Corona: మహమ్మారికి 1500 మంది వైద్యులు బలి
కరోనా సమయంలో రోగులకు ఎల్లవేళలా సేవలందించిన వైద్యుల్లో చాలామంది మహమ్మారి బారిన పడ్డారు. వైరస్ దేశంలోకి ప్రవేశించినప్పటి నుంచి ఇప్పటివరకు 1500 మందికి పైనే వైద్యులను కొవిడ్ బలి తీసుకుంది.
దిల్లీ: కరోనా సమయంలో రోగులకు ఎల్లవేళలా సేవలందించిన వైద్యుల్లో చాలామంది మహమ్మారి బారిన పడ్డారు. వైరస్ దేశంలోకి ప్రవేశించినప్పటి నుంచి ఇప్పటివరకు 1500 మందికి పైనే వైద్యులను కొవిడ్ బలి తీసుకుంది. ఈ మేరకు భారత వైద్య మండలి(ఐఎంఏ) గణాంకాలు వెల్లడించాయి.
కరోనా రెండో దశ ఉద్ధృతిలో ఇప్పటివరకు 776 మంది వైద్యులు ప్రాణాలు కోల్పోయినట్లు ఐఎంఏ తెలిపింది. అత్యధికంగా బిహార్లో 115 మంది డాక్టర్లు కొవిడ్తో మరణించారు. ఆ తర్వాత దిల్లీలో 109 మంది, ఉత్తర్ ప్రదేశ్లో 79, పశ్చిమ్ బెంగాల్లో 62, రాజస్థాన్లో 43, ఝార్ఖండ్లో 39, ఆంధ్రప్రదేశ్లో 38 మంది వైద్యులు మృతి చెందినట్లు పేర్కొంది. రెండో దశలో ఎనిమిది మంది గర్భిణులైన డాక్టర్లు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికే తొలి దశలో 748 మంది డాక్టర్లను మహమ్మారి పొట్టన పెట్టుకుంది.
అయితే మరణాల సంఖ్య ఇంకా ఎక్కువే ఉండొచ్చని వైద్య మండలి భావిస్తోంది. ఎందుకంటే.. ఐఎంఏ రికార్డుల ప్రకారం 3.5 లక్షల మంది డాక్టర్లు మాత్రమే ఇందులో సభ్యులుగా ఉండగా.. దేశవ్యాప్తంగా 12 లక్షలకు పైనే వైద్యులు ఉన్నారు. మరోవైపు వైద్యులు పూర్తి స్థాయిలో టీకాలు తీసుకోకపోవడం అధిక మరణాలకు దారితీస్తుండొచ్చని ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ జేఏ జయలాల్ గతంలో అభిప్రాయపడ్డారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
TSPSC: ఉద్యోగ నియామక పరీక్షల తేదీలు వెల్లడించిన టీఎస్పీఎస్సీ
-
Sports News
Pak Cricket: భారత్ మోడల్కు తొందరేం లేదు.. ముందు ఆ పని చూడండి.. పాక్కు మాజీ ప్లేయర్ సూచన
-
General News
Taraka Ratna: విషమంగానే తారకరత్న ఆరోగ్యం: వైద్యులు
-
Movies News
Yash: రూ. 1500 కోట్ల ప్రాజెక్టు.. హృతిక్ వద్దంటే.. యశ్ అడుగుపెడతారా?
-
India News
Gorakhnath: గోరఖ్నాథ్ ఆలయంలో దాడి.. ముర్తజా అబ్బాసీకి మరణశిక్ష
-
Politics News
KTR: రాజ్భవన్లో రాజకీయ నాయకుల ఫొటోలు సరికాదు: కేటీఆర్