Mossad operation: రోబో.. ఆ అణుశాస్త్రవేత్త హంతకుడు..!
పక్కా ప్లానింగ్.. అంగుళం కూడా తేడా రాని గురి.. నిమిషంలో టార్గెట్ను మట్టుపెట్టి.. ఒక్క ఆధారం కూడా లభించకుండా అదృశ్యమైపోవడం.. ఇది ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొస్సాద్ స్టైల్..! గతేడాది ఇరాన్ టాప్ న్యూక్లియర్ సైంటిస్టు మొసిన్ ఫక్రిజాదె హత్య విషయంలో ఇజ్రాయెల్ ప్లానింగ్
నిర్ఘాంతపోయిన ప్రపంచం
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
పక్కా ప్లానింగ్.. అంగుళం కూడా తేడా రాని గురి.. నిమిషంలో టార్గెట్ను మట్టుపెట్టి.. ఒక్క ఆధారం కూడా లభించకుండా అదృశ్యమైపోవడం.. ఇది ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొస్సాద్ స్టైల్..! గతేడాది ఇరాన్ టాప్ న్యూక్లియర్ సైంటిస్టు మొసిన్ ఫక్రిజాదె హత్య విషయంలో ఇజ్రాయెల్ ప్లానింగ్ బాహ్య ప్రపంచాన్ని షాక్కు గురిచేసింది. కొన్ని వేల కిలోమీటర్ల అవతల నుంచి అంగుళం కూడా తేడా రాకుండా ప్రత్యర్థిని గురిపెట్టి వేటాడింది మొస్సాద్..! తాజాగా ఆ విషయాన్ని న్యూయార్క్ టైమ్స్ పత్రిక తన కథనంలో వెల్లడించింది.
అదునుకోసం మాటు వేసి..
అణ్వాయుధ తయారీలో యురేనియం ప్రధాన ఇంధనం. భూమి నుంచి వెలికితీసిన రూపంలో దీనిని వాడరు. శుద్ధిచేయాల్సి ఉంటుంది. ఇలా శుద్ధి చేసి ఆయుధ గ్రేడు యూరేనియం తయారీ కార్యక్రమానికి ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ పెట్టిన పేరు ‘గ్రీన్సాల్ట్ ప్రాజెక్టు’. దీనినే ‘ప్రాజెక్టు1-11’ అని కూడా అంటారు. ఇక్కడే క్షిపణుల వార్హెడ్లను కూడా తయారు చేస్తారు. ఈ మొత్తం ప్రాజెక్టులో ఫక్రిజాదె కీలకమైన వ్యక్తి. ఆయన 14 ఏళ్ల నుంచి ఇరాన్ అణ్వాయుధ కార్యక్రమాన్ని నడిపిస్తున్నారు. ఆయన మొస్సాద్ హిట్లిస్ట్లో ఉన్న విషయం ఇరాన్ ఎప్పుడో పసిగట్టింది. దీంతో ఆయనకు దేశంలోనే అత్యంత శక్తిమంతమైన రివల్యూషనరీ గార్డ్స్ రక్షణ కల్పించింది. బుల్లెట్ ప్రూఫ్ కారును సమకూర్చింది.
ఫక్రిజాదెకు ఇవేవీ పెద్దగా ఇష్టంలేదు. చిన్నచిన్న సంతోషాలు తీర్చుకోవడానికి ఆయన చాలా తాపత్రయపడతారు. వారాంతాల్లో కాస్పియన్ సముద్రం వద్ద కుటుంబంతో గడపడం.. అబ్సార్డ్ అనే ఊళ్లో సమయం గడపడం ఇష్టం. చాలా సార్లు తన నిస్సాన్ టియాన కారులో ఎటువంటి భద్రత లేకుండా డ్రైవ్కు వెళుతుంటారు. గతేడాది నవంబర్ 27వ తేదీ మధ్యాహ్నం తన కారులో అబ్సార్డ్ పట్టణానికి బయల్దేరారు. ఫక్రిజాదె డ్రైవింగ్ సీట్లో కూర్చోగా.. ఆయన భార్య ప్యాసింజర్ సీట్లో కూర్చున్నారు. ఆయన సెక్యూరిటీ సిబ్బంది వేరే వాహనాల్లో ఆయన్ను అనుసరించారు.
