
Jaishankar: ఆపరేషన్ గంగలో అత్యంత సవాలుగా నిలిచింది అదే..!
దిల్లీ: రష్యా దాడి కారణంగా ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన భారతీయుల కోసం కేంద్రం అత్యంత సవాలుతో కూడిన తరలింపు ప్రక్రియను చేపట్టిందని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ అన్నారు. ఈ మేరకు మంగళవారం పార్లమెంట్లో తరలింపు ప్రక్రియ గురించి వివరించారు.
‘రష్యా, ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రం అవుతోన్న సమయంలోనే.. ఉక్రెయిన్లోని భారత రాయబార కార్యాలయం జనవరిలో భారతీయుల కోసం రిజిస్ట్రేషన్ డ్రైవ్ను ప్రారంభించింది. దాని కింద దాదాపు 20,000 మంది భారతీయులు నమోదు చేసుకున్నారు. అక్కడి పరిస్థితుల గురించి మార్గదర్శకాలు జారీ చేస్తున్నప్పటికీ.. చాలామంది అక్కడే ఉండటానికి మొగ్గుచూపారు. స్వదేశానికి రావడం వల్ల తమ విద్యకు ఆటంకం కలుగుతుందనే ఆలోచనే వారిని ఆపింది. అది సహజం’ అని జైశంకర్ చెప్పారు. మనవారు ఉక్రెయిన్లో వివిధ ప్రాంతాల్లో ఉండటం వల్ల రవాణా ప్రక్రియ సంక్లిష్టంగా మారిందన్నారు. అలాగే శరణార్థుల కారణంగా సరిహద్దు ప్రాంతాలు కిక్కిరిసిపోయిన విషయాన్ని గుర్తు చేశారు. ఇవన్నీ పౌరుల తరలింపును సవాలుగా మార్చాయన్నారు.
‘ఈ క్రమంలో ప్రధాని మోదీ ఇచ్చిన ఆదేశాల మేరకు మేం ఆపరేషన్ గంగను ప్రారంభించాం. వైమానిక దాడులు, షెల్లింగ్ జరుగుతోన్న సమయంలో మేం ఈ ఆపరేషన్ నిర్వహించాం. అంతేగాకుండా ఉక్రెయిన్, రష్యానే కాకుండా అక్కడి సరిహద్దు దేశాల విదేశాంగ మంత్రులతో నిత్యం సంప్రదింపులు జరిపాం. ఈ మొత్తంలో ఖర్కివ్, సుమీలో చిక్కుకుపోయిన విద్యార్థుల్ని తరలించమే అత్యంత సవాలుగా నిలిచింది. వారిని సురక్షితంగా తీసుకువచ్చేందుకు ప్రధాని ఇరు దేశాలకు చెందిన అధ్యక్షులతో మాట్లాడిన విషయాన్ని గుర్తుచేశారు. వీటన్నింటి మధ్య 22,500 మంది పౌరుల్ని తిరిగి తీసుకువచ్చాం’ అని మంత్రి తెలిపారు
అలాగే తూర్పు ఉక్రెయిన్లో షెల్లింగ్లో మరణించిన భారత విద్యార్థి నవీన్ శేకరప్ప మృతదేహాన్ని తీసుకువచ్చేందుకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందని మంత్రి తెలిపారు. ఇక ఆ దేశంలో గాయపడిన హర్జోత్ సింగ్ గురించి ప్రస్తావించారు. అతడి తరలింపులో ప్రత్యేక శ్రద్ధ వహించడంతో, వైద్య ఖర్చులు చూసుకున్నామని చెప్పారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
NIA: హైదరాబాద్ పాతబస్తీలో ఎన్ఐఏ సోదాలు
-
General News
Kiren Rijiju: ‘బాటిల్ క్యాప్ ఛాలెంజ్’లో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు.. వీడియో చూశారా?
-
Movies News
Regina Cassandra: ఆ విషయంలో చిరంజీవిని మెచ్చుకోవాల్సిందే: రెజీనా
-
Sports News
IND vs ENG: టీమ్ఇండియా ఓటమిపై రాహుల్ ద్రవిడ్ ఏమన్నాడంటే?
-
General News
Goats milk: మేక పాలతో మేలెంతో తెలుసా..?
-
Crime News
Jharkhand: బీటెక్ విద్యార్థినిపై లైంగిక వేధింపులు.. IAS అధికారి అరెస్టు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- IND vs ENG: టీమ్ఇండియా ఓటమిపై రాహుల్ ద్రవిడ్ ఏమన్నాడంటే?
- Kaali: ముదురుతున్న ‘కాళీ’ వివాదం.. దర్శకురాలు, నిర్మాతలపై కేసులు
- RRR: ‘ఆర్ఆర్ఆర్.. గే లవ్ స్టోరీ’.. రసూల్ కామెంట్పై శోభు యార్లగడ్డ ఫైర్
- IAF: యుద్ధ విమానాన్ని కలిసి నడిపిన తండ్రీకూతుళ్లు.. దేశంలోనే తొలిసారి!
- PV Sindhu: ‘రిఫరీ తప్పిదం’తో సింధూకు అన్యాయం.. క్షమాపణలు చెప్పిన కమిటీ
- Regina Cassandra: ఆ విషయంలో చిరంజీవిని మెచ్చుకోవాల్సిందే: రెజీనా
- Shruti Haasan: ఆ వార్తలు నిజం కాదు.. శ్రుతిహాసన్
- NIA: హైదరాబాద్ పాతబస్తీలో ఎన్ఐఏ సోదాలు
- Jharkhand: బీటెక్ విద్యార్థినిపై లైంగిక వేధింపులు.. IAS అధికారి అరెస్టు
- NTR Fan Janardhan: జూ.ఎన్టీఆర్ వీరాభిమాని జనార్దన్ కన్నుమూత