నెగటివ్‌ వస్తేనే భారత్‌-నేపాల్‌కు అనుమతి

కొవిడ్ స్ట్రెయిన్‌ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో భారత్‌ అప్రమత్తమైంది. భారత్‌-నేపాల్‌ మధ్య కాళీ నదిపై ఉన్న 5 వంతెల ద్వారా రాకపోకలను కఠినతరం చేసింది. కరోనా పరీక్షల్లో నెగటివ్‌ వచ్చిన వారికే వంతెన గుండా ప్రవేశం కల్పిస్తారు. కరోనా నెగటివ్‌ వచ్చిన నేపాలీ ప్రజలనే భారత్‌ భూభాగంలోకి...

Published : 04 Jan 2021 23:30 IST

పిథోర్‌గఢ్‌: కొవిడ్ స్ట్రెయిన్‌ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో భారత్‌ అప్రమత్తమైంది. భారత్‌-నేపాల్‌ మధ్య కాళీ నదిపై ఉన్న 5 వంతెల ద్వారా రాకపోకలను కఠినతరం చేసింది. కరోనా పరీక్షల్లో నెగటివ్‌ వచ్చిన వారికే వంతెన ద్వారా ప్రవేశం కల్పిస్తారు. కరోనా నెగటివ్‌ వచ్చిన నేపాలీ ప్రజలనే భారత్‌ భూభాగంలోకి అనుమతిస్తామని అధికారులు తేల్చి చెప్పారు. భారత్‌ నుంచి నేపాల్‌కు వెళ్లాలనుకున్నవారికీ ఇదే నిబంధన వర్తిస్తుందన్నారు.

భారత్‌-నేపాల్‌ మధ్య రాకపోకలకు సంబంధించిన నిబంధనలు జనవరి 1 నుంచే అమల్లోకి తెచ్చినట్లు పిథోర్‌గఢ్‌ జిల్లా మెజిస్ట్రేట్‌ జోగ్‌దండే వెల్లడించారు. బ్రిటన్‌తోపాటు భారత్‌లోనూ స్ట్రెయిన్‌ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. తాజా నిబంధనల ప్రకారం ఎవరైనా నేపాల్‌ పౌరులు భారత్‌లోకి రావాలనుకుంటే క్రాసింగ్‌ వంతెనపై కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తారు. అందులో నెగటివ్‌ వచ్చిన వారికే సరిహద్దులు దాటే అవకాశముంటుంది. పిథోర్‌గఢ్‌ జిల్లా పరిధిలో భారత్‌-నేపాల్‌ మధ్య ఉన్న 5 వంతెన మార్గాల్లోనూ ఇవే నిబంధనలు వర్తించనున్నాయి.

ఇదీ చదవండి

ఏడోసారీ కొలిక్కిరాని చర్చలు..మళ్లీ 9న!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని