viral News: సిగరెట్లు తాగొద్దన్నందుకు రణరంగంగా మారిన యూనివర్శిటీ..!
సిగరెట్లు తాగొద్దన్నందుకు విద్యార్థులు హాస్టల్లను రణరంగంగా మార్చేశారు. దీంతో పోలీసులు వచ్చి పరిస్థితిని అదుపు చేయాల్సి వచ్చింది. ఈ ఘటన నోయిడాలో చోటు చేసుకొంది.
ఇంటర్నెట్డెస్క్: సిగరెట్లు తాగొద్దన్నందుకు ఏకంగా విశ్వవిద్యాలయ ప్రాంగణాన్ని విద్యార్థులు రణరంగంగా మార్చేశారు. ఈ ఘటన నోయిడాలోని గౌతమ్ బుద్ధ ప్రభుత్వ విశ్వవిద్యాలయంలో చోటు చేసుకొంది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి 33 మంది గార్డులు, విద్యార్థులను అదుపులోకి తీసుకొన్నారు.
‘విశ్వవిద్యాలయ క్యాంపస్లోని మున్షీ ప్రేమ్ చంద్ హాస్టల్ లోపల కొందరు విద్యార్థులు ధూమపానం చేస్తున్నారు. అక్కడి సెక్యూరిటీ గార్డులు దీనికి అభ్యంతరం తెలపడంతో వివాదం మొదలైంది. రాత్రి 10.30 సమయంలో ఇరువర్గాల మధ్యా వాగ్వాదం చోటుచేసుకుని.. ఘర్షణగా మారింది. సమాచారం అందుకొన్న పోలీసు బృందాలు అక్కడికి చేరుకొని 33 మందిని అదుపులోకి తీసుకొన్నాయి. ఇరు వర్గాలు పరస్పరం ఫిర్యాదులు చేసుకొన్నాయి. ఈ ఘర్షణపై దర్యాప్తు చేస్తున్నాం’ అని పోలీస్ శాఖ ప్రతినిధి తెలియజేశారు.
పోలీసుల అదుపులో ఉన్నవారిలో ప్రైవేటు సెక్యూరిటీ గార్డులు, విద్యార్థులు ఉన్నారు. ఈ ఘటన ఎకోటెక్ 1 పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకొంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో వైరల్గా మారింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
South Korea: అణ్వాయుధాలే ప్రయోగిస్తే.. అంతం చేస్తాం..! కిమ్కు హెచ్చరిక
-
JetBlue: విమానం ల్యాండింగ్కు ముందు ప్రతికూల వాతావరణం.. గాయపడిన ప్రయాణికులు
-
Ambani: అంబానీ వారసులకు వేతనాలు ఉండవు
-
IND vs AUS: బరిలోకి నలుగురు ‘కీ’ ప్లేయర్లు.. అరుదైన ఘనతపై భారత్ కన్ను!
-
AP High Court: అమరావతి రింగ్రోడ్డు కేసు.. చంద్రబాబు బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా
-
Jammu Kashmir : జమ్మూకశ్మీర్లో ఉగ్రవాద కార్యకలాపాలు.. ఆరుగురి అరెస్ట్!