Misleading Rahul video : న్యూస్ యాంకర్ అరెస్టుపై రెండు రాష్ట్రాల పోలీసుల వార్
కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై నకిలీ వీడియోకు సంబంధించి కేసులో ఓ న్యూస్ యాంకర్ ‘అరెస్టు’.. రెండు రాష్ట్రాల పోలీసుల మధ్య వాగ్వాదానికి దారితీసింది. నకిలీ వీడియోల వ్యవహారంలో ఓ ప్రముఖ
రాయ్పుర్: కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై నకిలీ వీడియోకు సంబంధించిన కేసులో ఓ న్యూస్ యాంకర్ ‘అరెస్టు’.. రెండు రాష్ట్రాల పోలీసుల మధ్య వాగ్వాదానికి దారితీసింది. నకిలీ వీడియోల వ్యవహారంలో ఓ ప్రముఖ మీడియా సంస్థలో పనిచేస్తోన్న యాంకర్ రోహిత్ రంజన్పై ఛత్తీస్గఢ్లో కేసు నమోదైంది. దీంతో అతడిని అరెస్టు చేసేందుకు రాయ్పుర్ పోలీసులు ఉత్తరప్రదేశ్లోని ఘాజియాబాద్ వెళ్లారు. అయితే ఈ అరెస్టును అడ్డుకున్న యూపీ పోలీసులు.. రంజన్ను తమతో పాటు తీసుకెళ్లడం గమనార్హం. అసలేం జరిగిందంటే..
కేరళలోని వయనాడ్లో తన కార్యాలయంపై దాడి చేసినవారిని చిన్నపిల్లలుగా పేర్కొంటూ, వారికి వ్యతిరేకంగా తనకు ఎలాంటి దురుద్దేశం లేదని రాహుల్గాంధీ ఇటీవల వీడియో సందేశమిచ్చారు. అయితే ఈ వీడియోను వక్రీకరించి.. రాజస్థాన్లోని ఉదయ్పుర్కు చెందిన టైలర్ కన్హయ్యలాల్ హంతకులను ఉద్దేశించి రాహుల్ ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా ఓ టీవీ ఛానల్ ప్రసారం చేసిందని కాంగ్రెస్ ఆరోపించింది. ఈ క్రమంలోనే ఆ టీవీ ఛానల్ యాజమాన్యం, యాంకర్ రోహిత్ రంజన్పై కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకరు రాయ్పుర్లో కేసు పెట్టారు.
దీంతో రంజన్ను అరెస్టు చేసేందుకు ఈ ఉదయం రాయ్పుర్ పోలీసులు ఘాజియాబాద్ చేరుకున్నారు. రంజన్ నివాసానికి వెళ్లి అతడిని ప్రశ్నించారు. అనంతరం అరెస్టు చేసేందుకు సిద్ధమవుతుండగా.. ఘాజియాబాద్ పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఈ క్రమంలో రెండు రాష్ట్రాల పోలీసులు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. రాయ్పుర్ పోలీసులు అరెస్టు వారెంట్ చూపిస్తున్నప్పటికీ.. యూపీ పోలీసులు బలవంతంగా రంజన్ను తీసుకొని వెళ్లిపోయారు. దీంతో అతడి ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ప్రస్తుతం అతడు ఓ రహస్య ప్రాంతంలో యూపీ పోలీసుల కస్టడీలో ఉన్నట్లు రాయ్పుర్ ఎస్పీ వెల్లడించారు.
అంతకుముందు.. ఈ అరెస్టు వ్యవహారంపై రంజన్ ఓ ట్వీట్ చేశారు. ‘‘స్థానిక పోలీసులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే ఛత్తీస్గఢ్ పోలీసులు నన్ను అరెస్టు చేసేందుకు మా ఇంటికి వచ్చారు. ఇది చట్టపరంగా సరైందేనా?’’ అని ప్రశ్నించారు. అయితే ఈ ట్వీట్కు రాయ్పుర్ పోలీసులు బదులిచ్చారు. ‘‘స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలంటూ ఎలాంటి నిబంధనా లేదు. అయినప్పటికీ మేం సమాచారం ఇచ్చాం. మీపై ఉన్న అరెస్టు వారెంట్ను కూడా మీకు చూపించాం. మీరు దర్యాప్తునకు సహకరించాలి’’ అని రాయ్పుర్ పోలీసులు స్పష్టం చేశారు.
కాగా.. రాహుల్పై నకిలీ వీడియో వ్యవహారానికి సంబంధించి ఛత్తీస్గఢ్లో ముగ్గురు భాజపా ఎంపీలపై కేసు నమోదైంది. రాహుల్ వీడియోను భాజపా నేతలు సామాజిక మాధ్యమంలో తప్పుడు ప్రచారానికి వినియోగించారని, తద్వారా దేశంలో మత విద్వేషాలకు పాల్పడ్డారని కాంగ్రెస్ ఆరోపించింది. కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ రాజ్యవర్ధన్సింగ్ రాథోడ్ సహా ఎంపీలు సుబ్రత్ పాఠక్, భోలాసింగ్లపై ఛత్తీస్గడ్ సహా దిల్లీ, ఝార్ఖండ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ కేసులు పెట్టింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
నిప్పుల గుండంలా తెలంగాణ.. ఆరు జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువే..
-
నటుడు మన్సూర్ అలీఖాన్కు అస్వస్థత.. పండ్లరసంలో విషం కలిపారని ఆరోపణ
-
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లో పగులుతున్న అద్దాలు.. అంతుచిక్కని అనుమానాలు
-
‘మా మావయ్యను నరమాంస భక్షకులు తినేశారు’
-
సీఎం తెచ్చిన నరకయాతన.. రెండున్నర గంటలపాటు కదలని బస్సులు
-
గులకరాయికి.. రాజకీయ రంగు!