Modi: సిరిసిల్ల నేతన్నకు ప్రధాని ప్రశంస.. మన్ కీ బాత్లో కొనియాడిన మోదీ
నెలవారీ మన్ కీ బాత్లో భాగంగా తెలంగాణకు చెందిన సిరిసిల్ల నేతన్న యెల్ది హరిప్రసాద్ను ప్రధాని మోదీ ప్రత్యేకంగా కొనియాడారు. ఆయన జీ-20 లోగోను మగ్గంపై నేసి పంపినట్లు తెలిపారు.
దిల్లీ: జీ20 కూటమికి నేతృత్వం వహించడం భారత్కు దక్కిన గౌరవమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఇకపై కూటమిలో మనదేశ పాత్ర ఎంతో కీలకం కానుందన్నారు. ఈ సందర్భంగా సిరిసిల్ల జిల్లాకు చెందిన నేతన్న యెల్ది హరిప్రసాద్ తనకు ఓ బహుమతి పంపినట్లు తెలిపారు. జీ-20కి భారత్ నేతృత్వం వహించనున్న నేపథ్యంలో ఆయన ప్రత్యేకంగా జీ-20లోగోను మగ్గంపై నేసి తనకు పంపినట్లు వెల్లడించారు. అలాగే చేనేత పరిశ్రమ గురించి అనేక సూచనలు చేసినట్లు పేర్కొన్నారు. ప్రతినెలా చివరి ఆదివారం తన మనసులోని ఆలోచనల్ని ప్రజలతో పంచుకునే ప్రత్యేక కార్యక్రమం ‘మన్ కీ బాత్’లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
‘‘మిత్రులారా, ఈరోజు ప్రసంగాన్ని నాకు అందిన ఓ ప్రత్యేక బహుమతి గురించి ప్రస్తావిస్తూ ప్రారంభిస్తున్నాను. తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో యెల్ది హరిప్రసాద్ అనే నేతన్న ఉన్నారు. స్వహస్తాలతో నేసిన జీ20 లోగోను ఆయన నాకు పంపారు. ఆ అద్భుతమైన బహుమతిని చూసి నేను ఆశ్చర్యపోయాను. ఆయన తన నైపుణ్యంతో అందరినీ ఆకట్టుకుంటున్నారు. హరిప్రసాద్ నాకు ఓ లేఖ కూడా పంపారు. జీ20కి భారత్ నేతృత్వం వహించడం మనందరికీ గర్వకారణమన్నారు. తన తండ్రి నుంచి హరిప్రసాద్ ఈ నైపుణ్యాన్ని అందుకున్నారు’’ అని ప్రధాని మోదీ ప్రత్యేకంగా తెలుగువ్యక్తి హరిప్రసాద్ గురించి ప్రస్తావించడం విశేషం.
మరోవైపు జీ-20 సభ్యదేశాలతో వ్యాపార సంబంధాలున్న రాష్ట్రాలతో ప్రత్యేకంగా చర్చలు జరుపుతామని మోదీ తెలిపారు. అంతరిక్ష ప్రయోగాల్లో భారత్ మరిన్ని విజయాలు సాధిస్తోందని ఈ సందర్భంగా కొనియాడారు. మరోవైపు డ్రోన్ల వినియోగం సైతం విస్తరిస్తోందని తెలిపారు. హిమాచల్ప్రదేశ్లోని కినోర్లో డ్రోన్ల ద్వారా ఆపిళ్లను సరఫరా చేస్తున్నట్లు పేర్కొన్నారు. యువత సరికొత్త ఆవిష్కరణలతో ముందుకొస్తున్నారని ప్రశంసించారు. ఇండియన్ మ్యూజిక్ గ్రంథానికి ప్రపంచవ్యాప్తంగా మంచిపేరొచ్చిందని తెలిపారు. భారతీయ సంగీత పరికరాలను అనేక దేశాల్లో విక్రయిస్తున్నారన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.