Manipur Violence: అదృశ్యమైన ఆ విద్యార్థుల దారుణ హత్య.. మణిపుర్లో వెలుగులోకి మరో ఘోరం..!
Manipur Violence: మణిపుర్లో గత కొంతకాలంగా కన్పించకుండా పోయిన ఇద్దరు విద్యార్థులను గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. వీరి మృతదేహాల ఫొటోలు తాజాగా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.
ఇంఫాల్: జాతుల మధ్య వైరంతో అట్టుడికిపోయిన ఈశాన్య రాష్ట్రం మణిపుర్ (Manipur Violence)లో అల్లర్ల సమయంలో చోటుచేసుకున్న దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. కొద్ది నెలల క్రితం అదృశ్యమైన ఇద్దరు విద్యార్థులు దారుణ హత్యకు గురయ్యారు. వీరి మృతదేహాల ఫొటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవడంతో రాష్ట్రంలో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. (Missing students killed by armed men)
అల్లర్లు, ఆందోళనల నేపథ్యంలో ఇంటర్నెట్ (Internet Services) సేవలపై విధించిన ఆంక్షలను గతవారం మణిపుర్ ప్రభుత్వం ఎత్తివేసింది. ఈ క్రమంలోనే సోమవారం నుంచి ఈ ఫొటోలు వైరల్ (Viral Photos) అవుతున్నాయి. ఇద్దరు విద్యార్థులను కొంతమంది సాయుధులు కిడ్నాప్ చేసి హత్య చేసినట్లు తెలుస్తోంది. ఒక అటవీ ప్రాంతంలో విద్యార్థులను బంధించినట్లు ఒక ఫొటోలో ఉండగా.. వారి వెనుక ఇద్దరు సాయుధులు కన్పించారు. పొదల మధ్యలో విద్యార్థుల మృతదేహాలను పడేసిన మరో ఫొటో కూడా వైరల్ అయ్యింది. దీంతో ఈ ఘటన మరోసారి దుమారం రేపింది.
ఈ నేపథ్యంలోనే దీనిపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. హత్యకు గురైన విద్యార్థులు.. మైతేయ్ వర్గానికి చెందిన 17 ఏళ్ల అమ్మాయి, 20 ఏళ్ల అబ్బాయిగా గుర్తించినట్లు తెలిపింది. జులై 6 నుంచి వీరిద్దరూ అదృశ్యమయ్యారు.
మణిపుర్ నిరాశ్రయులకు ‘ఆధార్’ ఇవ్వండి: సుప్రీం సూచన
జులై 6వ తేదీన ఆంక్షలు సడలించడంతో అమ్మాయి నీట్ కోచింగ్ నిమిత్తం ఇంటి నుంచి బయటకు వెళ్లింది. పరిస్థితులు సద్దుమణిగాయని భావించిన ఆమె.. తర్వాత తన స్నేహితుడితో బైక్పై లాంగ్ డ్రైవ్కు వెళ్లింది. ఇక అప్పటి నుంచి వారి జాడలేకుండా పోయింది. వారి ఫోన్లు స్విచ్ఛాఫ్ అయ్యాయి. వారు ఇంఫాల్కు సమీపంలోని నంబోల్ వైపు వెళ్లినట్లు సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యిందని పోలీసులు అప్పట్లో వెల్లడించారు. ఈ క్రమంలోనే సాయుధులు వారిని కిడ్నాప్ చేసి హత్య చేసి ఉండొచ్చని భావిస్తున్నారు.
కాగా.. ఈ ఘటనపై ఇప్పటికే సీబీఐ (CBI) దర్యాప్తు ప్రారంభించినట్లు మణిపుర్ ప్రభుత్వం తమ ప్రకటనలో వెల్లడించింది. హత్యకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చింది. మరోవైపు, కుకీ వర్గానికి చెందిన దుండగులు ఈ ఘటనకు పాల్పడి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే విషయాన్ని మణిపుర్ ప్రభుత్వం ఇటీవల సుప్రీంకోర్టుకు ఇచ్చిన నివేదికలోనూ పేర్కొన్నట్లు తెలుస్తోంది.
ఆ మధ్య మణిపుర్లో ఇంటర్నెట్ ఆంక్షలను సడలించినప్పుడు కూడా ఇద్దరు మహిళలపై జరిగిన అమానుషం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఆ మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. ఆ ఘటనపై కూడా సీబీఐ దర్యాప్తు చేపట్టింది. వీటితో పాటు అల్లర్ల సమయంలో చోటుచేసుకున్న మరో 9 హింసాత్మక ఘటనలను సీబీఐ విచారిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Rat Hole Mining: నిషేధించిన విధానమే.. 41మందిని కాపాడింది!
ఉత్తర్కాశీ సొరంగంలో చిక్కుకున్న కూలీలను బయటకు తీసుకువచ్చేందుకు (Tunnel Operation) అనేక ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించినప్పటికీ.. చివరకు ర్యాట్-హోల్ (Rat Hole Mining) పద్ధతిలోనే రెస్క్యూ బృందాలు వారిని రక్షించగలిగాయి. -
Uttarakhand Tunnel: ఆపరేషన్ టన్నెల్.. క్షేమంగా బయటపడిన 41 మంది కూలీలు
ఉత్తర్కాశీలోని సొరంగంలో చిక్కుకున్న 41 మంది కూలీలు ఎట్టకేలకు క్షేమంగా బయటపడ్డారు. -
Uttarakhand Tunnel: ఎట్టకేలకు బాహ్య ప్రపంచంలోకి.. సొరంగం నుంచి సురక్షితంగా బయటికొస్తున్న కూలీలు
Uttarakhand Tunnel: 17 రోజులుగా సొరంగంలో చిక్కుకుపోయిన కూలీలు ఎట్టకేలకు బాహ్య ప్రపంచంలోకి అడుగుపెడుతున్నారు. అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో సహాయక చర్యలు చేపట్టిన అధికారులు.. 41 మంది కూలీలను సురక్షితంగా బయటకు తీసుకొస్తున్నారు. -
Stalin: ₹400 కోట్లతో ఫుట్వేర్ పార్కు.. 20వేల మందికి ఉద్యోగాలు: సీఎం స్టాలిన్
తమిళనాడులో 250 ఎకరాల విస్తీర్ణంలో ఫుట్వేర్ పార్కును ఏర్పాటు చేసేందుకు యోచిస్తున్నట్లు సీఎం స్టాలిన్ వెల్లడించారు. -
WFI: డబ్ల్యూఎఫ్ఐ ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమం
డబ్ల్యూఎఫ్ఐ (WFI)ఎన్నికల నిర్వహణపై పంజాబ్-హరియాణా హైకోర్టు విధించిన స్టేను సుప్రీం కోర్టు పక్కన పెట్టింది. రివైజ్డ్ నోటిఫికేషన్ జారీ చేసి.. ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించింది. -
Bombay HC: సోషల్ మీడియా సమాచారంతో ‘పిల్’.. తప్పుపట్టిన బాంబే హైకోర్టు!
ఓ పిల్లో పిటిషన్దారు సోషల్ మీడియా నుంచి సేకరించిన సమాచారాన్ని ప్రస్తావించడాన్ని బాంబే హైకోర్టు తప్పుపట్టింది. -
Supreme Court: పాకిస్థాన్ నటీనటులను నిషేధించాలంటూ పిటిషన్.. సుప్రీం కీలక వ్యాఖ్యలు
పాకిస్థాన్ నటీనటులు భారతీయ సినిమాల్లో నటించకుండా పూర్తిగా నిషేధం విధించేలా కేంద్రానికి ఆదేశాలు ఇవ్వాలని దాఖలైన పిటిషన్ను సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. -
Rahul Gandhi: శీతాకాల సమావేశాల వేళ.. మళ్లీ విదేశాలకు రాహుల్..!
డిసెంబర్లో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమయంలోనే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) విదేశీ పర్యటనకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. -
Uttarakhand Tunnel: మిగిలిన 2 మీటర్ల డిగ్గింగ్.. కూలీలను తీసుకొచ్చేందుకు మరికొన్ని గంటలు
Uttarakhand Tunnel: ఉత్తరాఖండ్లోని సొరంగంలో చిక్కుకున్న కూలీలు బయటకు తీసుకొచ్చేందుకు మరికొన్ని గంటలు పట్టే అవకాశముంది. సొరంగం వద్ద సహాయక చర్యలు దాదాపు చివరి దశకు చేరుకున్నాయి. -
Supreme Court: మంత్రి సెంథిల్ బాలాజీకి బెయిల్ నిరాకరణ
తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీకి (Senthil Balaji) అనారోగ్య కారణాలతో బెయిల్ మంజూరు చేసేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. -
Madras HC: కలెక్టర్లకు ఈడీ నోటీసులు చట్ట విరుద్ధం: మద్రాసు హైకోర్టు
తమిళనాడులోని అక్రమ ఇసుక తవ్వకాలకు సంబంధించి మనీలాండరింగ్ చట్టం కింద ఐదుగురు జిల్లా కలెక్టర్లకు ఈడీ జారీ చేసిన నోటీసులపై మద్రాసు హైకోర్టు స్టే విధించింది. -
Kota: నీట్ అభ్యర్థి ఆత్మహత్య.. ఈ ఏడాదిలో కోటాలో 28కి చేరిన మరణాలు
పోటీ పరీక్షల శిక్షణకు ప్రసిద్ధి చెందిన రాజస్థాన్లోని కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో ఈ ఏడాది అక్కడ జరిగిన బలవన్మరణాల సంఖ్య 28కి చేరుకుంది. -
Kangana Ranaut: ఇందిరాగాంధీతో కంగన చిట్చాట్.. అదెలా సాధ్యమంటే..?
