Cyber Crime: వామ్మో.. స్కామ్ కాల్స్తో 53 బిలియన్ డాలర్లు కొల్లగొట్టారా?
గతేడాది మొబైల్ యూజర్లు (Mobile Users) స్కామ్ కాల్స్ (Scam Calls) కారణంగా సుమారు 53 బిలియన్ డాలర్లు కోల్పోయారని జుపనీర్ రీసెర్చ్ సంస్థ వెల్లడించింది. 2027 నాటికి ఈ తరహా మోసాల కారణంగా కోల్పోయే మొత్తం విలువ రెట్టింపు అవుతుందని అంచనా వేసింది.
దిల్లీ: సైబర్ నేరాల (Cyber Crimes) తీరు రోజురోజుకీ మారిపోతోంది. స్పామ్/స్కామ్ కాల్స్ (Spam/Scam Calls) గురించి ప్రజలను హెచ్చరిస్తున్నప్పటికీ, అవగాహన లోపంతో కొందరు నష్టపోతున్నారు. మోసపూరిత స్కామ్ కాల్స్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా యూజర్లు ఈ ఏడాది సుమారు 58 బిలియన్ డాలర్ల మొత్తాన్ని కోల్పోతారని జునీపర్ రీసెర్చ్ (Juniper Research) అనే సంస్థ అంచనా వేసింది. గతేడాది మొబైల్ యూజర్లు (Mobile Users) స్కామ్ కాల్స్ కారణంగా సుమారు 53 బిలియన్ డాలర్లు కోల్పోయారని వెల్లడించింది. వినియోగదారులకు అందించే సేవల విభాగంలో రోబో ఆధారిత సేవలు ఎక్కువగా అందుబాటులోకి రావడంతో సైబర్ నేరగాళ్లు స్కామ్ కాల్స్ మోసాలకు పాల్పడుతున్నారని తెలిపింది.
2027 నాటికి ఈ తరహా మోసాల వల్ల మొబైల్ యూజర్లు కోల్పోయే మొత్తం విలువ 70 బిలియన్ డాలర్లు ఉంటుందని జుపనీర్ అంచనా వేసింది. మోసపూరిత స్కామ్ కాల్స్ వల్ల ఎక్కువ నష్టపోతున్న ప్రాంతాల్లో ఉత్తర అమెరికా (North America) మొదటి స్థానంలో ఉంది. కాల్ ఫార్వాడింగ్ (Call Forwarding), కాలర్ ఐడీ స్పూఫింగ్ (Call ID Spoofing) వంటి టూల్స్ సాయంతో ఈ తరహా మోసాలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయని జునీపర్ తెలిపింది. వీటిని గుర్తించేందుకు వీలుగా మొబైల్ తయారీ సంస్థలు ప్రత్యేకమైన టూల్ను యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చాయి. అలానే యూజర్లు సున్నితమైన సమాచారాన్ని ఇతరులతో షేర్ చేసుకోవద్దని సూచించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
-
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని