Corona: చిన్నారుల చికిత్సకు ఆ మందులు వద్దు
కరోనా చికిత్సకు సూచించిన ఐవర్ మెక్టిన్, హైడ్రాక్సీక్లోరోక్విన్, ఫేవిపిరవిర్, యాంటీ బయోటిక్స్ వంటివి చిన్నారుల చికిత్సకు సిఫార్సు చేయలేదని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ మేరకు బుధవారం నూతన మార్గదర్శకాలు జారీ చేసింది.
నూతన మార్గదర్శకాలు జారీ చేసిన కేంద్ర ఆరోగ్య శాఖ
దిల్లీ: కరోనా చికిత్సకు సూచించిన ఐవర్ మెక్టిన్, హైడ్రాక్సీక్లోరోక్విన్, ఫేవిపిరవిర్, యాంటీ బయోటిక్స్ వంటివి చిన్నారుల చికిత్సకు సిఫార్సు చేయలేదని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ మేరకు బుధవారం నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. కొవిడ్ కేసుల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్న నేపథ్యంలో చిన్నారుల కొవిడ్ కేర్ కోసం ప్రభుత్వం ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసింది. తీవ్రమైన కరోనాతో బాధపడుతున్న చిన్నారులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఈ సిఫార్సుల్లో తెలిపారు. చిన్నారులకు వ్యాక్సిన్ అందించాలన్న యోచనలో ఉన్న కేంద్రం దాని అనంతర చర్యల కోసం పలు సూచనలు చేసింది. తీవ్ర అనారోగ్యాలున్న చిన్నారులతో పాటు, పేదలకు టీకాలో మొదటి ప్రాధాన్యత నివ్వాలని సూచించింది.
అప్రమత్తత అవసరం..
లాక్డౌన్ సడలింపులు, పాఠశాలలు తిరిగి తెరవడం వంటి వాటి వల్ల చిన్నారులు వైరస్కు ఎక్కువగా ప్రభావితం అయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కరోనా సెకండ్ వేవ్లో పిల్లల సంరక్షణ కోసం అదనపు సౌకర్యాలు ఏర్పాటు చేశామని తెలిపింది. చిన్నారుల్లో నమోదయ్యే కరోనా కేసులకు సంబంధించిన పూర్తి వివరాలు అందుబాటులో ఉంచుకోవాలని రాష్ట్రాలకు సూచించింది. అలాగే చిన్నారుల కోసం ప్రత్యేకంగా వైద్య సిబ్బందిని అందించాలని కేంద్రం ఆ మార్గదర్శకాల్లో పేర్కొంది.
తల్లిదండ్రుల సంరక్షణలోనే..
చిన్నారుల్లో తక్కువ లక్షణాలుంటే వారు తల్లిదండ్రుల సంరక్షణలోనే ఉండొచ్చని కేంద్రం తెలిపింది. చికిత్స కోసం పారాసిటమాల్ను వాడాలని సూచించింది. శ్వాసక్రియ రేటు, ఆక్సిజన్ స్థాయిలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని తెలిపింది. తల్లిదండ్రులకు స్థానిక ఆరోగ్య కార్యకర్తలు అందుబాటులో ఉండాలని ఆరోగ్య శాఖ పేర్కొంది. వీలైనంత వరకు టెలీమెడిసిన్ సేవలను వినియోగించుకోవాలని సూచించింది. పెద్దవారితో పోలిస్తే పిల్లల్లో వైరస్ వ్యాప్తి, తీవ్రత తక్కువగా ఉన్నప్పటికీ అందరూ అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. మరోవైపు కరోనా నుంచి కోలుకున్న చిన్నారుల్లో ఎంఐఎస్-సీ పెరుగుతుండటంతో దానిపై పరిశోధనలు జరగాలని కేంద్రం పేర్కొంది. చిన్నారుల్లో కరోనాను పర్యవేక్షించేందుకు ప్రత్యేక పోర్టల్ను ప్రారంభించాలని ఆరోగ్యశాఖ సిఫార్సు చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)