Pakistan: భారత క్షిపణిని పాక్ ట్రాక్ చేసిందా..?
భారత్లోని వాయుసేన స్థావరం నుంచి బుధవారం పొరబాటున ప్రయోగించిన క్షిపణిని పాక్ ఏ దశలోను గుర్తించలేకపోయిందని పరిణామాలు వెల్లడిస్తున్నాయి.
ఇంటర్నెట్డెస్క్: భారత్లోని వాయుసేన స్థావరం నుంచి బుధవారం పొరపాటున ప్రయోగించిన క్షిపణిని పాక్ ఏ దశలోనూ గుర్తించలేకపోయిందని పరిణామాలు వెల్లడిస్తున్నాయి. ఐఏఎఫ్కు చెందిన ఓ అనుబంధ రహస్య బేస్లో దీనికి సాధారణ తనిఖీలు నిర్వహిస్తుండగా.. పొరపాటున ఫైర్ అయింది. ఈ విషయాన్ని ఓ ఆంగ్ల వార్తా పత్రిక వద్ద రక్షణ శాఖ వర్గాలు ధ్రువీకరించాయి. హరియాణాలోని సిర్సా నుంచి రాజస్థాన్లోని మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజి వైపు ప్రయోగించినట్లు పాక్ చెబుతున్న వాదనకు.. భారత రక్షణ శాఖ వాదన పూర్తి భిన్నంగా ఉంది.
రక్షణ శాఖ వర్గాల కథనం ప్రకారం ‘‘క్షిపణి పరీక్షకు ముందు ఎలాంటి నోటామ్ (నోటిస్ టు ఎయిర్మెన్) జారీ చేయలేదు. ఇది జారీ చేయకుండా ఎటువంటి పరీక్షలు నిర్వహించరు. ఎందుకంటే క్షిపణి గాల్లోకి లేచాక దాని మార్గంలోకి విమానాలు వస్తే ప్రయాణికుల ప్రాణాలు ప్రమాదంలో పడతాయి. అయినా, భారత్ క్షిపణులకు సంబంధించిన పరీక్షలను తూర్పు తీరంలో నిర్వహిస్తుంది. అంతేకాదు ఈ క్షిపణి సిర్సా నుంచి గాల్లోకి ఎగరలేదు’’ అని వెల్లడించాయి. రక్షణ శాక వివరాలను బట్టి ఈ పరీక్ష చేపట్టే ఉద్దేశం భారత్కు లేదని అర్థమవుతోంది.
పొరపాటున ఎలా ప్రయోగించారు..?
క్షిపణి ప్రయోగానికి సంబంధించి ఎలాంటి పొరపాట్లు చోటు చేసుకోకుండా.. మెకానికల్, సాఫ్ట్వేర్ పరంగా పలు జాగ్రత్తలు తీసుకొంటారు. క్షిపణిలో పలు లక్ష్యాలకు సంబంధించిన జియో లొకేషన్స్ ముందే ఉంటాయి. ప్రయోగానికి ముందు వీటిని సెలక్ట్ చేసుకోవడమో.. కొత్తవి యాడ్ చేసుకోవడమో చేయాలి. ఇక కౌంట్డౌన్ మొదలు కావడానికి ముందే పలు దశల్లో కోడ్స్ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
పాక్కు సమాచారం అందించిన భారత్..
క్షిపణిని పొరపాటుగా ప్రయోగించిన వెంటనే పరిణామాలను విశ్లేషించి.. భారత్ ఆ సమాచారాన్ని వెంటనే పాక్తో పంచుకుంది. అయితే.. గురువారం రాత్రి పాకిస్థాన్ సైన్యం ప్రతినిధి బాబర్ ఇఫ్తికార్ ప్రెస్మీట్ నిర్వహించారు. శుక్రవారం మరో ప్రకటన విడుదల చేసి.. భారత్ తమకు ఎలాంటి సమాచారం అందించలేదని ఆరోపించారు. మరోపక్క క్షిపణి ప్రయోగం నుంచి అది కూలేవరకూ తమ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ట్రాక్ చేసిందని పాక్ వెల్లడించింది. కానీ, భారత్ బుధవారం సాయంత్రం పొరపాటున క్షిపణి ప్రయోగిస్తే.. పాక్ గురువారం రాత్రి ప్రెస్మీట్ నిర్వహించింది. అంటే దాదాపు 24 గంటల తర్వాత వెల్లడించింది. మళ్లీ శనివారం.. క్షిపణి ప్రయాణ మార్గం, ట్రాజెక్టరీ వంటి వివరాలు ఇవ్వాలని భారత్ను కోరడం గమనార్హం. దీన్ని బట్టి పాక్ ఏ దశలోనూ క్షిపణిని ట్రాక్ చేయలేదని తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘ఎంపీగా లేకపోతేనేం’.. వరుణ్ గాంధీ భావోద్వేగ లేఖ
Varun Gandhi: ఈ ఎన్నికల్లో టికెట్ కోల్పోయిన భాజపా ఎంపీ వరుణ్గాంధీ తన నియోజకవర్గ ప్రజలకు భావోద్వేగంతో కూడిన లేఖ రాశారు. ఎంపీగా లేకపోయినా.. ఓ కుమారుడిలా ప్రజలకు సేవ చేస్తానన్నారు. -
రాజకీయ ఒత్తిళ్లతో న్యాయవ్యవస్థకు ముప్పు.. సీజేఐకి 600 మంది లాయర్ల లేఖ
Lawyers letter to CJI: సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్కు 600 మంది ప్రముఖ న్యాయవాదులు లేఖ రాశారు. కొందరు స్వార్థమూకలు న్యాయవ్యవస్థను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. -
టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం.. చికిత్స పొందుతూ ఎంపీ కన్నుమూత
Erode MP Ganeshamurthi Suicide: టికెట్ రాలేదన్న మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేసిన ఈరోడ్ ఎంపీ.. చికిత్స పొందుతూ గురువారం కన్నుమూశారు. -
కసబ్ను పట్టుకున్న సదానంద్ దాతెకు ఎన్ఐఏ పగ్గాలు
‘ఉగ్రవాద వ్యతిరేక దళం’ అధిపతిగా ఉన్న సదానంద్ వసంత్ దాతెను ‘జాతీయ దర్యాప్తు సంస్థ’ (ఎన్ఐఏ) డైరెక్టర్ జనరల్గా నియమిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీచేసింది. -
ఆ డబ్బు ఎక్కడుందో కేజ్రీవాల్ నేడు చెబుతారు
మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో తన భర్త, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో ఆయన సతీమణి సునీత బుధవారం సంచలన ప్రకటన చేశారు. -
నాలుగు చిలుకలకు రూ.444 టికెట్!
స్వేచ్ఛగా విహరించాల్సిన చిలుకలు బస్సులో ప్రయాణించిన కారణంగా వందల రూపాయలతో టికెట్ తీసుకోవాల్సి వచ్చింది. -
రాష్ట్రపతి పాలన విధిస్తే.. అది రాజకీయ ప్రతీకారమే
ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో దేశ రాజధాని దిల్లీలో రాష్ట్రపతి పాలన విధిస్తే అది రాజకీయ ప్రతీకారమే అవుతుందని దిల్లీ మంత్రి ఆతిశీ పేర్కొన్నారు. -
కేరళ సీఎం కుమార్తెపై ఈడీ కేసు నమోదు
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుమార్తె వీణా విజయన్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. -
‘ఎయిరిండియా’ రెక్కలను ఢీకొన్న ఇండిగో
చెన్నై వెళ్లేందుకు సిద్ధమై రన్వే క్లియరెన్సు కోసం ఆగి ఉన్న ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానం రెక్కలను దర్భంగా (బిహార్)కు బయలుదేరుతున్న ఇండిగో ఎయిర్క్రాఫ్ట్ ఢీకొంది. -
చివరి ఓటరునూ చేరుకోవాలని!
దేశంలోని ప్రతి ఓటరూ తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎన్నికల సంఘం భగీరథ ప్రయత్నమే చేస్తుంది. ఓటర్లు ఎక్కడ ఉన్నా వారి కోసం పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది. -
హుక్కా బార్లో సోదాలు.. పోలీసుల అదుపులో బిగ్బాస్ విజేత మునావర్ ఫారూకీ
ప్రముఖ స్టాండప్ కమెడియన్, హిందీ బిగ్బాస్-17 విజేత మునావర్ ఫారూకీ మరోసారి వివాదంలో నిలిచారు. -
ఇలా ప్రవేశం.. అలా ఆమోదం
దేశానికి, ప్రజలకు అవసరమయ్యే శాసనాలు సమర్థవంతంగా, లోపరహితంగా ఉండటం ఎంతైనా అవసరం. అంతటి ప్రాధాన్యం ఉంది కనుకే చట్టసభల్లో వాటిపై విస్తృతమైన చర్చలు, సంప్రదింపులు జరుపుతుంటారు. -
రూ.245 కోట్ల డ్రగ్స్ స్వాధీనం
మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో ముంబయి పోలీసులు భారీగా మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు. -
మహువా, హీరానందానీలకు మళ్లీ ఈడీ సమన్లు
విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) ఉల్లంఘన కేసులో టీఎంసీ నేత మహువా మొయిత్రా, దుబాయ్ వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీలకు బుధవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మళ్లీ సమన్లు జారీ చేసింది. -
ఈడీ సోదాల కోసమో, పోలీసులను చూసో ప్రవర్తన మారకూడదు
ప్రజల ప్రవర్తనలో మార్పు ఈడీ సోదాల కోసమో, పోలీసులను చూసో రాకూడదని, అది మనసులో నుంచి వివేకంతో రావాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ స్పష్టం చేశారు. -
మనీలాండరింగ్ పరిధిలోకి రాని నేరానికి ఆ చట్టాన్ని వర్తింపజేయలేం
ఒక వ్యక్తిపై మోపిన నేరపూరిత కుట్ర అభియోగాలు మనీలాండరింగ్ చట్టం పరిధిలోకి రానట్లయితే...సదరు నిందితుడిపై ‘ఐపీసీ సెక్షన్ 120బి’ని మోపి పీఎంఎల్ఏ కింద కేసు నమోదు చేయరాదని సర్వోన్నత న్యాయస్థానం మరోసారి స్పష్టం చేసింది. -
ఆసుపత్రి నుంచి సద్గురు డిశ్ఛార్జ్
ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సద్గురు జగ్గీ వాసుదేవ్ ఆసుపత్రి నుంచి బుధవారం డిశ్ఛార్జ్ అయ్యారు. ఈ విషయాన్ని ఈశా ఫౌండేషన్ ఓ ప్రకటనలో తెలిపింది. -
డ్రగ్స్ జప్తు కేసులో మాజీ ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్ను దోషిగా తేల్చిన కోర్టు
కస్టడీ మరణం కేసులో ఇప్పటికే జీవిత ఖైదు శిక్షను అనుభవిస్తున్న మాజీ ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్ను న్యాయస్థానం మరో నేరంలో దోషిగా నిర్ధారించింది. -
నేపాల్ మేయర్ కుమార్తె ఆచూకీ లభ్యం
గోవాలో రెండ్రోజుల క్రితం అదృశ్యమైన నేపాల్లోని ధన్గఢీ నగర మేయర్ కుమార్తె ఆర్తీ హమాల్(36) ఆచూకీ బుధవారం లభ్యమైంది. -
నా దగ్గర అంత డబ్బు లేదు.. అందుకే పోటీ చేయట్లేదు: నిర్మలా సీతారామన్
ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవసరమైన నిధులు తన వద్ద లేవని.. అందుకే పార్టీ ప్రతిపాదనను తిరస్కరించానని ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. -
26/11 హీరో సదానంద్ వసంత్ దాటేకు ఎన్ఐఏ పగ్గాలు
కేంద్ర దర్యాప్తు సంస్థ నూతన అధిపతిగా సదానంద్ వసంత్ దాటే నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
‘ఎంపీగా లేకపోతేనేం’.. వరుణ్ గాంధీ భావోద్వేగ లేఖ
-
జగన్.. ఈ 7 ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా?: చంద్రబాబు సవాల్
-
సూచీల దూకుడు.. 900+ పాయింట్ల లాభంలో సెన్సెక్స్.. కారణమేంటి?
-
వరుస ఫ్లాప్స్ వల్లే రాజకీయాల్లోకి అడుగుపెట్టారా: కంగన సమాధానం ఏమిటంటే..?
-
రషీద్ బౌలింగ్లో సిక్స్లు.. ధోనీ సలహాలు పాటించా: సమీర్ రిజ్వీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM