Helicopter Ride: టాపర్లకు హెలికాప్టర్ రైడ్.. మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి
విద్యార్థులకు ఇచ్చిన హామీని ఛత్తీస్గఢ్ సీఎం భూపేశ్ బఘేల్ నిలబెట్టుకున్నారు. 10, 12వ తరగతి టాపర్లను ప్రభుత్వం హెలికాప్టర్లో రైడ్కు తీసుకెళ్లింది.
రాయ్పుర్: చదువుల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు హెలికాప్టర్లో ప్రయాణించే అవకాశం కల్పించింది ఛత్తీస్గఢ్ ప్రభుత్వం. 10, 12వ తరగతుల్లో టాపర్లుగా నిలిచిన వారిని గగనవిహారం చేయించింది. దీంతో విద్యార్థుల ఆనందానికి అవధుల్లేకుండాపోయాయి. తొలిసారి గాల్లో ప్రయాణించామని, చాలా సంతోషంగా ఉందంటూ హర్షం వ్యక్తం చేశారు.
10, 12వ తరగతి పరీక్షల్లో రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయిల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 10మంది విద్యార్థులను హెలికాప్టర్లో తిప్పుతామని గత మే నెలలో సీఎం భూపేశ్ బఘేల్ హామీ ఇచ్చారు. విద్యార్థుల్ని మరింత ప్రోత్సహించేందుకు ఈ ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. ‘విద్యార్థులను మరింతలా ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాం. గగన విహారం చేయాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. వారి లక్ష్యాలు మరింత ఉన్నత స్థాయిలో ఉండేందుకు ఈ రైడ్ ఉపయోగపడుతుందని భావిస్తున్నాం’ అని బఘేల్ గతంలో పేర్కొన్నారు.
ఈ రైడ్ సందర్భంగా బఘేల్ తాజాగా మరోసారి స్పందించారు. ‘చూడండి పిల్లలు ఎంత ఆనందంగా ఉన్నారో. 10, 12వ తరగతి పరీక్షల్లో ఉత్తమంగా రాణించిన వారిని హెలికాప్టర్లో తిప్పుతామని ఇచ్చిన హామీని నెరవేరుస్తున్నాం. 125 మంది విద్యార్థులు ఈ హెలికాప్టర్ రైడ్ను ఆస్వాదిస్తారు’ అంటూ సీఎం ట్వీట్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్