MHA: మణిపుర్ హింసాత్మక ఘటనలు..! శాంతి స్థాపనకు కమిటీ ఏర్పాటు
అల్లర్లతో అట్టుడుకుతోన్న మణిపుర్లో శాంతి స్థాపన దిశగా కేంద్రం ఓ కమిటీని నియమించింది. జాతుల మధ్య శాంతి స్థాపన ప్రక్రియను సులభతరం చేసేందుకు, వారి మధ్య చర్చల నిర్వహణకు ఈ కమిటీ చర్యలు తీసుకుంటుందని తెలిపింది.
ఇంఫాల్: హింసాత్మక ఘటనలతో మణిపుర్ (Manipur) అట్టుడికిపోతోన్న విషయం తెలిసిందే. శుక్రవారం సైతం తూటా గాయాలతో ముగ్గురు పౌరులు మృతి చెందారు. మరోవైపు.. రాష్ట్రంలో శాంతి స్థాపన దిశగా కేంద్రం చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే కేంద్ర హోంశాఖ (MHA) తాజాగా ఓ కమిటీ (Manipur Peace Committee)ని నియమించింది. మణిపుర్ గవర్నర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ శాంతి స్థాపన కమిటీలో ముఖ్యమంత్రి, కొందరు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు, ప్రజాసంఘాల నేతలు సభ్యులుగా ఉంటారని పేర్కొంది. జాతుల మధ్య శాంతి స్థాపన ప్రక్రియను సులభతరం చేసేందుకు, వారి మధ్య చర్చల నిర్వహణకు ఈ కమిటీ చొరవ తీసుకుంటుందని ఓ ప్రకటనలో తెలిపింది.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల మణిపుర్లో పర్యటించి, పరిస్థితులను సమీక్షించారు. ఈ సందర్భంగా శాంతి కమిటీని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఈ మేరకు శనివారం ప్రకటన జారీ అయ్యింది. పౌరుల మధ్య సామాజిక ఐక్యత, పరస్పర అవగాహనను శాంతి కమిటీ బలోపేతం చేస్తుందని హోంశాఖ తెలిపింది. జాతుల మధ్య సంబంధాలను మెరుగుపరుస్తుందని పేర్కొంది. ఇదిలా ఉండగా.. మణిపుర్లో మే 3 నుంచి దాడులు, ప్రతిదాడులు జరుగుతున్నాయి. హింసాత్మక ఘటనల్లో ఇప్పటివరకు సుమారు 100 మంది చనిపోగా, 300 మందికిపైగా గాయపడ్డారు. ఈ ఘటనలు, దోపిడీలు, ఆస్తుల విధ్వంసం వెనుకున్న కుట్రను బహిర్గతం చేసేందుకు సీబీఐ ఇప్పటికే 10 మంది సభ్యులతో కూడిన సిట్ను ఏర్పాటు చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ వద్దే చోరీ.. తర్వాత సీన్ రివర్స్!
ఒంటరిగా ఉన్న వ్యక్తిని అదును చూసి ఇద్దరు దుండగులు దొంగతనానికి పాల్పడ్డారు. ఆయన ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ కావడంతో వారి సీన్ రివర్స్ అయింది. -
Electoral Bonds: ఎన్నికల బాండ్ల నంబర్లూ చెప్పాల్సిందే.. ఎస్బీఐకి సుప్రీం డెడ్లైన్
Electoral Bonds: ఎన్నికల బాండ్ల నంబర్లను ఈసీకి ఇవ్వకపోవడంతో ఎస్బీఐపై సుప్రీంకోర్టు మరోసారి మండిపడింది. మార్చి 21లోగా అన్ని వివరాలు ఇవ్వాల్సిందేనని డెడ్లైన్ విధించింది. -
Electoral Bonds: నా విరాళాలు వారికిచ్చాను.. ఎన్నికల బాండ్లపై కిరణ్ మజుందార్ షా
Electoral Bonds: వ్యక్తిగత హోదాలో ఎన్నికల బాండ్ల ద్వారా తాను కొన్ని పార్టీలకు నామమాత్రపు విరాళాలిచ్చినట్లు బయోకాన్ ఛైర్పర్సన్ కిరణ్ మజుందార్ షా వెల్లడించారు. -
S Jaishankar: ‘స్నేహమంటే అదే కదా’: నేవీ ఆపరేషన్పై జై శంకర్ ఆసక్తికర రిప్లై
హైజాక్ అయిన నౌక నుంచి 17 మంది బందీలను మన నౌకాదళం విడిపించింది. ఇందుకు బల్గేరియా దేశం ధన్యవాదాలు తెలిపింది. -
Arvind Kejriwal: దిల్లీ జల్బోర్డు కేసులోనూ.. ఈడీ సమన్లకు కేజ్రీవాల్ డుమ్మా
Arvind Kejriwal: దిల్లీ జల్బోర్డుకు సంబంధించిన కేసులోనూ ఈడీ విచారణకు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ డుమ్మా కొట్టారు.ఆ సమన్లు అక్రమమని ఆరోపించారు. -
Russia: మమ్మల్ని విడిపించండి ప్లీజ్: రష్యా నుంచి భారతీయుల మరో వీడియో
Indians Stuck In Russia: రష్యా సైన్యంలో చిక్కుకుపోయిన భారతీయులు తమను కాపాడాలంటూ మరోసారి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వీడియో విడుదల చేశారు. -
Rahul Gandhi: ‘ఆయన మా అమ్మకు ఫోన్ చేసి కన్నీటిపర్యంతమయ్యారు’: రాహుల్ గాంధీ వ్యాఖ్యలు
ఇటీవల కాంగ్రెస్(Congress)ను వీడిన సీనియర్ నేతలను ఉద్దేశించి.. ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఎన్డీయే కూటమిపై విమర్శలు చేశారు. -
వారికి అమెరికా పౌరసత్వం ఇస్తుందా?: హరీశ్ సాల్వే
భారత్ పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అమలు చేయడంపై ఇటీవల అమెరికా ఆందోళన వ్యక్తం చేయడాన్ని సీనియర్ న్యాయవాది, మాజీ సోలిసిటర్ జనరల్ హరీశ్ సాల్వే తప్పుపట్టారు. ప్ -
కోడ్ మీరితే కొరడా!
భారతదేశంలో ఎన్నికలు ఓ మహాసంగ్రామం! గెలుపే లక్ష్యంగా పార్టీలు ఎత్తుగడలు, వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తుంటాయి. -
బెట్టింగ్ యాప్ కుంభకోణం.. భూపేశ్ బఘేల్పై కేసు
మహదేవ్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్పై రాష్ట్ర ఆర్థికనేరాల విభాగం (ఈవోడబ్ల్యూ) కేసు నమోదు చేసింది. -
ఆ రూ.4 వేల కోట్ల వివరాలూ వెల్లడించాలి
ఎన్నికల బాండ్లపై మరో పిటిషన్ సుప్రీంకోర్టులో దాఖలైంది. 2018 మార్చి 1 నుంచి 2019 ఏప్రిల్ 11 వరకు అమ్మిన ఎలక్టోరల్ బాండ్ల వివరాలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) వెల్లడించాలంటూ అందులో పిటిషనర్ సర్వోన్నత న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. -
సీఏఏ నిబంధనల అమలుపై స్టే ఇవ్వండి
పౌరసత్వ (సవరణ) నిబంధనలు-2024 అమలుపై స్టే ఇవ్వాలని సుప్రీంకోర్టులో కేరళ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. -
మగబిడ్డకు జన్మనిచ్చిన మూసేవాలా తల్లి
దివంగత పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా తల్లి చరణ్ కౌర్ మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని సిద్ధూ తండ్రి బాల్కౌర్ సింగ్ సామాజిక మాధ్యమాల ద్వారా స్వయంగా వెల్లడించారు. -
దిల్లీ జల్బోర్డు కేసులో కేజ్రీవాల్కు ఈడీ సమన్లు
దేశ రాజధానిలోని నీటి మండలి (జల్బోర్డు)లో అవకతవకలకు సంబంధించి.. నగదు అక్రమ చలామణి నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కేసులో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీచేసింది. -
అయిదేళ్ల రోడ్మ్యాప్ సిద్ధం చేయండి!
