మోదీ అడిగిన ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసా?
మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న టోక్యో ఒలింపిక్స్పై క్విజ్తో ప్రధాని మోదీ ఈనెల మన్కీ బాత్ని ఆరంభించారు. ఈ సందర్భంగా ఆయన మూడు ప్రశ్నలు సంధించారు. ‘మైగవ్’ వెబ్సైట్ వేదికగా నిర్వహిస్తున్న రోడ్ టోక్యో క్విజ్లో పాల్గొనడం......
దిల్లీ: మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న టోక్యో ఒలింపిక్స్పై ప్రశ్నలతో ప్రధాని మోదీ ఈనెల ‘మన్ కీ బాత్’ని ఆరంభించారు. ఈ సందర్భంగా ఆయన మూడు ప్రశ్నలు సంధించారు. www.mygov.in వెబ్సైట్ వేదికగా నిర్వహిస్తున్న ‘రోడ్ టు టోక్యో’ క్విజ్లో పాల్గొనడం ద్వారా విలువైన బహుమతులు గెలుచుకోవాలని పిలుపునిచ్చారు.
ఒలింపిక్స్పై మోదీ అడిగిన ప్రశ్నలు
* ఒలింపిక్స్లో వ్యక్తిగత హోదాలో స్వర్ణ పతకం సాధించిన తొలి ఇండియన్ ఎవరు?
* ఏ ఆటలో భారత్ అత్యధిక బంగారు పతకాలు సాధించింది?
* ఒలింపిక్స్లో అత్యధిక పతకాలు సాధించిన ఆటగాడెవరు?
* ఒలింపిక్స్ ప్రస్తావనలో ఫ్లయింగ్ సిఖ్గా పేరుగాంచిన పరుగుల వీరుడు మిల్కా సింగ్ను మోదీ గుర్తుచేసుకున్నారు. ఓ లెజెండరీ అథ్లెట్ను కరోనా మనకు దూరం చేసిందంటూ విచారం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో ఆయనతో మాట్లాడినట్లు గుర్తుచేసుకున్నారు. 1964 ఒలింపిక్స్లో భారత్కు ప్రాతినిధ్యం వహించిన మీరు.. ఈ సారి ఒలింపిక్స్కు వెళుతున్న బృందంలో స్ఫూర్తి నింపాలని కోరితే మిల్కా సింగ్ సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. కానీ, అంతలోనే విధి మరో ప్రణాళిక సిద్ధం చేసుకుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
* ఎన్నో కష్టనష్టాలకోర్చి ఈసారి ఒలింపిక్స్లో పాల్గొంటున్న పలువురు గ్రామీణ క్రీడాకారుల గురించి మోదీ ఈ సందర్భంగా ప్రస్తావించారు. మహారాష్ట్రలోని సతారా జిల్లాకు చెందిన ప్రవీణ్ జాదవ్ ఆర్చరీలో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు. అలాగే హాకీ క్రీడాకారిణి నేహా గోయల్నూ మోదీ ప్రత్యేకంగా అభినందించారు. పేద కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన ఇలాంటి క్రీడాకారులు భారత్కు ప్రాతినిధ్యం వహిస్తుండడం గర్వంగా ఉందన్నారు. ఇలా పలువురు క్రీడాకారుల పోరాటాన్ని ప్రస్తావించిన మోదీ.. వారికి యావత్ భారత్ మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు.
* జూన్ 21న ప్రారంభమైన సార్వత్రిక వ్యాక్సినేషన్ కార్యక్రమంలో తొలిరోజే రికార్డు స్థాయిలో వ్యాక్సిన్ల పంపిణీ చేసినట్లు మోదీ గుర్తుచేశారు. ఏడాది క్రితం వ్యాక్సిన్లపై సందిగ్ధత ఉండేదని తెలిపారు. కానీ, ఇప్పుడు ఓకే రోజు లక్షల మందికి దేశీయంగా తయారు చేసిన టీకాలను ఉచితంగా అందజేయగలుగుతున్నామని తెలిపారు.
* వ్యాక్సిన్పై గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కల్పించాలని కోరారు. గ్రామాల్లో ప్రతిఒక్కరూ టీకా తీసుకోవాలని కోరారు. మహమ్మారిపై పోరులో నిరంతర పోరాటం కొనసాగాలన్నారు. అప్పుడే విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
* వర్షాకాలం నేపథ్యంలో వర్షపు నీటిని ఒడిసిపట్టడానికి ఉన్న ప్రాముఖ్యతను మోదీ గుర్తుచేశారు. భూగర్భ జల మట్టాలు పెరగాలంటే నీటిని ఒడిసిపట్టాలని పిలుపునిచ్చారు. దీన్ని ఒకరకమైన సేవగా, బాధ్యతగా భావించాలన్నారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల్లో ఈ మేరకు కొనసాగుతున్న కృషిని ప్రధాని ప్రస్తావించారు.
* మన వృక్ష సంపదలో ఉన్న ఔషధ గుణాలకు సంబంధించిన సమాచారం కరోనా మూలంగా ఒక్కోటి వెలుగులోకి వస్తున్నట్లు మోదీ తెలిపారు. నైనిటాల్కు చెందిన ఓ వ్యక్తి ‘గిలోయ్’ అనే మొక్కలో ఉన్న ఔషధ విలువలను ప్రస్తావిస్తూ తనకు లేఖ రాసినట్లు తెలిపారు. ఆ మొక్క ప్రాశస్త్యాన్ని మన్ కీ బాత్ సందర్భంగా ప్రతిఒక్కరికీ తెలపాలని కోరినట్లు పేర్కొన్నారు.
* జులై 1న ‘డాక్టర్స్ డే’, ‘చార్టెడ్ అకౌంటెంట్స్ డే’ నేపథ్యంలో ఆ రంగంలో సేవలందిస్తున్న వారందరికీ మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు.
* కరోనాతో ఇటీవల మరణించిన కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి గురుప్రసాద్ మొహపాత్ర సేవల్ని ఈ సందర్భంగా మోదీ గుర్తుచేసుకున్నారు. కరోనా సోకినప్పటికీ.. చికిత్స తీసుకుంటూనే విధులు నిర్వర్తించారని తెలిపారు. దేశంలో ప్రతి మూలకు ఆక్సిజన్ చేర్చేందుకు విశేష కృషి చేశారన్నారు. విశ్రాంతి తీసుకోమని ఎన్నిసార్లు చెప్పినా.. ఆక్సిజన్పై జరిగిన ప్రతి సమీక్షలో గురుప్రసాద్ వర్చువల్గా పాల్గొన్నారని మోదీ గుర్తుచేసుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజకీయ ఒత్తిళ్లతో న్యాయవ్యవస్థకు ముప్పు.. సీజేఐకి 600 మంది లాయర్ల లేఖ
Lawyers letter to CJI: సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్కు 600 మంది ప్రముఖ న్యాయవాదులు లేఖ రాశారు. కొందరు స్వార్థమూకలు న్యాయవ్యవస్థను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. -
టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం.. చికిత్స పొందుతూ ఎంపీ కన్నుమూత
Erode MP Ganeshamurthi Suicide: టికెట్ రాలేదన్న మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేసిన ఈరోడ్ ఎంపీ.. చికిత్స పొందుతూ గురువారం కన్నుమూశారు. -
కసబ్ను పట్టుకున్న సదానంద్ దాతెకు ఎన్ఐఏ పగ్గాలు
‘ఉగ్రవాద వ్యతిరేక దళం’ అధిపతిగా ఉన్న సదానంద్ వసంత్ దాతెను ‘జాతీయ దర్యాప్తు సంస్థ’ (ఎన్ఐఏ) డైరెక్టర్ జనరల్గా నియమిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీచేసింది. -
ఆ డబ్బు ఎక్కడుందో కేజ్రీవాల్ నేడు చెబుతారు
మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో తన భర్త, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో ఆయన సతీమణి సునీత బుధవారం సంచలన ప్రకటన చేశారు. -
నాలుగు చిలుకలకు రూ.444 టికెట్!
స్వేచ్ఛగా విహరించాల్సిన చిలుకలు బస్సులో ప్రయాణించిన కారణంగా వందల రూపాయలతో టికెట్ తీసుకోవాల్సి వచ్చింది. -
రాష్ట్రపతి పాలన విధిస్తే.. అది రాజకీయ ప్రతీకారమే
ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో దేశ రాజధాని దిల్లీలో రాష్ట్రపతి పాలన విధిస్తే అది రాజకీయ ప్రతీకారమే అవుతుందని దిల్లీ మంత్రి ఆతిశీ పేర్కొన్నారు. -
కేరళ సీఎం కుమార్తెపై ఈడీ కేసు నమోదు
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుమార్తె వీణా విజయన్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. -
‘ఎయిరిండియా’ రెక్కలను ఢీకొన్న ఇండిగో
చెన్నై వెళ్లేందుకు సిద్ధమై రన్వే క్లియరెన్సు కోసం ఆగి ఉన్న ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానం రెక్కలను దర్భంగా (బిహార్)కు బయలుదేరుతున్న ఇండిగో ఎయిర్క్రాఫ్ట్ ఢీకొంది. -
చివరి ఓటరునూ చేరుకోవాలని!
