Modi: ‘మోదీజీ.. 24 క్యారెట్ల బంగారం’: రాజ్‌నాథ్‌

ప్రధానమంత్రి నరేంద్రమోదీ 24 క్యారెట్ల బంగారమంత స్వచ్ఛమైన వ్యక్తి అని కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ కొనియాడారు. ఆయన రాజకీయ జీవితం నేటి విద్యార్థులకు

Published : 29 Oct 2021 18:16 IST

దిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ 24 క్యారెట్ల బంగారమంత స్వచ్ఛమైన వ్యక్తి అని కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ కొనియాడారు. ఆయన రాజకీయ జీవితం నేటి విద్యార్థులకు ఓ పాఠమని అన్నారు. ప్రధాని మోదీ రాజకీయాల్లో 20ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా దేశ రాజధాని దిల్లీలో ‘డెలివరింగ్‌ డెమోక్రసీ’ అనే అంశంపై జాతీయ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాజ్‌నాథ్‌.. మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు. రాజకీయ నేతగా ఆయన ఎనలేని సేవ చేస్తున్నారని కొనియాడారు.

‘‘నిజమైన నాయకత్వం అనేది ఆ వ్యక్తుల చిత్తశుద్ధి, ఏకాగ్రతతో అర్థమవుతుంది. మోదీజీ.. 24 క్యారెట్ల బంగారం లాంటి వ్యక్తి. 20ఏళ్లు పాటు రాజకీయాల్లో ఉంటూ పాలన కొనసాగిస్తున్నప్పటికీ ఇంతవరకూ ఆయనపై ఒక్క అవినీతి మరక లేదు. మోదీజీ కేవలం ఒక వ్యక్తి మాత్రమే కాదు. గత రెండు దశాబ్దాల ఆయన రాజకీయ ప్రయాణంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు. వాటిని దాటుకుని ఈ స్థాయికి చేరుకున్నారు. ఆయన జీవితాన్ని మేనేజ్‌మెంట్‌ విద్యార్థులకు బోధించాలి. సమర్థమైన నాయకత్వం, సమర్థ పాలనకు కేస్‌ స్టడీగా ప్రధాని జీవితాన్ని విద్యార్థులకు చెప్పొచ్చు’’ అని రాజ్‌నాథ్ సింగ్‌ ప్రశంసించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని