బిల్గేట్స్ గారాల కూతురి గురించి తెలుసా?
ఫీబీ అడెల్ గేట్స్.. ఈమె ఎవరు అనుకుంటున్నారా? మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్గేట్స్, మెలిందా గేట్స్ గారాల కూతురు. 18 ఏళ్ల ఈ అమ్మాయి సామాజిక మాధ్యమాల్లో ఎంతో చురుగ్గా ఉంటూ అప్పుడప్పుడు తన ఫొటోలను పంచుకుంటోంది.
ఇంటర్నెట్డెస్క్: ఫీబీ అడెల్ గేట్స్.. ఈమె ఎవరు అనుకుంటున్నారా? మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్గేట్స్, మెలిందా గేట్స్ గారాల కూతురు. 18 ఏళ్ల ఈ అమ్మాయి సామాజిక మాధ్యమాల్లో ఎంతో చురుగ్గా ఉంటూ అప్పుడప్పుడు తన ఫొటోలను పంచుకుంటోంది. గేట్స్ దంపతులు తమ విడాకుల గురించి మే 4న ప్రకటించాక అది ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. తమ 27 ఏళ్ల వైవాహిక జీవితానికి స్వస్తి చెప్పాలని నిర్ణయించినట్లు వారు ట్విటర్ ద్వారా వెల్లడించారు. గేట్స్ దంపతులకు ముగ్గురు సంతానం. జెన్నీఫర్ గేట్స్, రోరీ గేట్స్, ఫీబీ అడెల్ గేట్స్. అందరి కంటే చిన్నమ్మాయి ఫీబీ అడెల్ గేట్స్. బిల్గేట్స్ లక్షణాలు ఆయన చిన్న కూతురిలో పుష్కలంగా ఉన్నాయని, ఎప్పటికైనా ఆయనలాగే ఆమె కూడా స్వతహాగా పైకొస్తుందని కొందరు అంటుంటారు. మరి గేట్స్ దంపతుల ముద్దుల కూతురి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందామా?
తండ్రి తెలివి తేటల్ని ఫీబీ పుణికి పుచ్చుకుందని తెలిసినవారు అంటుంటారు. ఏప్రిల్ 14,2002లో వాషింగ్టన్లో ఆమె జన్మించింది. చిన్నప్పటి నుంచే ఎంతో చురుగ్గా, అందరితో కలిసి మెలిసి ఉండేది. తొలుత న్యూయార్క్లోని ప్రొఫెషనల్ చిల్డ్రన్ పాఠశాలలో చేరింది. ఆ తర్వాత లింకన్ సెంటర్లోని అమెరికన్ బ్యాలెట్ పాఠశాలలో ఆర్ట్స్ అధ్యయనం చేసింది. సంపన్నుడి కూతురైనప్పటికీ తన 14వ ఏట వరకు ఫీబీ స్మార్ట్ఫోన్కు దూరంగానే ఉంది. అయితే అందులో గేట్స్ పాత్ర కూడా ఉంది. పిల్లల జీవితాన్ని నాశనం చేయకుండా ఉండాలంటే కొంతకాలం వాళ్లని స్మార్ట్ఫోన్లకి దూరంగా ఉంచాలని గేట్స్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
ఫీబీ అప్పుడప్పుడు పొట్టిపొట్టి దుస్తుల్లో తళుక్కుమని మెరుస్తుంటుంది. కొన్నాళ్ల క్రితం బోటు షికారులో బికినీ వేసుకొని దిగిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. డిగ్రీ పట్టా ప్రదానోత్సవానికి నగలు పొదిగిన తెల్లటి పొడవాటి గౌను వేసుకొని వచ్చి అందర్నీ ఆశ్చర్యపరచింది. జీవితం హాయిగా సాగిపోతున్న తరుణంలో తల్లిదండ్రులు విడాకులు తీసుకోవడం.. వయస్సులో చిన్నదైన ఫీబీకి కాస్త ఇబ్బందికర అంశమే. అంతేకాకుండా తాను సంపాదించిన ఆస్తి తన సంతానానికి చెల్లబోదని బిల్గేట్స్ ఇప్పటికే ప్రకటించారు. ముగ్గురికీ తలో 10 మిలియన్ డాలర్లు మాత్రమే ఇస్తానని, మిగతా సొమ్మును సేవా కార్యక్రమాలకు వినియోగిస్తానని చెప్పిన విషయం తెలిసిందే. అయితే తన అక్కల పరిస్థితిని పక్కన పెడితే, ఫీబీ మాత్రం తన తండ్రిలా స్వతహాగా పైకొచ్చే అమ్మాయని కొందరు అంటుంటారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!