Venkaiah naidu: మోదీజీ..అపోహలు తొలగించండి: వెంకయ్యనాయుడు
ప్రధాని మోదీ అవలంబిస్తున్న విధానాలపై ఇతర పార్టీల నేతలకున్న అపోహలను తొలగించేందుకు ఆయన వివిధ పార్టీల నేతలతో తరచూ సమావేశమవ్వాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. మే 2019- మే 2020 మధ్య కాలంలో ప్రధాని ప్రసంగాలతో...
దిల్లీ: ప్రధాని మోదీ అవలంబిస్తున్న విధానాలపై ఇతర పార్టీల నేతలకున్న అపోహలను తొలగించేందుకు ఆయన వివిధ పార్టీల నేతలతో తరచూ సమావేశమవ్వాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. మే 2019- మే 2020 మధ్య కాలంలో ప్రధాని ప్రసంగాలతో కూడిన ‘సబ్కా సాత్ సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్’ పుస్తకాన్ని దిల్లీలో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... సాంకేతిక, ఆరోగ్య, విదేశాంగ తదితర రంగాల్లో మోదీ సాధించిన విజయాలను ఆయన ప్రశంసించారు. మోదీ పాలనలో ప్రపంచ దేశాల దృష్టిని భారత్ ఆకర్షించిందన్నారు.
‘‘భారత్ అభివృద్ధి గురించి ప్రపంచ వ్యాప్తంగా చర్చించుకుంటున్నారు. ఇంత తక్కువ వ్యవధిలో ఇది మామూలు విషయం కాదు. ప్రధాని మోదీ తీసుకున్న పాలనా పరమైన చర్యల వల్లే సాధ్యమైంది’’ అని వెంకయ్యనాయుడు అన్నారు. అభివృద్ధి పరంగా మోదీ ఎన్నో విజయాలు సాధించినప్పటికీ.. కొందరిలో అపోహలు ఉన్నాయని, క్రమంగా అవి తొలగిపోతాయని అన్నారు. దీనికోసం మోదీ కూడా తరచూ వివిధ పార్టీల నాయకులతో సమావేశమవ్వాలని కోరారు. రాజకీయ నాయకులు కూడా ఓపెన్ మైండ్తో ఆలోచిస్తూ..ప్రజల అభివృద్ధికి కాంక్షించాలని చెప్పారు. ‘‘ ఇతర పార్టీల నాయకులు ఓపెన్ మైండ్తో ఉండాలి.వారంతా ప్రత్యర్థులు మాత్రమే, శత్రువులు కాదని గుర్తించాలి. అన్ని పార్టీలు ఒకరినొకరు గౌరవించుకోవాలి.’’ అని వెంకయ్య హితవు పలికారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్, సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు: మధ్యప్రదేశ్ సీఎం
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!