దేశంలోని ప్రతి ఓటరూ తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎన్నికల సంఘం భగీరథ ప్రయత్నమే చేస్తుంది. ఓటర్లు ఎక్కడ ఉన్నా వారి కోసం పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది. -
హుక్కా బార్లో సోదాలు.. పోలీసుల అదుపులో బిగ్బాస్ విజేత మునావర్ ఫారూకీ
ప్రముఖ స్టాండప్ కమెడియన్, హిందీ బిగ్బాస్-17 విజేత మునావర్ ఫారూకీ మరోసారి వివాదంలో నిలిచారు. -
ఇలా ప్రవేశం.. అలా ఆమోదం
దేశానికి, ప్రజలకు అవసరమయ్యే శాసనాలు సమర్థవంతంగా, లోపరహితంగా ఉండటం ఎంతైనా అవసరం. అంతటి ప్రాధాన్యం ఉంది కనుకే చట్టసభల్లో వాటిపై విస్తృతమైన చర్చలు, సంప్రదింపులు జరుపుతుంటారు. -
రూ.245 కోట్ల డ్రగ్స్ స్వాధీనం
మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో ముంబయి పోలీసులు భారీగా మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు. -
మహువా, హీరానందానీలకు మళ్లీ ఈడీ సమన్లు
విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) ఉల్లంఘన కేసులో టీఎంసీ నేత మహువా మొయిత్రా, దుబాయ్ వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీలకు బుధవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మళ్లీ సమన్లు జారీ చేసింది. -
ఈడీ సోదాల కోసమో, పోలీసులను చూసో ప్రవర్తన మారకూడదు
ప్రజల ప్రవర్తనలో మార్పు ఈడీ సోదాల కోసమో, పోలీసులను చూసో రాకూడదని, అది మనసులో నుంచి వివేకంతో రావాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ స్పష్టం చేశారు. -
మనీలాండరింగ్ పరిధిలోకి రాని నేరానికి ఆ చట్టాన్ని వర్తింపజేయలేం
ఒక వ్యక్తిపై మోపిన నేరపూరిత కుట్ర అభియోగాలు మనీలాండరింగ్ చట్టం పరిధిలోకి రానట్లయితే...సదరు నిందితుడిపై ‘ఐపీసీ సెక్షన్ 120బి’ని మోపి పీఎంఎల్ఏ కింద కేసు నమోదు చేయరాదని సర్వోన్నత న్యాయస్థానం మరోసారి స్పష్టం చేసింది. -
ఆసుపత్రి నుంచి సద్గురు డిశ్ఛార్జ్
ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సద్గురు జగ్గీ వాసుదేవ్ ఆసుపత్రి నుంచి బుధవారం డిశ్ఛార్జ్ అయ్యారు. ఈ విషయాన్ని ఈశా ఫౌండేషన్ ఓ ప్రకటనలో తెలిపింది. -
డ్రగ్స్ జప్తు కేసులో మాజీ ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్ను దోషిగా తేల్చిన కోర్టు
కస్టడీ మరణం కేసులో ఇప్పటికే జీవిత ఖైదు శిక్షను అనుభవిస్తున్న మాజీ ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్ను న్యాయస్థానం మరో నేరంలో దోషిగా నిర్ధారించింది. -
నేపాల్ మేయర్ కుమార్తె ఆచూకీ లభ్యం
గోవాలో రెండ్రోజుల క్రితం అదృశ్యమైన నేపాల్లోని ధన్గఢీ నగర మేయర్ కుమార్తె ఆర్తీ హమాల్(36) ఆచూకీ బుధవారం లభ్యమైంది. -
నా దగ్గర అంత డబ్బు లేదు.. అందుకే పోటీ చేయట్లేదు: నిర్మలా సీతారామన్
ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవసరమైన నిధులు తన వద్ద లేవని.. అందుకే పార్టీ ప్రతిపాదనను తిరస్కరించానని ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. -
26/11 హీరో సదానంద్ వసంత్ దాటేకు ఎన్ఐఏ పగ్గాలు
కేంద్ర దర్యాప్తు సంస్థ నూతన అధిపతిగా సదానంద్ వసంత్ దాటే నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. -
ఈ మూడు విషయాలే ఆరోగ్యకర జీవన రహస్యం.. డాక్టర్ ఫార్ములా షేర్ చేసిన హర్ష గోయెంకా
ఆరోగ్యకరమైన జీవనానికి ఏం చేయాలో ఓ డాక్టర్ చెబుతున్న సీక్రెట్ ఫార్ములా వీడియోను హర్ష గోయెంకా ఎక్స్లో షేర్ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
జగన్.. ఈ 7 ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా?: చంద్రబాబు సవాల్
-
సూచీల దూకుడు.. 900+ పాయింట్ల లాభంలో సెన్సెక్స్.. కారణమేంటి?
-
వరుస ఫ్లాప్స్ వల్లే రాజకీయాల్లోకి అడుగుపెట్టారా: కంగన సమాధానం ఏమిటంటే..?
-
రషీద్ బౌలింగ్లో సిక్స్లు.. ధోనీ సలహాలు పాటించా: సమీర్ రిజ్వీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
గూగుల్ కృత్రిమ మేధ నిపుణులకు జుకర్బర్గ్ గాలం?