నావల్నీకి జైలు శిక్ష.. భగ్గుమన్న రష్యా!
రష్యాలో ప్రతిపక్ష నాయకుడు అలెక్సీ నావల్నీకి మాస్కో కోర్టు రెండున్నరేళ్ల జైలు శిక్ష విధించింది. గతంలో రద్దు చేసిన శిక్షకు సంబంధించిన షరతులను ఉల్లంఘింనిన నేపథ్యంలో ఈ శిక్ష విధిస్తున్నామని తెలిపింది.........
తీర్పుని ఖండించిన పాశ్చాత్య దేశాలు
మాస్కో: రష్యాలో ప్రతిపక్ష నాయకుడు అలెక్సీ నావల్నీకి మాస్కో కోర్టు రెండున్నరేళ్ల జైలు శిక్ష విధించింది. గతంలో రద్దు చేసిన శిక్షకు సంబంధించిన షరతులను ఉల్లంఘించిన నేపథ్యంలో ఈ శిక్ష విధిస్తున్నామని తెలిపింది. అలెక్సీ నావల్నీపై గత ఆగస్టులో స్వదేశంలోనే విష ప్రయోగం జరిగిన విషయం తెలిసిందే. జర్మనీలో దాదాపు ఐదు నెలలు చికిత్స పొందిన అనంతరం జనవరి 17న రష్యా చేరుకున్నారు. పోలీసులు ఆయన్ని విమానాశ్రయంలోనే అదుపులోకి తీసుకున్నారు.
మరోవైపు తనపై వస్తున్న ఆరోపణలన్నీ అధికార పార్టీ కల్పితాలని నావల్నీ ఆరోపించారు. కోర్టు తీర్పు అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. అధ్యక్షుడు పుతిన్ను ‘లోదుస్తుల్లో విషం పెట్టే వ్యక్తి’గా అభివర్ణించారు. తనపై విషప్రయోగం పుతిన్ కుట్రేనని ఆరోపించారు. కోర్టు మంగళవారం ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా తాము అప్పీలు చేస్తామని నావల్నీ తరఫు న్యాయవాది తెలిపారు.
నావల్నీకి మద్దతుగా రాజధాని మాస్కో సహా రష్యావ్యాప్తంగా లక్షలాది మంది నిరసన ప్రదర్శనలు చేపట్టారు. కొన్ని చోట్ల ఆందోళనకారులు, భద్రతా బలగాలకు మధ్య తీవ్ర ఘర్షణలు చోటుచేసుకున్నాయి. దీంతో పోలీసులు వేలాది మంది ఆందోళనకారుల్ని అదుపులోకి తీసుకున్నారు. నావల్నీకి శిక్ష విధించటం పట్ల అంతర్జాతీయంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మాస్కో కోర్టు తీర్పుతో విశ్వసనీయత ఓడిందని ఐరోపా ఖండంలో ప్రధాన మానవ హక్కుల సంస్థ ‘కౌన్సిల్ ఆఫ్ యూరప్’ అభిప్రాయపడింది. ఈ తీర్పుని అత్యంత ఘోరమైనదిగా బ్రిటన్ విదేశాంగ మంత్రి డొమినిక్ రాబ్ అభివర్ణించారు. పౌరుల స్వేచ్ఛకు, చట్టబద్ధమైన పాలనకు ఈ తీర్పు వ్యతిరేకంగా ఉందని జర్మనీ విదేశాంగ మంత్రి హీకో మాస్ వ్యాఖ్యానించారు. నావల్నీని బేషరతుగా తక్షణమే విడుదల చేయాలని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటొనీ బ్లింకెన్ డిమాండ్ చేశారు. రష్యా తన పౌరుల హక్కులను కాపాడటంలో విఫలమైందంటూ.. ఈ విషయంలో ఆ దేశాన్ని బాధ్యురాలిని చేయటానికి మిత్రదేశాలతో కలిసి పనిచేస్తానని చెప్పారు.
ఇవీ చదవండి..
డేనియల్ పెర్ల్ హత్య కేసు ప్రధాన నిందితుడికి జైలు నుంచి స్వేచ్ఛ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.