Mehul Choksi: ఇంత కథ నడిచిందా..!
బలహీన చట్టాలను అవకాశంగా చేసుకొని.. ఆర్థిక లబ్ధి ఆశచూపి భారత్కు రాకుండా ఉండేందుకు మెహుల్ ఛోక్సీ శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు. తాజాగా ఛోక్సీని భారత్కు పంపకుండా అడ్డుకోవడం వెనుక....
ఎన్నికల నిధులు అందిస్తామని ప్రతిపక్షంపై ఒత్తిడి
చక్రం తిప్పిన చోక్సీ సోదరుడు
డొమినికాలో దొరికిన వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ భారత్కు రావడమే తరువాయి అన్న క్షణంలో ఒక్కసారిగా అంతా మారిపోయింది. నిమిషాల వ్యవధిలో తేల్చాల్సిన కేసును కూడా డొమినికన్ కోర్టు వాయిదా వేసింది. చోక్సీ కోసం వెళ్లిన ప్రైవేటు జెట్, భారత ఆధికారుల బృందం స్వదేశానికి తిరిగి వచ్చేసింది. ఈ క్రమంలో తెరవెనుక ఏదో జరిగిందన్న అనుమానాలకు తావిస్తుండగా.. ఆ మంత్రాంగాన్ని ఎవరు నడిపారన్నదానిపై అందరి దృష్టి నిలిచింది. చోక్సీ అప్పగింత జాప్యంలో డొమినికా ప్రతిపక్షాలు ప్రధాన పాత్ర పోషించాయి. వాటి ఒత్తిడికి ఏకంగా ఆ దేశ న్యాయవ్యవస్థే తలొగ్గింది. ఇదంతా చక్కబెట్టింది చోక్సీ సోదరుడు చింటూభాయ్ అని తెలుస్తోంది. అసలు ఈ ఆర్థిక నేరస్థులు ఇంతగా బరితెగించడానికి మన దేశంలోని బలహీన చట్టాలే కారణమని కొందరు న్యాయ కోవిదులు వ్యాఖ్యానిస్తున్నారు.
బలహీన చట్టాలను అవకాశంగా చేసుకొని.. ఆర్థిక లబ్ధి ఆశచూపి భారత్కు రాకుండా ఉండేందుకు మెహుల్ చోక్సీ శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు. తాజాగా చోక్సీని భారత్కు పంపకుండా అడ్డుకోవడం వెనుక ఆ దేశ ప్రతిపక్షాల పాత్ర ఉందన్న వార్తలు కలకలం సృష్టిస్తున్నాయి. చోక్సీ తరఫు న్యాయవాదుల బృందం డొమినికా ప్రతిపక్ష నేతలతో సమావేశమై.. వారి ద్వారా న్యాయవ్యవస్థపై ఒత్తిడి తెచ్చి అతడిని వెంటనే భారత్కు తరలించే అవకాశాన్ని అడ్డుకుంది. చోక్సీ అంటిగ్వా నుంచి అక్రమంగా డొమినికాలో ప్రవేశించలేదని.. అతడిని అపహరించారన్న వాదనలతో ప్రతిపక్ష నేతలను న్యాయవాదులు ఒప్పించారని స్థానిక మీడియా వెల్లడించింది. ఈ కేసును వెంటనే తేల్చే అవకాశం ఉన్నా.. డొమినికన్ న్యాయస్థానం విచారణను వాయిదావేసింది. వెంటనే తేలాల్సిన కేసు వాయిదా పడటంతో ఇది మరింత కాలం కొనసాగే అవకాశం ఉందని న్యాయ నిపుణులు వెల్లడిస్తున్నారు.
చింటూభాయ్ హామీతో న్యాయవ్యవస్థపై ఒత్తిడి
చోక్సీ తరఫున వాదిస్తున్న లండన్కు చెందిన నలుగురు న్యాయవాదుల బృందం.. చోక్సీ సోదరుడు చేతన్ చింటూభాయ్ చోక్సీ సాయంతో కథ నడిపించినట్లు తెలుస్తోంది. మెహుల్ చోక్సీని కిడ్నాప్ చేశారన్న కథను ప్రారంభించిన చింటూభాయ్.. డొమినికన్ ప్రతిపక్ష నేతకు ఎన్నికల నిధులు ఇస్తానని హామీ కూడా ఇచ్చినట్లు స్థానిక మీడియా సహా మెహుల్ బంధువు ఒకరు తెలిపారు. డొమినికా విపక్ష నేత లెనాక్స్ లింటన్ను చింటూభాయ్ కలిసి తన సోదరుడిని భారత్కు అప్పగించకుండా డొమినికా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరినట్లు తెలిసింది. ఈ పని చేస్తే వచ్చే ఎన్నికల ఖర్చుకు నిధులిస్తామని చెప్పినట్లు మీడియా కథనాలు వెల్లడించాయి. చింటూభాయ్ ఆర్థిక హామీతో ప్రతిపక్ష నేత న్యాయవ్యవస్థపై ఒత్తిడి తెచ్చి చోక్సీని భారత్కు పంపకుండా అడ్డుకున్నాడని తెలుస్తోంది. అందుకే ఈ వజ్రాల వ్యాపారికి వ్యతిరేకంగా అనేక బలమైన ఆధారాలు ఉన్నప్పటికీ డొమినికన్ కోర్టు అతడిని భారత్ పంపకుండా కేసును వాయిదా వేసింది.
ఇలా అయితే చోక్సీని తీసుకురావడం కష్టమే
చోక్సీని భారత్కు తీసుకురావడం కష్టసాధ్యమని న్యాయ నిపుణులు వెల్లడిస్తున్నారు. స్వార్థపూరిత ఆర్థిక లబ్ధి, బలహీన చట్టాలు ఆర్థిక నేరగాళ్లకి వరంగా మారుతున్నాయని అభిప్రాయపడుతున్నారు. చోక్సీ వంటి ఆర్థిక నేరగాళ్లు మన చట్టాలను అపహాస్యం చేస్తున్నారని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ పేర్కొన్నారు. మెహుల్ చోక్సీ, విజయ్ మాల్యా, లలిత్ మోదీ, నీరవ్ మోదీ లాంటివారిని భారత చట్టాలతో తిరిగి భారత్కు తీసుకురావడం కష్టమని.. ఎందుకంటే అవి చాలా బలహీనంగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. ఈ ఆర్థిక నేరస్థులు ఫ్రాన్స్, సింగపూర్, అమెరికా, జర్మనీ, చైనా వంటి దేశాల్లో జన్మించి ఉంటే వారికి మరణశిక్ష విధించేవారని.. ఆస్తి మొత్తాన్ని స్వాధీనం చేసుకునేవారని పేర్కొన్నారు.
చట్టాల సంస్కరణ అవసరం..
చట్టాలను సంస్కరించాల్సిన అవసరం ఉందన్న అశ్విని ఉపాధ్యాయ.. ఇప్పటివరకు ఏ ఒక్క ఆర్థిక నేరగాడి ఆస్తిని వందశాతం స్వాధీనం చేసుకోలేదని, ఒక్కరికి కూడా జీవిత ఖైదు లాంటి కఠిన శిక్ష పడలేదని గుర్తుచేశారు. సంస్కరణలు ప్రారంభించకపోతే చోక్సీని తిరిగి తీసుకొచ్చినా.. అతడు బలహీన చట్టాలను ఆశ్రయిస్తాడని తెలిపారు. భారత్ నుంచి పారిపోయి 2018 జనవరిలో ఆంటిగ్వా పౌరసత్వం పొందిన చోక్సీపై ఇప్పటికే రెడ్ కార్నర్ నోటీసు అమల్లో ఉంది. అవాస్తవాలతో చోక్సీ ఆంటిగ్వా పౌరసత్వం పొందాడని.. అతడి పౌరసత్వాన్ని రద్దు చేయాలని ఆంటిగ్వా ప్రధాని గాస్టన్ బ్రౌన్ కోరుతున్నారు. చోక్సీని తిరిగి భారత్కు పంపాలని ఆయన ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
క్రికెట్ అభిమానులు జాగ్రత్తగా ఉండండి..! చెన్నై ఆటగాడు ధోనీ (MS Dhoni) పేరుతో ఓ ఇన్స్టా మెసేజ్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. -
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
పట్నాలోని ఓ హోటల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఆరుగురు మరణించారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. -
విద్యార్థుల చిరునవ్వుల కోసం ఓ టీచర్ ఫన్నీ యాక్ట్.. వీడియో వైరల్
Students smile: విద్యార్థులంటే పుస్తకాలు ముందేసుకొని, టీచర్లు చెప్పే పాఠాలు వినడమే గుర్తుకువస్తుంది. కానీ ఆన్లైన్లో వైరల్గా మారిన ఓ వీడియో మాత్రం అందుకు భిన్నంగా ఆకట్టుకుంటోంది. -
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
Arunachal Pradesh: హైవేపై కొండచరియలు విరిగిపడటంతో చైనా సరిహద్దుల్లోని ఓ జిల్లాకు మిగిలిన ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. -
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ అధికారి ఒకరు రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గహ్లోత్ (Ashok Gehlot)పై తీవ్ర ఆరోపణలు చేశారు. -
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
Tamannaah: నిబంధనలకు వ్యతిరేకంగా ఐపీఎల్ను ప్రసారం చేసిన కేసులో నటి తమన్నాకు మహారాష్ట్ర సైబర్ పోలీసులు సమన్లు జారీ చేశారు. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM