Vaccine: వేర్వేరు టీకా డోసులు ఇప్పుడే కాదు
టీకా విధానంలో వేర్వేరు డోసుల సమర్థత ఇంకా శాస్త్రీయంగా రుజువు కానందున ప్రస్తుతానికి వ్యాక్సిన్ మిక్సింగ్ అనే ప్రశ్నే లేదని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. అంతేగాక, కొవిషీల్డ్ కూడా సింగిల్ డోసు కాదని, రెండు డోసులు వేయించుకోవాల్సిందేనని వెల్లడించింది.
స్పష్టం చేసిన కేంద్ర ఆరోగ్యశాఖ
దిల్లీ: టీకా విధానంలో వేర్వేరు డోసుల సమర్థత ఇంకా శాస్త్రీయంగా రుజువు కానందున ప్రస్తుతానికి వ్యాక్సిన్ మిక్సింగ్ అనే ప్రశ్నే లేదని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. అంతేగాక, కొవిషీల్డ్ కూడా సింగిల్ డోసు కాదని, రెండు డోసులు వేయించుకోవాల్సిందేనని వెల్లడించింది. ‘‘కొవిషీల్డ్ రెండు డోసుల టీకా. ఇందులో ఎలాంటి మార్పు లేదు. డోసుల వ్యవధిలోనూ మార్పు ఉండదు. తొలి డోసు వేసుకున్న 12 వారాల తర్వాతే కొవిషీల్డ్ రెండో డోసు తీసుకోవాలి. ఇక వ్యాక్సిన్ వేర్వేరు డోసుల మిక్సింగ్ విషయానికొస్తే.. శాస్త్రీయంగా నిరూపణ అయ్యేంతవరకు దీన్ని అనుసరించకూడదు. ప్రస్తుతానికి తొలి డోసులో వేయించుకున్న వ్యాక్సిన్నే రెండో డోసులో కూడా తీసుకోవాలి’’ అని ఆరోగ్యశాఖ వివరించింది. వేర్వేరే టీకా డోసులు, కేవలం సింగిల్ డోసు టీకాలంటూ గత కొద్ది రోజులుగా మీడియా కథనాలు వెలువడుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు స్పష్టతనిచ్చింది.
జులై నాటికి రోజుకు కోటిమందికి టీకా
ఇక ప్రస్తుతం దేశంలో వ్యాక్సిన్ల కొరత లేదని ఆరోగ్యశాఖ వెల్లడించింది. జులై మధ్య నాటికి లేదా ఆగస్టుకు రోజుకు కోటి మందికి టీకాలు ఇచ్చేలా వ్యాక్సిన్లను అందుబాటులో ఉంచనున్నట్లు పేర్కొంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 21.6 కోట్ల మంది టీకాలు తీసుకున్నారు. ఇందులో 1.67 కోట్ల మంది ఆరోగ్య కార్యకర్తలు, 2.42 కోట్ల మంది ఫ్రంట్లైన్ వర్కర్లు ఉన్నారు. 45ఏళ్లు పైబడినవారు 15.48కోట్ల మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. 18-44 ఏళ్ల వారిలో 2.03 కోట్ల మందికి టీకా ఇచ్చినట్లు ఆరోగ్యశాఖ వివరించింది.
6.62 శాతానికి పాజిటివిటీ రేటు..
మే తొలి వారంతో పోలిస్తే రోజువారీ కేసులు 69శాతం తగ్గినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రోజువారీ పాజిటివిటీ రేటు 6.62శాతానికి పడిపోయిందని, ఏప్రిల్ 1 తర్వాత అది ఇంత కనిష్ఠంగా ఉండటం మళ్లీ ఇప్పుడేనని వెల్లడించింది.
30 రాష్ట్రాల్లో తగ్గుతున్న యాక్టివ్ కేసులు
‘దేశంలో క్రియాశీల కేసులు గణనీయంగా తగ్గాయి. యాక్టివ్ కేసుల్లో రోజుకు 1.3లక్షల తగ్గుదల కనిపిస్తోంది. గత వారం రోజులుగా 30 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ కేసులు తగ్గుముఖం పట్టాయి. కొత్త కేసులు కూడా నానాటికీ దిగొస్తున్నాయి. మే 28 నుంచి రోజువారీ కేసులు 2లక్షలకు దిగువనే ఉంటున్నాయి. మే 7న నమోదైన అత్యధిక రోజువారీ కేసులతో పోలిస్తే ఇప్పుడు దాదాపు 69శాతం తగ్గాయి’ అని ఆరోగ్యశాఖ వెల్లడించింది. 344 జిల్లాల్లో పాజిటివిటీ రేటు 5శాతం కంటే తక్కువే ఉందని పేర్కొంది. రికవరీలు కూడా నానాటికీ పెరుగుతున్నాయని, ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 92శాతానికి చేరినట్లు తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
శరీర బరువు తగ్గించే శస్త్రచికిత్సకు వెళ్లి..
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?