ఫక్రిజాదె తన గమ్యస్థానానికి వెళ్లే మార్గంలో ఒక యూటర్న్ ఉంది. అదే సమయంలో ఆయన కాన్వాయ్లోని ముందు కారు కొంచెం వేగంగా ఫక్రిజాదె దిగాల్సిన ఇంటిని తనిఖీ చేసేందుకు వెళ్లిపోయింది. యూటర్న్ తీసుకొని పావు మైలు ప్రయాణించాక నిమిషం వ్యవధిలో మూడు విడతలుగా కాల్పులు జరిగాయి. దీంతో కారు డోరు తెరుచుకొని ఆయన రోడ్డుపై పడిపోయారు. ఆయనకు రక్షణగా ఉన్న సిబ్బందికి ఏమీ అర్థం కాలేదు. ఇంతలోనే సమీపంలోని ఒక జామ్యాద్ ట్రక్ భారీ శబ్దంతో పేలిపోయింది. తర్వాత ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ వైఫల్యం బయటకు తెలియనీయకుండా దుండగులు వచ్చి కాల్పులు జరిపినట్లు ప్రచారం జరిగింది.
పక్కా లెక్కతో రోబో..!
ఫక్రిజాదె హత్యకు వాడిన కిల్లర్ రోబో తయారీ, తరలింపు విషయంలో ఇజ్రాయెల్ పక్కా ప్రణాళికతో వ్యవహరించింది. ఇజ్రాయెల్ ఏదైనా దాడికి పథకం రచిస్తే.. దానిని అమలు చేసిన వారి ప్రాణాలు పోకుండా ఉండేలా చూస్తుంది. దాడిచేసిన ఇజ్రాయెల్ ఏజెంట్లు చనిపోతారనుకుంటే అసలు ఆ ప్లాన్నే చెత్తబుట్టలో పారేస్తుంది. ఇరాన్కు వెళ్లి అత్యంత భద్రత మధ్య ఉండే ఫక్రిజాదెను అంతం చేయడం ఇజ్రాయెల్ ఏజెంట్ల ప్రాణాలకు ముప్పు. దీంతో రోబో, కృత్రిమ మేథను వాడి దాడి చేయాలని నిర్ణయించుకొంది.
దాడి కోసం బెల్జియంలో తయారు చేసిన ‘ఎఫ్ఎన్ మాగ్’ మిషిన్ గన్ను ఎంపిక చేసుకొంది. ఈ రైఫిల్.. నిమిషానికి 600 తూటాలను కాల్చగలదు. దానికి అత్యాధునిక రోబోటిక్ పరికరాలను అమర్చింది. కానీ, ఈ కిల్లర్ రోబో బరువు దాదాపు టన్ను వచ్చింది. దీంతో దానిని మొత్తం విడగొట్టి.. వివిధ మార్గాల ద్వారా పలువిడతలుగా ఇరాన్లోకి చేర్చి అసెంబ్లింగ్ చేసింది.
ఈ రోబోను అమర్చడానికి జామ్యాద్ పికప్ ట్రక్ను ఎంపిక చేసింది. ఎందుకంటే ఇరాన్లో ఆ రకం ట్రక్లు సర్వసాధారణం. దీనికి పలు దిక్కుల్లో కెమెరాలను అమర్చింది. చుట్టుపక్కల పరిసరాలు కూడా కమాండ్ కంట్రోల్ రూమ్లోని వ్యక్తికి తెలియడానికి ఇవి ఉపయోగపడతాయి. ట్రక్లో భారీగా పేలుడు పదార్థాలను నింపింది. దీనిని సిద్ధం చేసిన అపరేటర్లు వెంటనే దేశం దాటేశారు.
గురి తప్పకుండా ప్రోగ్రామ్..!
ఇక ట్రక్పై అమర్చిన రోబో మిషిన్ గన్ కాల్చే సమయంలో కదులుతుంది. దీంతో తర్వాతి బుల్లెట్లు గురితప్పుతాయి. పైగా ఫక్రిజాదె కారు ప్రయాణిస్తుంటుంది. ఆ రోబో, కెమెరాల నుంచి కమాండ్ కంట్రోల్కు సమాచారం వెళ్లి.. అక్కడ ఆపరేటర్ స్పందన తిరిగి రోబోకు చేరేందుకు కనీసం 1.6 సెకన్ల సమయం పడుతుందని లెక్కగట్టింది. ఈ ఆలస్యాన్ని, కారు వేగాన్ని, గన్ కదలికల నుంచి వచ్చే సమస్యలను తప్పించేందుకు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో ప్రోగ్రామ్ చేసింది. దీంతో ఫక్రిజాదె పక్కన కూర్చున్న ఆయన భార్య కూడా ఈ దాడిలో గాయపడలేదు.
ఇక కారులో ఫక్రిజాదె కూర్చున్న సీట్ను నిర్ధారించుకొనేందుకు ఒక వాహనంపై కెమెరాను అమర్చింది. దానిని టైర్ తొలగించి జాకీపై నిలబెట్టి యూటర్న్ వద్ద ఉంచింది. ఆ మార్గంలో ఫక్రిజాదె ప్రయాణించనున్నారు. అక్కడి చిత్రాలను విశ్లేషించి కారులో ఆయన సీటును ఆపరేటర్లు నిర్ధారించుకొన్నారు. అదే సమయంలో ఆ రోడ్డుపై అమర్చిన సీసీకెమెరాలను పనిచేయకుండా చేశారు.
ఆ ఒక్క విషయంలో మొస్సాద్ విఫలం..
హత్య తర్వాత జామ్యద్ ట్రక్ను పేల్చేసే విషయంలో మొస్సాద్ అంచనాలు తప్పాయి. ట్రక్ను అయితే పేల్చింది.. కానీ, ఆ పేలుడు తీవ్రతకు దానిలోని చాలా సామాగ్రి గాల్లోకి చిందరవందర అయ్యాయి. కానీ, ధ్వంసం కాలేదు. దీంతో ఈ హత్యలో రోబో పాత్రను ఇరాన్ దర్యాప్తు సంస్థలు చాలా వేగంగానే పసిగట్టాయి. కానీ, ఐఆర్జీసీ పరువును దృష్టిలో పెట్టుకొని బహిరంగంగా అంగీకరించడంలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘చొరబాటుదారు’ వ్యాఖ్యలు.. మోదీపై ఫిర్యాదును పరిశీలిస్తున్నామన్న ఈసీ..!
ఇటీవల ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ (Modi) చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. వాటిపై అందిన ఫిర్యాదు ఈసీ పరిశీలనలో ఉందని సమాచారం. -
కేజ్రీవాల్, కవిత జ్యుడీషియల్ కస్టడీ మళ్లీ పొడిగింపు
దిల్లీ మద్యం కేసులో అరెస్టయిన సీఎం అరవింద్ కేజ్రీవాల్, భారాస ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని కోర్టు మరోసారి పొడిగించింది. -
నూడుల్స్లో రూ.6 కోట్ల బంగారం, వజ్రాలు!
నూడుల్స్లో వజ్రాలు, బంగారం దాచి అక్రమ రవాణాకు పాల్పడిన నలుగురు ప్రయాణికులను ముంబయి కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు. -
జైల్లో కేజ్రీవాల్కు ఇన్సులిన్.. మరి ఇప్పుడు ఎందుకు ఇచ్చారన్న ఆప్
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు సోమవారం రాత్రి జైల్లో ఇన్సులిన్ అందజేసినట్లు ఆప్ ప్రకటించింది. -
అంకుల్.. మా బడిని ఇలా చేశారేంటి?
పోలింగ్ విధులకు వచ్చి.. పాఠశాలను అపరిశుభ్రం చేసిన అధికారులను ఉద్దేశించి ప్రశ్నలు సంధించిన ఓ చిన్నారి వీడియో తమిళనాట వైరల్ అవుతోంది. -
మరో ఐదురోజులు భగభగలు.. ఐఎండీ వెల్లడి
దేశంలోని పలు ప్రాంతాల్లో మరో ఐదు రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు కొనసాగొచ్చని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం తెలిపింది. -
30 వారాల గర్భవిచ్ఛిత్తికి అనుమతి
అత్యాచారానికి గురై గర్భం దాల్చిన 14 ఏళ్ల బాలిక కేసులో సుప్రీంకోర్టు అసాధారణ నిర్ణయం తీసుకుంది. బాలిక సంక్షేమం, భవిష్యత్తుకు అత్యధిక ప్రాధాన్యమిస్తూ దాదాపు 30 వారాల ఆమె గర్భాన్ని తొలగించేందుకు అనుమతించింది. -
సీయూఈటీ-యూజీ, నెట్ స్కోర్ల నార్మలైజేషన్ ఎత్తివేత : యూజీసీ
కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ -యూజీ, నేషనల్ ఎలిజిబులిటీ టెస్ట్ (నెట్) స్కోర్ల నార్మలైజేషన్ (సాధారణీకరణ)ను ఈ ఏడాది నుంచి ఎత్తివేస్తున్నట్లు యూజీసీ చీఫ్ జగదీప్ కుమార్ తెలిపారు. -
అభిషేక్ బెనర్జీ ఇంటి ముందు రెక్కీ
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, టీఎంసీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ ఇంటిముందు రెక్కీ నిర్వహించాడన్న కారణంతో ఓ నిందితుడిని కోల్కతా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
బెంగాల్ పాఠశాలల్లో 25 వేల నియామకాలు రద్దు
పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వ ప్రాయోజిత, ఎయిడెడ్ పాఠశాలల్లో నియామకాల కోసం 2016లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఎంపిక పరీక్ష (ఎస్ఎల్ఎస్టీ)పై కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. -
కేజ్రీవాల్కు ఇన్సులిన్పై మెడికల్ బోర్డు ఏర్పాటు చేయండి
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు గల మధుమేహ వ్యాధికి ఇన్సులిన్ ఇవ్వాల్సిన అవసరముందా? లేదా? అని తేల్చేందుకు మెడికల్ బోర్డును ఏర్పాటు చేయాలంటూ ఎయిమ్స్ డైరెక్టర్ను దిల్లీ కోర్టు సోమవారం ఆదేశించింది. -
2జీ స్పెక్ట్రమ్పై 2012 తీర్పును సవరించండి
వేలం ద్వారా మాత్రమే 2జీ స్పెక్ట్రమ్ కేటాయింపులు, బదిలీలు జరగాలంటూ 2012లో వెలువరించిన తీర్పును సవరించాలని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. -
ఎన్నికలకు ఎండల దెబ్బపై ఆందోళన వద్దు
లోక్సభ రెండోదశ ఎన్నికలకు ఎండల దెబ్బపై పెద్దగా కలవరపడాల్సిందేమీ లేదని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం కేంద్ర ఎన్నికల సంఘానికి తెలిపింది. -
‘దివ్యాంగుల హక్కుల చట్టం అమలు అత్యంత దారుణం’
దివ్యాంగుల హక్కుల చట్టం-2016ను అమలు చేయడంలో జరుగుతున్న జాప్యంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. -
‘హైస్కూల్ తర్వాతే లా ప్రాక్టీస్ చేస్తే పోలే’
12వ తరగతి తర్వాత అయిదేళ్లు చదవాల్సిన ఎల్ఎల్బీ కోర్సును మూడేళ్లకు తగ్గించడంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు ఓ నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఆదేశాలు జారీచేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. -
ఎన్కౌంటర్ మృతులపై రివార్డు రూ.1.85 కోట్లు
ఛత్తీస్గఢ్ రాష్ట్రం కాంకేర్ జిల్లాలో ఇటీవల జరిగిన ఎన్కౌంటర్లో సుమారు 29 మంది వివిధ క్యాడర్లకు చెందిన మావోయిస్టు నేతలు మృతి చెందిన సంగతి తెలిసిందే. -
అది బెయిల్ షరతుల ఉల్లంఘనే
లఖింపుర్ ఖేరి హింస ఘటనలో నిందితుడైన ఆశిష్ మిశ్ర రాజకీయ కార్యక్రమాలకు స్వయంగా హాజరైతే అది బెయిల్ నిబంధనల ఉల్లంఘనేనని సుప్రీం కోర్టు సోమవారం వ్యాఖ్యానించింది. -
మీది ఉక్కు సంకల్పం
భారత్కు సంబంధించి ధైర్యం, పట్టుదల, సంకల్పానికి సియాచిన్ రాజధానిగా ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. -
దిల్లీ డంపింగ్ యార్డులో భారీ అగ్ని ప్రమాదం
దేశ రాజధాని దిల్లీలోని గాజీపుర్ డంపింగ్ యార్డులో భారీ మంటలు చెలరేగి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. -
అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయానికి తొలి మహిళా వీసీ
వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ప్రఖ్యాత అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం (ఏఎంయూ) ఉప కులపతి (వీసీ)గా నయీమా ఖాతూన్ నియమితులయ్యారు. -
రాహుల్పై పరువు నష్టం కేసు.. విచారణ మే 2కు వాయిదా
కేంద్ర హోం మంత్రి అమిత్షాను ఉద్దేశించి ఆరేళ్ల క్రితం కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్గాంధీ చేసిన వ్యాఖ్యలపై విచారణను ఉత్తర్ప్రదేశ్ ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు మే 2కు వాయిదా వేసింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
రివ్యూ: ఆర్టికల్ 370.. యామి గౌతమ్, ప్రియమణి నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
మద్యం మత్తులో విమాన సిబ్బందిపై ప్రయాణికుడి దాడి
-
వరుసగా మూడో రోజూ లాభాల్లో ముగిసిన సూచీలు
-
‘చొరబాటుదారు’ వ్యాఖ్యలు.. మోదీపై ఫిర్యాదును పరిశీలిస్తున్నామన్న ఈసీ..!
-
వాట్సప్లో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫొటోలు పంపించొచ్చు!