కంగనా రనౌత్(Kangana Ranaut) స్వీయ దర్శకత్వంలో ‘ఎమర్జెన్సీ’(Emergency) చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఈ క్రమంలో ఆమె షేర్ చేసిన చిత్రాలు వైరల్గా మారాయి. -
Uttarakhand Tunnel: సొరంగం వద్ద శరవేగంగా పనులు.. ఇంకా 10 మీటర్ల దూరంలో కూలీలు
Uttarakhand Tunnel: ఉత్తరాఖండ్లోని సొరంగంలో చిక్కుకున్న కూలీలను కాపాడేందుకు సహాయక చర్యలు శరవేగంగా కొనసాగుతున్నాయి. నేలకు సమాంతరంగా చేపట్టిన మాన్యువల్ డ్రిల్లింగ్లో ఇంకా 10 మీటర్ల తవ్వకాలు పూర్తిచేస్తే కూలీల వద్దకు చేరుకోవచ్చని అధికారులు తెలిపారు. -
Gold Saree: బంగారు చీర.. ధర రూ.2.25 లక్షలు
దిల్లీలో జరుగుతున్న 42వ భారత అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శనలో బంగారు పూత పూసిన ఓ చీర రూ.2.25 లక్షల ధర పలికింది. -
రూ.4.60 లక్షల ధర పలికిన ముర్రాజాతి గేదె
హరియాణాలోని ఝజ్జర్ జిల్లా ఖాన్పుర్కు చెందిన ఓ ముర్రాజాతి గేదె రికార్డుస్థాయిలో రూ.4.60 లక్షలకు అమ్ముడుపోయింది. -
రన్వేపై బారాత్.. విమానంలో వివాహం
యూఏఈకి చెందిన ఓ వ్యాపారవేత్త ఆకాశవీధుల్లో తన కుమార్తె వివాహాన్ని అంగరంగ వైభవంగా జరిపించారు. -
మౌలిక వసతుల విస్తరణతోనే అందరికీ చేరువగా న్యాయం
ప్రజానుకూల తీర్పులు ఇవ్వడం ద్వారా మాత్రమే అందరికీ అందుబాటులోకి న్యాయాన్ని తీసుకురాలేమని భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ డి.వై.చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు. -
నిబంధనలు ఉల్లంఘించే పార్టీల గుర్తింపు రద్దు అధికారం ఈసీకి ఉండాలి
చట్టాలను, నమోదు నిబంధనలను ఉల్లంఘించే రాజకీయ పార్టీల గుర్తింపును రద్దు చేసే అధికారం ఎన్నికల సంఘాని(ఈసీ)కి తప్పనిసరిగా ఉండాలని సుప్రీంకోర్టుకు సమర్పించిన వాదనల్లో పిటిషనర్ గట్టిగా కోరారు. -
గుజరాత్లో అకాల వర్షాలు
గుజరాత్లో అకాల వర్షాలు బీభత్సం సృష్టించాయి. పలు ప్రాంతాల్లో వడగండ్లు పడ్డాయి. పలు జిల్లాల్లో పిడుగులు పడి 27 మంది మృతి చెందారు. -
36 మీటర్లు పూర్తయిన తవ్వకం
ఉత్తరాఖండ్ సొరంగంలో చిక్కుకున్న 41 మందిని రక్షించడానికి కొండ పైభాగం నుంచి చేపట్టిన 86 మీటర్ల డ్రిల్లింగ్ పనిలో సోమవారం రాత్రికి 36 మీటర్లు పూర్తయింది.


తాజా వార్తలు (Latest News)
-
Rat Hole Mining: నిషేధించిన విధానమే.. 41మందిని కాపాడింది!
-
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Uttarakhand Tunnel: ఆపరేషన్ టన్నెల్.. క్షేమంగా బయటపడిన 41 మంది కూలీలు
-
1 నుంచి TCS బైబ్యాక్.. 20 శాతం ప్రీమియంతో షేర్ల కొనుగోలు
-
Team India: పెళ్లిపీటలెక్కబోతున్న భారత్ ఫాస్ట్ బౌలర్
-
Uttarakhand Tunnel: ఎట్టకేలకు బాహ్య ప్రపంచంలోకి.. సొరంగం నుంచి సురక్షితంగా బయటికొస్తున్న కూలీలు