- TRENDING TOPICS
- Ind vs Zim
- Monkeypox
నెగటివ్ వస్తేనే భారత్-నేపాల్కు అనుమతి
పిథోర్గఢ్: కొవిడ్ స్ట్రెయిన్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో భారత్ అప్రమత్తమైంది. భారత్-నేపాల్ మధ్య కాళీ నదిపై ఉన్న 5 వంతెల ద్వారా రాకపోకలను కఠినతరం చేసింది. కరోనా పరీక్షల్లో నెగటివ్ వచ్చిన వారికే వంతెన ద్వారా ప్రవేశం కల్పిస్తారు. కరోనా నెగటివ్ వచ్చిన నేపాలీ ప్రజలనే భారత్ భూభాగంలోకి అనుమతిస్తామని అధికారులు తేల్చి చెప్పారు. భారత్ నుంచి నేపాల్కు వెళ్లాలనుకున్నవారికీ ఇదే నిబంధన వర్తిస్తుందన్నారు.
భారత్-నేపాల్ మధ్య రాకపోకలకు సంబంధించిన నిబంధనలు జనవరి 1 నుంచే అమల్లోకి తెచ్చినట్లు పిథోర్గఢ్ జిల్లా మెజిస్ట్రేట్ జోగ్దండే వెల్లడించారు. బ్రిటన్తోపాటు భారత్లోనూ స్ట్రెయిన్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. తాజా నిబంధనల ప్రకారం ఎవరైనా నేపాల్ పౌరులు భారత్లోకి రావాలనుకుంటే క్రాసింగ్ వంతెనపై కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తారు. అందులో నెగటివ్ వచ్చిన వారికే సరిహద్దులు దాటే అవకాశముంటుంది. పిథోర్గఢ్ జిల్లా పరిధిలో భారత్-నేపాల్ మధ్య ఉన్న 5 వంతెన మార్గాల్లోనూ ఇవే నిబంధనలు వర్తించనున్నాయి.
ఇదీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Vaccine: ఆరు నెలల్లోపే ఒమిక్రాన్ను ఎదుర్కొనే వ్యాక్సిన్..!
-
Sports News
Asia Cup : ఆసియా కప్ నెగ్గేందుకు భారత్కే ఎక్కువ అవకాశాలు..!
-
India News
Nitish kumar: 10లక్షలు కాదు.. 20లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యం: నీతీశ్
-
Sports News
Umran Malik : ఉమ్రాన్ మాలిక్ అరుదైన బౌలర్.. అయితే అలా చేయడం నాకు నచ్చదు!
-
Sports News
Sourav Ganguly: పాక్తో మ్యాచ్లను ఏనాడూ ప్రత్యేకంగా భావించలేదు: గంగూలీ
-
India News
Karnataka: సావర్కర్- టిప్పుసుల్తాన్ ఫ్లెక్సీల వివాదం.. శివమొగ్గలో తీవ్ర ఉద్రిక్తత!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Putin: కిమ్కు పుతిన్ లేఖ.. ఏమన్నారంటే!
- Indian Army: సియాచిన్లో తప్పిపోయిన జవాన్.. 38 ఏళ్ల తర్వాత లభ్యమైన మృతదేహం
- Assam: లక్ష కేసుల్ని ఉపసంహరించుకుంటాం.. సీఎం హిమంత ప్రకటన
- NTR 31: ‘ఎన్టీఆర్ 31’ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్.. అదేంటంటే?
- Anita Bose: నేతాజీ అస్థికలు తెప్పించండి.. డీఎన్ఏ పరీక్షతో నిజం తేలుతుంది
- Crime News: బీదర్లో ఘోర రోడ్డు ప్రమాదం.. చిన్నారి సహా ఆరుగురు హైదరాబాద్ వాసులు మృతి
- Flight: గర్ల్ఫ్రెండ్తో చాటింగ్.. ఆరు గంటలు ఆగిపోయిన విమానం
- Anand Mahindra: జెండా ఎగురవేసేందుకు వృద్ధ జంట ప్రయాస.. ఆనంద్ మహీంద్రా ఎమోషనల్ పోస్ట్
- Karnataka: సావర్కర్- టిప్పుసుల్తాన్ ఫ్లెక్సీల వివాదం.. శివమొగ్గలో తీవ్ర ఉద్రిక్తత!
- SBI: అమృతోత్సవాల వేళ.. ఎస్బీఐ సరికొత్త ‘ఉత్సవ్’ పథకం