Manipur: మణిపుర్లో మరోసారి ఉద్రిక్తతలు.. కర్ఫ్యూ సడలింపులు రద్దు!
మణిపుర్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. తమ వారిని విడుదల చేయాలంటూ ఆందోళనకారులు పోలీస్ స్టేషన్ల ముట్టడికి యత్నించగా.. పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు.
ఇంఫాల్: జాతుల మధ్య ఘర్షణలతో అట్టుడికిపోతున్న మణిపుర్ (Manipur)లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. పోలీసులు ఇటీవల అరెస్టు చేసిన అయిదుగురు యువకులను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ.. పెద్దఎత్తున స్థానికులు పోలీస్స్టేషన్ల ముట్టడికి యత్నించారు. నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్లు ప్రయోగించారు. ఈ క్రమంలో దాదాపు 10 మందికి పైగా గాయపడ్డారు. పరిస్థితులు మరింత దిగజారకుండా ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు తూర్పు, పశ్చిమ ఇంఫాల్ జిల్లాల్లో కర్ఫ్యూ సడలింపులను రద్దు చేశారు.
అధునాతన ఆయుధాలు, భద్రతా బలగాల యూనిఫాంలతో తిరుగుతున్న అయిదుగురు యువకులను సెప్టెంబరు 16న మణిపుర్ పోలీసులు అరెస్టు చేశారు. వారిని జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి, పోలీసు కస్టడీకి తరలించారు. ఆ అరెస్టుతో స్థానికంగా నిరసనలు మొదలయ్యాయి. నిందితులను విడిచిపెట్టాలంటూ.. మంగళవారం నుంచి 48 గంటల లాక్డౌన్ పాటించారు. ఈ క్రమంలోనే ఆయా సంఘాల పిలుపుతో గురువారం మహిళలు సహా వందలాది మంది నిరసనకారులు తూర్పు, పశ్చిమ ఇంఫాల్ జిల్లాల్లోని ఆయా పోలీస్ స్టేషన్లలో ప్రవేశించేందుకు యత్నించారు.
కుకీ-మైతేయ్ విద్వేషం వెనుక..!
ఈ క్రమంలోనే నిరసనకారులను చెదరగొట్టేందుకు.. పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బంది టియర్ గ్యాస్ ప్రయోగించారు. దాంతో 10 మందికిపైగా గాయాలయ్యాయి. తమ అయిదుగురు వాలంటీర్లను విడుదల చేయడంలో పోలీసులు విఫలమయ్యారని, ఈ నేపథ్యంలో స్వచ్ఛందంగా అరెస్టు కావడం మినహా తమకు వేరే దారిలేకపోయిందని నిరసనకారులు ఓ వార్తాసంస్థతో పేర్కొన్నారు. అటువంటి వారిని అరెస్టు చేస్తే.. మైతేయ్ గ్రామాలను ఎవరు రక్షిస్తారని ప్రశ్నించారు. మరోవైపు.. స్థానికంగా ఉద్రిక్త పరిణామాలతో అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం.. ఇంఫాల్ జంట జిల్లాల్లో కర్ఫ్యూ సడలింపులను రద్దు చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పదవీ విరమణ వయసులో.. సెక్యూరిటీ గార్డు డబుల్ పీజీ
రాజ్కరణ్ బారువా (56).. మధ్యప్రదేశ్లోని జబల్పుర్ నగరంలో రూ.5 వేల జీతానికి రాత్రంతా సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తూ, పగలు ఇళ్లలోనూ పనిచేస్తారీయన. ఇలా చాలామంది చేస్తూ ఉండవచ్చు. -
కార్మికుల మనోధైర్యానికి జాతి వందనం
ఉత్తరాఖండ్లోని సిల్క్యారా సొరంగంలో చిక్కుకొని దాదాపు 17 రోజుల తర్వాత మంగళవారం సాయంత్రం విజయవంతంగా బయటపడిన 41 మంది కార్మికుల మనోధైర్యానికి జాతి వందనాలు సమర్పిస్తోందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తెలిపారు. -
పేదలకు అండగా ట్రాన్స్జెండర్
పేద కుటుంబాల అమ్మాయిలకు వివాహం చేయడానికి వారి తల్లిదండ్రులు పడే ఇబ్బందులు అన్నిఇన్నీ కావు. అలాంటి వారి బాధను అర్థం చేసుకున్నారు రాజస్థాన్కు చెందిన ఓ ట్రాన్స్జెండర్. ఏటా 10 మంది పేద కుటుంబాల అమ్మాయిలకు వివాహం చేస్తూ తన గొప్ప మనసు చాటుకుంటున్నారు. -
కేజ్రీవాల్కు గోవా కోర్టు సమన్లు
ఆప్ జాతీయ కన్వీనర్, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు గోవా కోర్టు మంగళవారం సమన్లు జారీ చేసింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారన్న ఆరోపణలపై మపూసా ఫస్ట్క్లాస్ జుడీషియల్ మేజిస్ట్రేట్ జారీచేసిన ఈ సమన్లలో బుధవారం కోర్టు ముందు హాజరు కావలసిందిగా పేర్కొన్నారు. -
శీతాకాల సమావేశాల వేళ.. రాహుల్ మళ్లీ విదేశాలకు
పార్లమెంటు శీతాకాల సమావేశాలకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ గైర్హాజరు కానున్నట్టు సమాచారం. ఈ సమయంలో ఆయన విదేశీ పర్యటనకు వెళుతున్నట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. -
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు దిల్లీలో ఓటరు కార్డు
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మారిన చిరునామాతో కొత్త ఓటరు కార్డును మంగళవారం అందుకున్నారు. దిల్లీ ముఖ్య ఎన్నికల అధికారి పి.కృష్ణమూర్తి రాష్ట్రపతిభవన్లో ముర్మును కలిసిఈ కార్డును అందజేశారు. -
సీజేఐ కోర్టులో విదేశాల ప్రధాన న్యాయమూర్తులు
సుప్రీంకోర్టులో మంగళవారం అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం భేటీ అయిన కోర్టుకు ఐవరీ కోస్ట్, దక్షిణ సూడాన్, ఘనా, కిర్గిజ్స్థాన్, ఉజ్బెకిస్థాన్, తజికిస్థాన్, కామెరూన్, బోట్స్వానా దేశాల ప్రధాన న్యాయమూర్తులు విచ్చేశారు. -
ఆంగ్ల భాష, అధిక ఫీజులే సమ న్యాయానికి అడ్డంకి
అత్యున్నత న్యాయ వ్యవస్థలో అధిక ఫీజులు, ఆంగ్ల భాషే సమ న్యాయానికి అడ్డంకిగా నిలుస్తున్నాయని, వాటిని అధిగమించాల్సి ఉందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము స్పష్టం చేశారు. -
నేవీకి మరో స్వదేశీ విమానవాహక నౌక!
హిందూ మహాసముద్ర ప్రాంతంలో చైనా కదలికలు పెరుగుతున్న నేపథ్యంలో భారత నౌకాదళానికి సరికొత్త బలం లభించబోతోంది. స్వదేశీ పరిజ్ఞానంతో రెండో విమానవాహక నౌకను నిర్మించాలన్న నేవీ ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించబోతోంది. -
2024 చివర్లోగా ఐఎస్ఎస్లోకి భారత వ్యోమగామి
అంతరిక్ష కేంద్ర నిర్మాణంలో భారత్కు సాయం చేయడానికి తాము సిద్ధమని అమెరికా రోదసి సంస్థ-నాసా అధిపతి బిల్ నెల్సన్ తెలిపారు. మన దేశంలో పర్యటిస్తున్న ఆయన మంగళవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. -
భర్త వ్యక్తిగత వివరాలు భార్యకు చెప్పాల్సిన అవసరం లేదు
భర్త వ్యక్తిగత వివరాలు భార్యకు తెలపాల్సిన అవసరం లేదని కర్ణాటక హైకోర్టు మంగళవారం స్పష్టం చేసింది. వివాహ బంధంలో కొనసాగుతున్నా, విడిపోయినా భాగస్వామి వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించేందుకు అవకాశం లేదని జస్టిస్ ఎస్.సునీల్దత్ యాదవ్, జస్టిస్ విజయకుమార్ ఏ పాటిల్లతో కూడిన ధర్మాసనం తేల్చిచెప్పింది. -
మృత్యుంజయులు
అందరి ప్రార్థనలు ఫలించాయి. దృఢ సంకల్పంతో దీక్షగా చేపట్టిన సహాయక చర్యలు సత్ఫలితాన్నిచ్చాయి. నేడు, రేపు అంటూ 17 రోజులుగా సొరంగంలోనే గడిపిన 41 మంది ఎట్టకేలకు సురక్షితంగా బయటకు రాగలిగారు. -
నిషేధించిన పనే ఆదుకుంది
ర్యాట్ హోల్ మైనింగ్.. ఉత్తర్కాశీ సొరంగ ప్రమాద ఉదంతంతో రెండ్రోజులుగా ప్రాచుర్యంలోకి వచ్చిన పని ఇది. ఇంతవరకు ఈశాన్య రాష్ట్రాలకు, ప్రధానంగా మేఘాలయకు పరిమితమైన ఈ ప్రక్రియే చార్ధామ్ రహదారి పనుల్లో భాగంగా చిక్కుకుపోయిన కూలీలను బయటకు తెచ్చేందుకు ఉపయోగపడింది. -
Rat hole Miners: ‘మమల్ని గట్టిగా కౌగిలించుకున్నారు.. ఇలాంటిది జీవితంలో ఒకేసారి వస్తుంది’
సిల్క్యారా సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులను బయటకు తీసుకురావడంపై ర్యాట్ హోల్ మైనర్లు జాతీయ మీడియాతో మాట్లాడారు.


తాజా వార్తలు (Latest News)
-
పదవీ విరమణ వయసులో.. సెక్యూరిటీ గార్డు డబుల్ పీజీ
-
యూపీలో అపహరణ.. హైదరాబాద్లో అత్యాచారం
-
ఏపీకి తుపాను ముప్పు.. డిసెంబరు తొలి వారంలో అతి భారీ వర్షాలు!
-
Cyber Attack: అమెరికా ఆస్పత్రులపై సైబర్ దాడి.. నిలిచిపోయిన వైద్య సేవలు
-
Rishab Shetty: అది చాలా బాధాకరం: ఓటీటీ సంస్థలపై రిషబ్ శెట్టి
-
Salaar: అందుకు వారికి సారీ.. ‘సలార్’ రూమర్స్పై ప్రశాంత్ నీల్ క్లారిటీ