లోక్సభ ఎన్నికల్లో మళ్లీ ఘనవిజయం సాధించి వరుసగా మూడోసారి పగ్గాలు చేపడతామన్న భరోసాతో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ఎన్నికల అనంతరం తొలి వంద రోజులకు, ఆ తర్వాత రాబోయే అయిదేళ్ల అభివృద్ధికి కొత్త ప్రభుత్వ రోడ్మ్యాప్ రూపొందించాలని తన మంత్రివర్గ సహచరులను కోరారు. -
హాస్టల్లో నమాజ్ చేస్తున్నారని విదేశీ విద్యార్థులపై దాడి
గుజరాత్ విశ్వవిద్యాలయంలో విదేశీ విద్యార్థులపై మూక దాడి జరిగింది. వసతి గృహంలో నమాజ్ చేస్తున్నారన్న కారణంతో లోపలకి ప్రవేశించిన దుండగులు, విద్యార్థులపై హింసకు తెగబడ్డారు. -
18 మంది పాక్ హిందూ శరణార్థులకు భారత పౌరసత్వం
గుజరాత్లోని అహ్మదాబాద్లో నివాసముంటున్న పాకిస్థాన్కు చెందిన 18 మంది హిందూ శరణార్థులకు భారత పౌరసత్వం లభించింది. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి హర్ష్ సంఘవి వారికి పౌరసత్వం ప్రదానం చేశారు. -
నీరే నిజమైన సంపద
భారత్ సిలికాన్ వ్యాలీగా పేరొందిన బెంగళూరులో నీటి సంక్షోభం కొనసాగుతోంది. వేసవి పూర్తి స్థాయిలో రాక ముందు నుంచే అక్కడి ప్రజలు నీటి కొరతతో ఇబ్బందులు పడుతున్నారు. -
3 దశాబ్దాల కిందటే ఓటర్లకు ఫొటో గుర్తింపు కార్డులు
ఓటర్లకు ఫొటో గుర్తింపు కార్డులపై 1957లోనే ఆలోచన చేసినా 3 దశాబ్దాల కిందటే 1994లో తొలిసారిగా దేశవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చాయి. -
మే 15-31 మధ్యే యూజీ-క్యూయెట్
గతంలో ప్రకటించినట్లుగానే యూజీ- కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (క్యూయెట్)ను మే 15 నుంచి 31 మధ్య నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) స్పష్టం చేసింది. -
సంక్షిప్త వార్తలు (8)
సోమాలియా సముద్రపు దొంగల చేతిలో హైజాక్కు గురైన వాణిజ్య నౌక ‘ఎంవీ రుయెన్’ను భారత నౌకాదళం ఓ సాహసోపేత ఆపరేషన్తో విడిపించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ వద్దే చోరీ.. తర్వాత సీన్ రివర్స్!
-
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
AP Congress: ఈ నెల 25న కాంగ్రెస్ జాబితా.. కడప ఎంపీ అభ్యర్థిగా షర్మిల..?
-
Bill Gates: ఆ స్థాయిని నేను ఎప్పటికీ అందుకోలేను: బిల్ గేట్స్
-
PM Modi: భారాస తెలంగాణను దోచుకుంది.. కాంగ్రెస్ ఏటీఎంగా మార్చుకుంది: జగిత్యాల సభలో మోదీ
-
WPL 2024 - RCB: డబ్ల్యూపీఎల్ విజేతగా ఆర్సీబీ.. పురుషుల జట్టుపై నెట్టింట మీమ్స్!