18 నెలలు.. 3.17 లక్షల సైబర్‌ నేరాలు!

దేశంలో సైబర్‌ మోసాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. గడిచిన 18 నెలల కాలంలోనే దేశ వ్యాప్తంగా 3,17,439 సైబర్‌ నేర ఘటనలు చోటుచేసుకున్నట్టు.......

Published : 09 Mar 2021 20:10 IST

లోక్‌సభలో కేంద్రం ప్రకటన

దిల్లీ: దేశంలో సైబర్‌ మోసాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. గడిచిన 18 నెలల కాలంలోనే దేశవ్యాప్తంగా 3,17,439 సైబర్‌ నేరఘటనలు చోటుచేసుకున్నట్టు కేంద్రం వెల్లడించింది. 5771 ఎఫ్‌ఐఆర్‌లు నమోదైనట్టు తెలిపింది. వీటిలో మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో సైబర్‌ నేర ఘటనలు గణనీయంగా ఉన్నట్టు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌ రెడ్డి తెలిపారు. మంగళవారం లోక్‌సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఆయన ఈ వివరాలను వెల్లడించారు. దేశంలోని అన్ని రకాల సైబర్‌ నేరఘటనలపై ఆన్‌లైన్‌లో రిపోర్టింగ్ చేసేలా పౌరులకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ 2019 ఆగస్టు 30న  నేషనల్‌ సైబర్‌ క్రైం రిపోర్టింగ్‌ పోర్టల్‌ను అమలులోకి తీసుకొచ్చిందన్నారు. ముఖ్యంగా, చిన్నారులు, మహిళలపై జరుగుతున్న నేరాలపై కేంద్రం దృష్టి కేంద్రీకరించినట్టు పేర్కొన్నారు. మహారాష్ట్రలో 50,806 సైబర్‌ నేరఘటనలు , 534 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు కాగా.. కర్ణాటకలో 21,562 ఘటనలు, 87 ఎఫ్‌ఐఆర్‌లు నమోదైనట్టు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని