నేనున్నాననీ.. నీకేం కాదని
ప్రపంచ దేశాలన్నీ కరోనా వైరస్ కట్టడి, టీకాల గురించి ఆలోచిస్తుంటే జపాన్ మాత్రం ఆ మహమ్మారి కారణంగా తీవ్రమైన మరో
ఒంటరితనం నివారణకు జపాన్లో మంత్రిత్వశాఖ
టోక్యో: ప్రపంచ దేశాలన్నీ కరోనా వైరస్ కట్టడి, టీకాల గురించి ఆలోచిస్తుంటే జపాన్ మాత్రం ఆ మహమ్మారి కారణంగా తీవ్రమైన మరో సమస్య గురించి గాబరా పడుతోంది. దీని నివారణ కోసం ఏకంగా ఓ మంత్రిత్వశాఖనే ఏర్పాటు చేసింది! అదే ‘ఒంటరితనం’ మంత్రిత్వ శాఖ! తెత్సుషి సకామోటో ఆ కొత్త శాఖకు మంత్రి! ఇలా హడావుడిగా ఒంటరితనం కోసం మంత్రిత్వ శాఖను, దానికో మంత్రిని ఏర్పాటు చేయడానికి కారణం.. జపాన్లో ఆత్మహత్యలు విపరీతంగా పెరిగిపోవడం!
2020లో 21వేల ఆత్మహత్యలు..
గత దశాబ్దంలో ఎన్నడూ లేనంతగా జపాన్లో కొన్ని నెలలుగా ఆత్మహత్యలు పెరిగిపోయాయి. 2020లో దాదాపు 21వేల మందికిపైగా ప్రజలు ఆత్మహత్య చేసుకున్నారు. దేశంలో పెరిగిపోతున్న ఒంటరితనం సంస్కృతి సహా ఇందుకు అనేక కారణాలు ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు.
కుడోకుషి..
జపాన్ దేశ జనాభాలో 65 ఏళ్లు దాటినవారు 20శాతానికిపైగా ఉన్నట్లు అంచనా. ఈ విభాగంలో ఇంతమంది జనాభాగల దేశం జపానే! వీరిలో చాలామంది ఒంటరిగానే జీవిస్తుంటారు. వయసు కారణంగా చాలామందితో కలిసి ఉండలేక పోవడం ఒకెత్తైతే, ఎవరూ లేరనే భావనతో మరికొంతమంది కుంగిపోతుంటారు. వీరిలో చాలామంది ఇళ్లలో ఒంటరిగా ఉంటారు. వారు చనిపోయిన విషయం కూడా కొద్దిరోజుల వరకు తెలియని దుస్థితి. దీన్ని జపాన్ భాషలో ‘కుడోకుషి’ (ఒంటరి మరణం) అని పిలుస్తారు.
హికికొమోరి...
జపాన్లో ఒంటరితనం ఓ సంస్కృతిగా విస్తరిస్తోంది. ఒంటరితనానికి, ఏకాంతానికి మధ్య గీతను చెరిపేసి, రెండూ ఒకటే అన్నట్లుగా జీవిస్తున్నవారి సంఖ్య బోలెడంత! దాదాపు 10 లక్షల మంది బయటి ప్రపంచానికి పూర్తిగా దూరంగా, ఎవరితో కలవకుండా, గదిలో నుంచి బయటకు రాకుండా ఒంటరిగా బతుకుతున్నారు. వీరిని జపాన్ పరిభాషలో ‘హికికొమోరి’ అంటారు. నిరుద్యోగం, సరైన చదువు అబ్బకపోవడం, ఇతరత్రా సామాజిక కారణాలు హికికొమోరి సంస్కృతిని పెంచుతున్నాయి. దీనికి తోడు ఈ సంస్కృతిని జపాన్ ప్రత్యేకతగా గొప్పగా భావించి, ప్రాచుర్యం కల్పించేవారి సంఖ్యా పెరుగుతోంది. ఇలా ఈ సంస్కృతిలో పడేవారిని గుర్తించి, ఒంటరితనం నుంచి బయటకు తీసుకువచ్చి, మానసిక వైద్యం అందించడం ఇంకా కష్టమవుతోంది.
కరోషి
ప్రపంచంలో ఎక్కడా లేనంతగా ఎక్కువ పనిగంటలు జపాన్లో ఉన్నాయి. దీంతో ఆ దేశ కార్మికులు, ఉద్యోగులు.. స్నేహితులతో, బంధువులతో, కుటుంబంతో సరైన రీతిలో గడపడానికి వీలుచిక్కని పరిస్థితి. జపాన్ కార్మిక నిబంధనల ప్రకారం రోజుకు 8 గంటలు, వారానికి 40 గంటలు పనిచేయాలి. 2016లో చేసిన ఓ అధ్యయనం ప్రకారం చాలా కంపెనీలు నెలలో చేయాల్సిన దానికంటే 80 గంటలు అదనంగా పనిచేయించుకుని డబ్బులు కూడా చెల్లించడం లేదని తేలింది. ఇలా మితిమీరిన పనిభారంతో కూడా చాలామంది చనిపోతున్నారు. దీన్ని జపాన్ భాషలో ‘కరోషి’ అంటుంటారు. జీవితంలో ఉల్లాసాలకు దూరమై చాలామంది పనిభారంతో కుంగిపోతున్నారు. ఎత్తైన భవనాల నుంచి దూకి చనిపోవడం చాలా సర్వసాధారణం అక్కడ! అందుకే చాలా చోట్ల ఫుట్పాత్లపై నడుస్తూ వెళుతుంటే ‘మైండ్ ది స్కై’ (కాస్త పైకి చూస్తూ నడవండి. ఎవరైనా పై నుంచి దూకుతున్నారేమో జాగ్రత్త) అని అర్థం వచ్చేలా బోర్డులు ఏర్పాటుచేస్తున్నారు.
పులిమీద పుట్రలా..
జపాన్ సమాజంలో పెరిగిపోతున్న ఈ హికికొమోరికి కరోనా మహమ్మారి తోడవడంతో ఆత్మహత్యల సంఖ్య పెరిగిపోయింది. ఇలా ఆత్మహత్యలు చేసుకుంటున్నవారిలో మహిళలే ఎక్కువ ఉండడం గమనార్హం. గత సంవత్సరంతో పోలిస్తే మహిళల ఆత్మహత్యలు ఈ సారి 15శాతం మేర పెరిగాయని ప్రభుత్వం గుర్తించింది. అందుకే ఈ సమస్యలన్నింటినీ గుర్తించి.. వాటికి పరిష్కారాలను కనుగొనేందుకు జపాన్ ప్రధానమంత్రి ఒంటరితనం మంత్రిత్వ శాఖను ఏర్పాటుచేశారు. ఆత్మహత్యలను అరికట్టే ప్రణాళిక రూపొందించే బాధ్యత ఆ శాఖ మంత్రి తెత్సుషి సకామోటోకు అప్పగించారు.- ఈనాడు ప్రత్యేక విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
Tamannaah: నిబంధనలకు వ్యతిరేకంగా ఐపీఎల్ను ప్రసారం చేసిన కేసులో నటి తమన్నాకు మహారాష్ట్ర సైబర్ పోలీసులు సమన్లు జారీ చేశారు. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
‘యానిమల్’ టూ ‘రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
-
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ
-
హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
-
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
-
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
-
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