్ట్ కోస్టాలు రాసిన ‘పెరల్’ అనే పుస్తకంలో పేర్కొన్నారు. మార్క్ మిల్లీ నైతికంగా నేరస్థుడని రచయితలు అభిప్రాయపడ్డారు. ఉడ్వర్డ్ ఈ పుస్తకం రాసేందుకు గతంలో మార్క్ మిల్లీని ఇంటర్వ్యూ చేశారు. దీంతో అమెరికా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ట్రంప్ ఈ విషయం తెలిసి మండిపడ్డారు. ఈ కాల్స్ చేయడానికి అధ్యక్షుడి నుంచి మిల్లీ ఎటువంటి అనుమతులు తీసుకోలేదు.
మిల్లీ ఏమంటున్నారు..?
తాజాగా సెనెట్ ఆర్మ్డ్ సర్వీస్ కమిటీ అఫ్గాన్ పరిణామాలతో సహా పలు అంశాలపై విచారణ చేపట్టింది. ఈ కమిటీలో రిపబ్లికన్లు, డెమోక్రాట్లు సభ్యులుగా ఉంటారు. వీరు మార్క్ మిల్లీని ఫోన్కాల్స్పై ప్రశ్నించారు. ‘ఆ సమయంలో ఉద్రిక్తతలను తగ్గించడం నా కర్తవ్యం’ అని మిల్లీ సెనెటర్లకు వివరించారు. ట్రంప్నకు అలాంటి ఉద్దేశం లేదనే విషయం తనకు తెలుసునని పేర్కొనడం విశేషం. అంతేకాదు తాను ఫోన్ కాల్స్ చేసిన విషయం ట్రంప్ కార్యవర్గంలోని చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ మార్క్ మెడోస్, సెక్రటరీ ఆఫ్ స్టేట్ మైక్ పాంపియో, డిఫెన్స్ సెక్రటరీ మార్కె ఎస్పర్లకు తెలుసని చెప్పారు. అదే సమయంలో జనవరి 8వ తేదీన స్పీకర్ నాన్సీ పెలోసీ ఫోన్కాల్ విషయాన్ని కూడా వెల్లడించారు. పెలోసీ కూడా అధ్యక్షుడు అణ్వాయుధాలను వాడే సామర్థ్యంపై ప్రశ్నించారని చెప్పారు. అణ్వాయుధాల వాడకానికి ఒక విధానం ఉందని.. దానిని మినహాయించి.. చట్టవిరుద్ధంగా, ప్రమాదవశాత్తు వాటిని వినియోగించకుండా చేస్తానని పెలోసికి చెప్పినట్లు మిల్లీ వివరించారు.
వెనకేసుకొస్తున్న శ్వేతసౌధం..
మిల్లీ చర్యలపై రిపబ్లికన్లు మండిపడుతున్నారు. అతను రాజీనామా చేయడం కానీ, అధ్యక్షుడు అతన్ని తొలగించడం కానీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సెనెటర్ మార్కో రూబియో ఈ మేరకు బైడెన్కు ఓ లేఖ కూడా రాశారు. దీనిపై శ్వేత సౌధం స్పందిస్తూ అధ్యక్షుడు బైడెన్కు మిల్లీపై పూర్తి విశ్వాసం ఉందని పేర్కొంది. మిల్లీని.. ట్రంప్ ఆర్మీ చీఫ్గా నియమించారు. ఆ తర్వాత ఆయన్ను జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్గా నియమించారు. బైడెన్ మిల్లీని కొనసాగించారు. ప్రస్తుతం బైడెన్ సలహాదారుల్లో మిల్లీ కూడా ఒకరు.
అఫ్గానిస్థాన్ గందరగోళం బైడెన్ పనే..!
సెనెట్ ఆర్మ్డ్ సర్వీస్ కమిటీ విచారణ సందర్భంగా అఫ్గాన్కు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. ఈ కమిటీ మిల్లీతోపాటు సెంట్ కామ్ కమాండర్ మెకంజీని కూడా ప్రశ్నలు అడిగింది. ఈ సందర్భంగా వారు తాము అఫ్గాన్లో 2,500 మంది సైనికులను ఉంచమని అధ్యక్షుడికి చెప్పామన్నారు. తర్వాత శ్వేతసౌధం ప్రతినిధి జెన్సాకీ మాట్లాడుతూ ‘‘అధ్యక్షుడు జనరల్స్ సలహాలకు విలువిస్తారు. అలాగని వారుచెప్పిన దాంతో ఏకీభవిస్తారని అనుకోవద్దు’’ అని పేర్కొన్నారు.
వాస్తవానికి ఆగస్టు 19న జో బైడెన్ ఓ ఆంగ్ల పత్రికా విలేకరితో మాట్లాడుతూ అఫ్గాన్లో స్వల్ప సంఖ్యలో దళాలను కొనసాగించాలనే అంశంపై తనకు ఎవరూ సలహా ఇచ్చినట్లు గుర్తుకు రావడంలేదని అనడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శరద్ పవార్ వైపు దూసుకొచ్చిన మైక్రోఫోన్!
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ ఓ సభలో మాట్లాడుతుండగా ఆయన వైపు మైక్రోఫోన్ ఒకటి దూసుకురావడం చిన్నపాటి కలకలం రేపింది. -
వేదమంత్రాల సాక్షిగా శ్రీకృష్ణుడితో యువతి పెళ్లి
మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో ఓ యువతి చిన్నప్పటి నుంచి తాను ఆరాధించిన శ్రీకృష్ణుణ్ని పెళ్లి చేసుకుంది. -
మామిడిపండ్లను మూడుసార్లే తిన్నా
బెయిల్ కోసం ఉద్దేశపూర్వకంగా చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకుంటున్నానని ఈడీ తనపై చేసిన ఆరోపణలపై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఘాటుగా స్పందించారు. -
మూడు రోజుల్లో తేల్చాలి
ఎన్నికలు సమీపిస్తున్నాయనే ఏకైక సాకుతో సభలు, సమావేశాలు, ఓటరు చైతన్య యాత్రలు, నిరసనలు, ధర్నాలు తదితరాలపై జిల్లా, రాష్ట్ర అధికార యంత్రాంగాలు నిషేధం విధించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. -
నౌకాదళ నూతన అధిపతిగా దినేశ్కుమార్ త్రిపాఠి
నూతన నౌకాదళాధిపతిగా వైస్ అడ్మిరల్ దినేశ్ కుమార్ త్రిపాఠి నియమితులయ్యారు. ఈ నెలాఖర్లో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. -
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
చిన్నపిల్లలు అశ్లీల వీడియోలు చూడటం నేరం కాకపోవచ్చేమో గానీ, పిల్లలను ఉపయోగించి అశ్లీల వీడియోలు తీయడం తీవ్రమైన ఆందోళన కలిగించే విషయమేగాక నేరమని శుక్రవారం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
తిరస్కృత నామినేషన్లపై పిటిషన్ను తోసిపుచ్చిన సుప్రీం
తిరస్కృత నామినేషన్లకు పరిష్కారం నామినేషన్లు దాఖలు చేయడంలోనే ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
‘సైన్స్శక్తి’గా ఎదిగేందుకు భారత్ సిద్ధం
ప్రబల ఆర్థికశక్తిగా ఎదుగుతున్న భారత్.. శాస్త్ర, సాంకేతిక రంగంలోనూ సత్తా చాటేందుకు సిద్ధమవుతోందని ప్రముఖ సైన్స్ వారపత్రిక ‘నేచర్’ పేర్కొంది. -
వివాహేతర సంబంధం విడాకులకు మాత్రమే కారణం.. పిల్లల కస్టడీ మంజూరుకు కాదు
వివాహేతర సంబంధం కారణం చూపి విడాకులు పొందవచ్చు కానీ, పిల్లల కస్టడీని పొందలేరని బొంబాయి హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. -
అభ్యర్థుల మార్కులను వెల్లడించిన యూపీఎస్సీ
సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో అభ్యర్థులు సాధించిన మార్కుల వివరాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) శుక్రవారం విడుదల చేసింది. -
దుబాయ్ ప్రయాణాలు వాయిదా వేసుకోండి
అత్యవసరమేమీ కానట్లయితే దుబాయ్కి, ఇక్కడి నుంచి వేరే దేశాలకు వెళ్లేందుకు భారతీయులు తమ ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని యూఏఈలోని భారత దౌత్య కార్యాలయం సూచించింది. -
స్కూల్లో హెచ్ఎంకు ఫేషియల్ వీడియో తీసిన టీచరుపై దాడి
ఉత్తర్ప్రదేశ్లోని ఉన్నావ్ జిల్లా దండమౌ గ్రామ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సంగీతాసింగ్ పనివేళల్లో ఫేషియల్ చేయించుకున్నారు. -
ఆరోగ్యకర ఆయుర్దాయాన్ని పెంచేందుకు ప్రాజెక్టు
మానవుల ఆరోగ్యకర ఆయుర్దాయాన్ని పెంచేందుకు బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) ఒక ప్రాజెక్టును చేపట్టింది. -
ఓటు స్ఫూర్తిని చాటిన సైలెంట్ విలేజ్
ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేందుకు వైకల్యం అడ్డుకాదని చాటారు జమ్మూకశ్మీర్లోని ధడ్కాహి గ్రామస్తులు. డోడా జిల్లాలోని ధడ్కాహి.. ఉధమ్పుర్ లోక్సభ స్థానం పరిధిలోకి వస్తుంది. -
రోజూ 15 నిమిషాలు వైద్యుడిని సంప్రదించేందుకు అనుమతివ్వండి
తిహాడ్ జైలులో తాను ఇన్సులిన్ వినియోగించేందుకు అనుమతినిచ్చేలా జైలు అధికారులకు ఆదేశాలు ఇవ్వాలంటూ దిల్లీ కోర్టులో కేజ్రీవాల్ అభ్యర్థనను దాఖలు చేశారు. -
ఫిలిప్పీన్స్ చేతికి భారత్ బ్రహ్మోస్
బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూజ్ క్షిపణుల మొదటి బ్యాచ్ను భారత్.. శుక్రవారం ఫిలిప్పీన్స్కు అందజేసింది. -
యోగాగురు రాందేవ్ కేసుల పరిస్థితేంటి?
యోగాగురు రాందేవ్పై నమోదైన ఫిర్యాదుల పరిస్థితిని, ఎఫ్ఐఆర్ వివరాలను సమర్పించాలని బిహార్, ఛత్తీస్గఢ్ ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. -
కోల్కతా హైకోర్టులో న్యాయవాదులు గౌను ధరించాల్సిన అవసరం లేదు
రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో కోల్కతా హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. -
బాలిక 28 వారాల గర్భం తొలగింపుపై వైద్యుల సలహా కోరిన సుప్రీంకోర్టు
అత్యాచార బాధితురాలైన 14 ఏళ్ల బాలిక అభ్యర్థన మేరకు ఆమె 28 వారాల గర్భం తొలగించటానికి అనుమతించే విషయమై సర్వోన్నత న్యాయస్థానం వైద్యుల సలహా కోరింది. -
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
వేసవి రద్దీని తీర్చేందుకు రైల్వేశాఖ సిద్ధమైంది. ఈ సీజన్లో దేశవ్యాప్తంగా 9,111 అదనపు ట్రిప్పులు నడపనున్నట్లు ప్రకటించింది. -
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా? UPSC పరీక్షల మార్కుల షీట్లు విడుదల
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో తొలి 10 మంది టాపర్లు సాధించిన మార్కులు ఇవే..
తాజా వార్తలు (Latest News)
-
రాజీనామా చేయకుంటే ఊరుకోం.. వాలంటీర్లపై వైకాపా నాయకుల ఒత్తిడి
-
శరద్ పవార్ వైపు దూసుకొచ్చిన మైక్రోఫోన్!
-
నిషేధమెక్కడ.. ‘నిషా’దమే.. రక్త మాంసాలతో జగన్ వ్యాపారం
-
పనసపండు గుర్తు ఎక్కడ?.. గందరగోళానికి గురైన ఓటర్లు
-
బాబు సీఎం అయ్యే వరకు పాదరక్షలు ధరించనని..!
-
బస్సులు జగన్ సభకు.. కష్టాలు ప్రయాణికులకు