
Covid: 40% జిల్లాల్లో 20% పాజిటివిటీ రేటు
అరుణాచల్ ప్రదేశ్లోని ఓ జిల్లాలో 91.5 శాతం
దిల్లీ: దేశంలో కరోనా వైరస్ విలయం సృష్టిస్తోంది. నగరాలు, పట్టణాల నుంచి పల్లెలకు తీవ్రస్థాయిలో వ్యాపిస్తోంది. ప్రస్తుతం దేశంలోని 40 శాతం జిల్లాల్లో 20 శాతానికి పైగానే పాజిటివిటీ రేటు ఉన్నట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. మొత్తంగా 741 జిల్లాలకు గానూ 301 జిల్లాల్లో మే 1 నుంచి 20 శాతానికి పైగానే పాజిటివిటీ రేటు నమోదవుతున్నట్లు పేర్కొంది. కాగా వీటిల్లోని 15 జిల్లాల్లో 50 శాతానికి పైగానే పాజిటివిటీ రేటు ఉన్నట్లు తెలిపింది. హరియాణాలో నాలుగు, అరుణాచల్ ప్రదేశ్లో రెండు, రాజస్థాన్లో రెండు జిల్లాలు సహా ఇతర రాష్ట్రాల్లోని మరో 7 జిల్లాల్లో సగానికిపైగానే పాజిటివిటీ రేటు ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ పేర్కొంది. కాగా ఇవన్నీ దాదాపు రూరల్ జిల్లాలేనని వెల్లడించింది. అనేక గ్రామీణ ప్రాంతాల్లో సరైన పరీక్షలు లేని కారణంగా కేసులు బయటపడటం లేదని తెలిపింది.
అరుణాచల్ ప్రదేశ్లోని చంగ్లాంగ్ జిల్లాలో అత్యధికంగా 91.5 శాతం పాజిటివిటీ రేటు ఉందని, ఇదే రాష్ట్రంలోని దిబాన్ వ్యాలీతోపాటు.. పుదుచ్చేరిలోని యానాం, రాజస్థాన్లోని బికనీర్, పాలీ జిల్లాల్లో అత్యధిక పాజిటివిటీ రేటు నమోదవుతున్నట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. కేరళలోని 14 జిల్లాలకు గాను 13 జిల్లాల్లో 20 శాతానికిపైగా పాటిజివిటీ రేటు నమోదువుతోంది. హరియాణాలోని 22 జిల్లాలకు గాను 19, పశ్చిమ బెంగాల్లోని 23కి 19, దిల్లీలోని 11కి 9, కర్ణాటకలోని 31కి 24 జిల్లాల్లో పాజిటివిటీ రేటు 20 శాతానికిపైగానే ఉంది.
పలు రాష్ట్రాల్లో సంపూర్ణ లాక్డౌన్, మరికొన్ని రాష్ట్రాల్లో పాక్షిక లాక్డౌన్, రాత్రి కర్ఫ్యూ విధిస్తున్నా.. కేసుల్లో తగ్గుదల కనిపించడం లేదు. కొద్ది రోజులుగా దేశంలో 4 లక్షలకుపైగానే కేసులు నమోదవుతున్నాయి. మరణాలు కూడా భారీ స్థాయిలో ఉంటున్నాయి. శనివారం 4,03,738 మంది వైరస్ బారిన పడగా.. 4,092 మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా మొత్తంగా దేశంలో ఇప్పటివరకు 2,42,362 మంది మహమ్మారికి బలయ్యారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
MS DHONI: రూ.40తో చికిత్స చేయించుకున్న ధోనీ.. ఎందుకో తెలుసా..?
-
Politics News
Telangana News: నేడు హైదరాబాద్కు సిన్హా.. నగరంలో తెరాస భారీ ర్యాలీ
-
Movies News
Raashi Khanna: యామినిగా నేను ఎవరికీ నచ్చలేదు: రాశీఖన్నా
-
Politics News
BJP: భాజపా పదాధికారుల సమావేశాలను ప్రారంభించిన నడ్డా
-
Business News
Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నారా? ఇవి ముందే చూసుకోండి!
-
India News
India Corona: 4 శాతానికి పైగా పాజిటివిటీ రేటు..!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Vishal: కుప్పంలో చంద్రబాబుపై పోటీ .. నటుడు విశాల్ క్లారిటీ!
- చిన్న బడ్జెట్.. సొంత గూడు
- Rishabh Pant : అతనే.. ఆపద్బాంధవుడు
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (02-07-2022)
- తెదేపాలో చేరితే రూ.30 కోట్లు ఇస్తామన్నారు
- Russia: ముప్పేట దాడులు తాళలేకే?.. స్నేక్ ఐలాండ్ను విడిచిన రష్యా
- IND vs ENG : పంత్ ఒక్కడు ఒకవైపు..
- Andhra News: నా చొక్కా, ప్యాంట్ తీసేయించి మోకాళ్లపై కూర్చోమన్నారు.. సాంబశివరావు ఆవేదన
- Naresh: ఆమె నా జీవితాన్ని నాశనం చేసింది: నరేశ్.. ఒక్క రూపాయీ తీసుకోలేదన్న రమ్య
- Udaipur murder: దర్జీ హత్యకేసులో మరో సంచలన కోణం.. బైక్ నంబర్ ప్లేట్ ఆధారంగా దర్యాప్తు!