Bhagwant Mann: పంజాబ్‌ సీఎం భగవంత్ మాన్‌ ఇంటి వద్ద ఉద్రిక్తత!

పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌(Bhagwant Mann) నివాసం వద్ద  ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Published : 30 Nov 2022 22:12 IST

సంగ్రూర్‌: పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌(Bhagwant Mann) నివాసం వద్ద  ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వేతనాలు పెంపు సహా తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ ఆయన సొంత నియోజకవర్గం సంగ్రూరులోని మాన్‌ ఇంటి వద్ద  పలు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కార్మికులు నిరసనకు దిగారు. తొలుత పటియాలా బైపాస్‌ వద్దకు చేరుకున్న వీరంతా.. అక్కడి నుంచి ర్యాలీగా సీఎం నివాసం వద్దకు చేరుకున్నారు. దీంతో ముఖ్యమంత్రి ఇంటివద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం ఆందోళనకారుల్ని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీఛార్జి చేయడంతో పలువురు కార్మికులు గాయపడ్డారు. ప్రస్తుతం భగవంత్ మాన్‌ గుజరాత్‌లో ఆప్‌ తరఫున ప్రచారంలో ఉన్నట్టు సమాచారం. అయితే, కార్మికులు మాత్రం తమ డిమాండ్లు పరిష్కరించాల్సేందనని పట్టుబట్టి  ఆయన ఇంటి వద్ద ధర్నాకు దిగినట్టు తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని